Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆమ్లెట్ తీసుకుని మేడ పైకి రా, 10 నిమిషాలు నాతో గడుపు: నర్సుకి వైద్యుడు వేధింపులు

Webdunia
గురువారం, 13 ఫిబ్రవరి 2020 (14:40 IST)
మహిళలపై వేధింపులు ఆగడంలేదు. ఎన్ని చట్టాలు తీసుకువచ్చినా కామాంధులు వాటిని చూసి భయపడటంలేదు. తమ వాంఛలను తీర్చుకునేందుకు పశువుల్లా ప్రవర్తిస్తున్నారు. తాజాగా నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి ప్రభుత్వాసుపత్రిలో పనిచేస్తున్న నర్సుకి వైద్యుడి నుంచి లైంగిక వేధింపులు ఎదురయ్యాయి. 
 
బాధితురాలు చెప్పిన వివరాలు ఇలా వున్నాయి. ఉదయగిరి ప్రభుత్వాసుపత్రిలో రవీంద్ర నాథ్ ఠాగూర్ అనే వ్యక్తి వైద్యుడిగా పనిచేస్తున్నాడు. డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళ్లిన స్టాఫ్ నర్సుకి సదరు వైద్యుడు కాల్ చేసి తనకు ఆమ్లెట్ కావాలని ఆఫర్ చేశాడు. అందుకు సరేనంటూ ఆసుపత్రి సిబ్బందిని పంపిస్తే ఆమ్లెట్ పంపుతానని చెప్పింది.
 
ఆసుపత్రి సిబ్బంది కాదు.. ఆమ్లెట్ తీసుకుని నువ్వే ఇక్కడికి రా అని కోరాడు. దానితో ఆమె ఆమ్లెట్ తీసుకుని ఆసుపత్రికి వెళ్లింది. ఇంతలో మళ్లీ ఫోన్ చేసి మేడపైన గదిలో వున్నాననీ, ఆమ్లెట్ తీసుకుని పైకి వచ్చి తనతో 10 నిమిషాలు ఏకాంతంగా గడపాలంటూ అడిగాడు. వైద్యుడి మాటలతో షాక్ తిన్న నర్సు విషయాన్ని ఇంట్లో తెలిపింది. దీనితో ఆమె కుటుంబ సభ్యులు వచ్చి వైద్యుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం