Webdunia - Bharat's app for daily news and videos

Install App

శరవేగంగా పెరుగుతున్న ఈజిప్ట్ జనాభా

Webdunia
గురువారం, 13 ఫిబ్రవరి 2020 (14:44 IST)
ఈజిప్ట్‌ జనాభా శరవేగంగా పెరుగుతోంది. ఫలితంగా ఆ దేశ జనాభా పది కోట్ల స్థాయికి చేరింది. ఈ విషయాన్ని ఆ దేశ జాతీయ గణాంకాల సంస్థ వెల్లడించింది. పరిమిత వనరులతో ఇప్పటికే తలకు మించిన జనాభా భారంతో వున్న దేశానికి ఈ పెరుగుదల సమస్యను మరింత జటిలం చేస్తోందని ఈ సంస్థ వ్యాఖ్యానించింది. 
 
గతంలో 2017లో ఈజిప్ట్‌లో జనగణన తరువాత ఇప్పుడు 70 లక్షల మంది అదనంగా చేరారు. ఏటా 2.8 శాతం వంతున 1960 తరువాత ఇప్పటి వరకూ ఈజిప్ట్‌ జనాభా మూడు రెట్లకు పైగా పెరిగినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఈ పెరుగుదల 1982లో గరిష్ట స్థాయిలో నమోదు కావటం విశేషం. 
 
అరబ్‌ ప్రపంచంలో ఇథియోపియా, నైజీరియా తరువాత అత్యధిక జనాభా కలిగిన దేశం ఈజిప్ట్‌ కావటం విశేషం. తాజా గణాంకాల ప్రకారం దేశంలో ప్రతి 17.9 సెకండ్ల వ్యవధిలో ఒక శిశుజననం జరుగుతున్నట్లు తెలుస్తోంది. దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య జనాభా పెరుగుదల అని, ఇది దేశ భద్రతను సైతం ప్రభావితం చేస్తోందని ప్రధాని ముస్తఫా మాడ్బలీ ఆందోళన వ్యక్తం చేశారు. 
 
ఈజిప్ట్‌ జనాభాలో 60 శాతానికి పైగా ప్రజలు 30 ఏళ్ల వయస్సున్న యువతరం. దీనితో అరబ్‌ దేశాలలో యువతరం ఎక్కువగా వున్న దేశంగా ఈజిప్ట్‌ రికార్డులకెక్కుతోంది. దేశంలో ప్రస్తుతం నిరుద్యోగిత 10 శాతానికి పైగా వున్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments