Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్‌కు వాత పెట్టిన సౌదీ సర్కారు!!

Webdunia
బుధవారం, 12 ఆగస్టు 2020 (17:50 IST)
పాకిస్థాన్‌కు సౌదీ ప్రభుత్వం వాత పెట్టింది. కాశ్మీర్ అంశంలో తమకు వంతపాడటం లేదని పేర్కొంటూ సౌదీ సర్కారును తప్పుబట్టేందుకు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యాఖ్యలపై సౌదీ సర్కారు ఆగ్రహం వ్యక్తం చేసింది. తాము అందించిన 3 బిలియన్ డాలర్ల రుణంలో ఒక బిలియన్ డాలర్లను నిర్మొహమాటంగా వసూలు చేసింది. మిగతా రెండు బిలియన్ డాలర్ల రుణంపై ఒత్తిడి పెంచింది. 
 
కాగా, కాశ్మీర్ అంశంలో భారత్‌పై సౌదీ అరేబియాను ఎగదోయాలనుకున్న పాకిస్థాన్‌కు ఊహించని పరిణామం ఎదురైంది. సౌదీ అరేబియా నాయకత్వంలోని ఇస్లామిక్ సహకార సంఘం (ఓఐసీ) కాశ్మీర్ అంశంలో తగిన రీతిలో స్పందించడంలేదని, ఈ పరిణామం రెండు దేశాల మధ్య సంబంధాల క్షీణతకు దారితీయవచ్చని పాక్ హెచ్చరిక ధోరణిలో వ్యాఖ్యలు చేసింది. 
 
ఓఐసీలో చీలికలు వచ్చే అవకాశం కూడా ఉందని పాక్ విదేశాంగ మంత్రి బెదిరింపు స్వరం వినిపించారు. 57 దేశాల సభ్యత్వం ఉన్న ఓఐసీని కాశ్మీర్ అజెండాపై సమావేశపర్చడంలో విఫలమవుతున్నారంటూ ఆరోపణలు చేసింది. అంతేకాదు, కాశ్మీర్ అంశంపై తామే ఓఐసీని సమావేశపర్చుతామని అన్నారు.  
 
అయితే, ఈ వ్యాఖ్యలను సౌదీ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. తాము అందించిన 3.2 బిలియన్ డాలర్ల విలువైన చమురును సౌదీ నుంచి రాయితీపై పొందే ఒప్పందం కూడా పాక్‌కు దూరంకానుంది. ఇటీవల ఒప్పందం ముగిసినా మరో రెండేళ్లు పొడిగించే అవకాశం ఉన్నప్పటికీ, పాక్ తీరుపట్ల ఆగ్రహంతో ఉన్న సౌదీ ఆ దిశగా ప్రయత్నాలను విరమించుకుంది. దాంతో పాక్ పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

తర్వాతి కథనం
Show comments