Webdunia - Bharat's app for daily news and videos

Install App

కవ్వింపు చర్యలు వద్దు.. పాకిస్థాన్‌కు అమెరికా వార్నింగ్

Webdunia
బుధవారం, 27 ఫిబ్రవరి 2019 (12:10 IST)
పుల్వామా ఉగ్రదాడి, భారత వైమానిక దళం మెరుపు దాడుల నేపథ్యంలో సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు పాల్పడవద్దని పాకిస్థాన్‌కు అమెరికా హెచ్చరించింది. అలాంటి చర్యలకు పూనుకుంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని తెలిపింది. 
 
వివరాలలోకి వెళ్తే... పుల్వామా ఉగ్రదాడులకు ప్రతిగా భారత్ మెరుపు దాడులు చేసింది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌ను అగ్రరాజ్యం అమెరికా పాకిస్థాన్‌ని మరోసారి హెచ్చరించింది. పాక్ గడ్డపై ఉన్న ఉగ్ర తండాల విషయంలో తగు చర్యలు చేపట్టాలని ఆదేశించింది. పాక్, భారత్‌ సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా విదేశాంగ సెక్రటరీ మైక్ పోంపియో ఓ ప్రకటన విడుదల చేశారు. 
 
ఈ ప్రకటనలో భారత్ చేపట్టిన ఎయిర్ స్ట్రైక్స్‌ని కౌంటర్ టెర్రరిజంలో భాగమని అభివర్ణించిన ఆయన పాక్‌పై సునిశిత వ్యాఖ్యలు చేస్తూ ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేయకుంటే పాకిస్థాన్‌కే నష్టం జరుగుతుందని హితవు పలుకుతూ ఉగ్రవాదంపై తీరు మార్చుకోవలసిందిగా పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు సూచించారు. 
 
భారత్‌పై కవ్వింపు చర్యలు తగవని కూడా హెచ్చరించారు. సరిహద్దుల్లో ఉద్రిక్తత తగ్గించాలని పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఖురేషీకి సూచించారు. ఫిబ్రవరి 26 దాడులపై తాను భారత విదేశాంగమంత్రి సుష్మా స్వరాజ్‌తో మాట్లాడానని.. సరిహద్దుల్లో శాంతి పరిరక్షణకు తోడ్పాటునందిస్తామని చెప్పినట్టు ప్రెస్‌నోట్‌లో మైక్ తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ "హరిహర వీరమల్లు" చిత్రం మళ్లీ వాయిదానా?

Tarun Bhaskar: నాన్న కి కో వస్తే కామన్ గా తిట్టే పదం బద్మాష్ : తరుణ్ భాస్కర్

Rana: నాయుడు కుటుంబం ఏ ప‌నిని అసంపూర్తిగా చేయ‌దు అనేదే రానా నాయుడు సీజ‌న్‌2

తెలుగు చిత్రాలపై నయనతారకు ఎందుకో అంత ఇష్టం??

Dhanush: ఎండలో చెప్పులు లేకుండా, చిరిగిన బట్టలు ధరించిన బిచ్చగాడిని : ధనుష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

తర్వాతి కథనం
Show comments