Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇండోనేషియాలో ఘోర రోడ్డు ప్రమాదం: 27మంది మృతి.. 35 మందికి గాయాలు

Webdunia
గురువారం, 11 మార్చి 2021 (10:08 IST)
ఇండోనేషియాలోని జావాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జావా ప్రావిన్స్‌ సుబంగ్‌ పట్టణం నుండి బయలు దేరిన పర్యాటక బస్సు లోయలో పడిపోవడంతో 27మంది ప్రయాణీకులు మృతి చెందారు. డ్రైవర్‌తో సహా మరో 35 మంది గాయపడ్డారు. బస్సు బ్రేకులు ఫేయిల్‌ కావడంతోనే ఈ ప్రమాదం చోటుచేసుకుందని అధికారులు తెలిపారు. 
 
ఇస్లామిక్‌ జూనియర్‌ హైస్కూల్‌ విద్యార్థులు, వారి తల్లిదండ్రులను తాసిక్మాలయ జిల్లాలోని ఓ తీర్థయాత్రకు తీసుకెళ్తుండగా బస్సు లోయలో పడిపోయింది. బుధవారం అర్ధరాత్రి ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. 
 
వాహనం డ్రైవర్‌ బస్సుపై నియంత్రణ కోల్పోవడంతో సుమారు 20 అడుగుల లోతులో ఉన్న లోయలో బస్సు పడిపోయిందని పేర్కొన్నారు. సువేదాంగ్‌ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుందని తెలిపారు. అయితే, ప్రాణాలతో బయటపడ్డ బాధితులంతా వాహనం బ్రేకులు సరిగా పనిచేయలేదని అధికారులకు తెలిపారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments