Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆమ్లెట్ తీసుకుని మేడ పైకి రా, 10 నిమిషాలు నాతో గడుపు: నర్సుకి వైద్యుడు వేధింపులు

Webdunia
గురువారం, 13 ఫిబ్రవరి 2020 (14:40 IST)
మహిళలపై వేధింపులు ఆగడంలేదు. ఎన్ని చట్టాలు తీసుకువచ్చినా కామాంధులు వాటిని చూసి భయపడటంలేదు. తమ వాంఛలను తీర్చుకునేందుకు పశువుల్లా ప్రవర్తిస్తున్నారు. తాజాగా నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి ప్రభుత్వాసుపత్రిలో పనిచేస్తున్న నర్సుకి వైద్యుడి నుంచి లైంగిక వేధింపులు ఎదురయ్యాయి. 
 
బాధితురాలు చెప్పిన వివరాలు ఇలా వున్నాయి. ఉదయగిరి ప్రభుత్వాసుపత్రిలో రవీంద్ర నాథ్ ఠాగూర్ అనే వ్యక్తి వైద్యుడిగా పనిచేస్తున్నాడు. డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళ్లిన స్టాఫ్ నర్సుకి సదరు వైద్యుడు కాల్ చేసి తనకు ఆమ్లెట్ కావాలని ఆఫర్ చేశాడు. అందుకు సరేనంటూ ఆసుపత్రి సిబ్బందిని పంపిస్తే ఆమ్లెట్ పంపుతానని చెప్పింది.
 
ఆసుపత్రి సిబ్బంది కాదు.. ఆమ్లెట్ తీసుకుని నువ్వే ఇక్కడికి రా అని కోరాడు. దానితో ఆమె ఆమ్లెట్ తీసుకుని ఆసుపత్రికి వెళ్లింది. ఇంతలో మళ్లీ ఫోన్ చేసి మేడపైన గదిలో వున్నాననీ, ఆమ్లెట్ తీసుకుని పైకి వచ్చి తనతో 10 నిమిషాలు ఏకాంతంగా గడపాలంటూ అడిగాడు. వైద్యుడి మాటలతో షాక్ తిన్న నర్సు విషయాన్ని ఇంట్లో తెలిపింది. దీనితో ఆమె కుటుంబ సభ్యులు వచ్చి వైద్యుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ యువ నటుడు కార్తిక్ ఆర్యన్‌తో శ్రీలీల డేటింగ్?

Sreeleela: డాక్టర్ కోడలు కావాలి.. కార్తీక్ ఆర్యన్‌తో శ్రీలీల ప్రేమాయణం..

Soundarya: నటి సౌందర్యది హత్య.. ప్రమాదం కాదు.. మోహన్ బాబుపై ఫిర్యాదు

Kiran Abbavaram: యాభై మందిలో నేనొక్కడినే మిగిలా, అందుకే ఓ నిర్ణయం తీసుకున్నా : కిరణ్ అబ్బవరం

శ్రీ రేవంత్ రెడ్డి ని కలవడంలో మోహన్ బాబు, విష్ణు ఆనందం- ఆంతర్యం!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను ఎలా తగ్గించాలి?

ఎర్ర జామకాయ దొరికితే తినేయండి

మహిళలు రోజువారీ ఆహారంలో నువ్వులు చేర్చుకుంటే? ఎలా తీసుకోవాలి?

అల్లంతో 5 అద్భుత ప్రయోజనాలు, ఏంటవి?

వైజాగ్‌ను ప్రకాశవంతంగా మార్చిన బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్

తర్వాతి కథనం