Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆక్సిజన్ కొరత: జర్మనీ నుంచి 23 మొబైల్ ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లు

Webdunia
శుక్రవారం, 23 ఏప్రియల్ 2021 (21:05 IST)
Army
దేశంలో కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ప్రజలు పెద్ద సంఖ్యలో కరోనా బారిన పడుతున్నారు. వైరస్ ప్రభావంతో ఎక్కువ మంది కరోనా రోగులు ఆక్సిజన్‌పై ఆధారపడుతున్నారు. ఆక్సిజన్ కొరత ఏర్పడిన కారణంగా కరోనా వ్యాధిగ్రస్థులు నానా తంటాలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో జర్మనీ నుంచి 23 మొబైల్ ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లను దిగుమతి చేసుకోవాలని రక్షణ శాఖ నిర్ణయించింది. 
 
దీని కోసం ఎమర్జెన్సీ నిధుల వినియోగానికి కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నాలుగు రోజుల కిందట అనుమతి ఇచ్చారు. దీంతో ఎక్కడికైనా తరలించే మొబైల్ ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాలను భారత్‌కు తీసుకువచ్చేందుకు సైనిక రవాణా విమానాలను సిద్ధం చేస్తున్నారు.
 
సంబంధిత ప్రక్రియలు పూర్తయితే వారం రోజుల్లో ఇవి దేశానికి చేరుతాయని రక్షణ మంత్రిత్వ శాఖ ప్రధాన అధికార ప్రతినిధి భరత్ భూషణ్ బాబు తెలిపారు. కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న ఏఎఫ్ఎంసీ ఆసుపత్రుల్లో ఈ ఆక్సిజన్ ప్లాంట్లను ఉంచుతారని చెప్పారు. 
 
ప్రతి ప్లాంట్ నిమిషానికి 40 లీటర్లు, గంటకు 2,400 లీటర్ల ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేస్తుందని వివరించారు. అవసరం మేరకు వీటిని ఎక్కడికైనా తరలించవచ్చని పేర్కొన్నారు. మరిన్ని ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాలను విదేశాల నుంచి దిగుమతి చేసుకునే అవకాశం ఉన్నదని వెల్లడించారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments