Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉగ్రవాదుల ఏరివేతకు ఇస్తే.. భారత్‌పై ప్రయోగిస్తారా?

Webdunia
ఆదివారం, 3 మార్చి 2019 (12:03 IST)
పాకిస్థాన్‌కు అమెరికా ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎఫ్-16 యుద్ధ విమానాలను ఉగ్రవాదుల ఏరివేతకు ఇచ్చిన విమానాలతో భారత్‌పై దాడులు చేయడాన్ని అమెరికా మండిపడింది. ఈ విమానాలను దుర్వినియోగం చేయడంపై మరింత సమాచారాన్ని అందజేయాల్సిందిగా పాకిస్థాన్‌కు స్పష్టంచేసింది. 
 
తమతో కుదుర్చుకున్న వినియోగ ఒప్పందాన్ని (ఎండ్ యూజర్ అగ్రిమెంట్‌ను) పాక్ ఉల్లంఘించి ఈ విమానాలను భారత్‌కు వ్యతిరేకంగా ఉపయోగించడంతో ఈ సమాచారాన్ని అడిగినట్టు అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది. బాలాకోట్‌లో ఉగ్రవాద శిబిరాలపై భారత్ జరిపిన వైమానిక దాడులకు ప్రతీకారంగా కాశ్మీర్‌లో భారత సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని వైమానిక దాడులకు దిగిన పాకిస్థాన్.. ఈ దాడుల కోసం అమెరికాలో తయారైన ఎఫ్-16 యుద్ధ విమానాలను ఉపయోగించిన విషయం తెలిసిందే. 
 
ఈ విషయాన్ని రుజువుచేసి పాక్ బండారాన్ని బట్టబయలు చేసేందుకు గురువారం భారత వాయుసేన (ఐఏఎఫ్) సదరు ఎఫ్-16 నుంచి పాక్ పైలట్లు ప్రయోగించిన అమ్రామ్ క్షిపణి భాగాలను బహిరంగపరిచింది. ఈ పరిణామాల గురించి తమకు తెలుసని, ఎఫ్-16 యుద్ధ విమానాల దుర్వినియోగంపై మరింత సమాచారాన్ని అందజేయాల్సిందిగా పాకిస్థాన్‌కు స్పష్టం చేస్తున్నామని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి పీటీఐ వార్తా సంస్థకు తెలిపారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments