Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉగ్రవాదుల ఏరివేతకు ఇస్తే.. భారత్‌పై ప్రయోగిస్తారా?

Webdunia
ఆదివారం, 3 మార్చి 2019 (12:03 IST)
పాకిస్థాన్‌కు అమెరికా ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎఫ్-16 యుద్ధ విమానాలను ఉగ్రవాదుల ఏరివేతకు ఇచ్చిన విమానాలతో భారత్‌పై దాడులు చేయడాన్ని అమెరికా మండిపడింది. ఈ విమానాలను దుర్వినియోగం చేయడంపై మరింత సమాచారాన్ని అందజేయాల్సిందిగా పాకిస్థాన్‌కు స్పష్టంచేసింది. 
 
తమతో కుదుర్చుకున్న వినియోగ ఒప్పందాన్ని (ఎండ్ యూజర్ అగ్రిమెంట్‌ను) పాక్ ఉల్లంఘించి ఈ విమానాలను భారత్‌కు వ్యతిరేకంగా ఉపయోగించడంతో ఈ సమాచారాన్ని అడిగినట్టు అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది. బాలాకోట్‌లో ఉగ్రవాద శిబిరాలపై భారత్ జరిపిన వైమానిక దాడులకు ప్రతీకారంగా కాశ్మీర్‌లో భారత సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని వైమానిక దాడులకు దిగిన పాకిస్థాన్.. ఈ దాడుల కోసం అమెరికాలో తయారైన ఎఫ్-16 యుద్ధ విమానాలను ఉపయోగించిన విషయం తెలిసిందే. 
 
ఈ విషయాన్ని రుజువుచేసి పాక్ బండారాన్ని బట్టబయలు చేసేందుకు గురువారం భారత వాయుసేన (ఐఏఎఫ్) సదరు ఎఫ్-16 నుంచి పాక్ పైలట్లు ప్రయోగించిన అమ్రామ్ క్షిపణి భాగాలను బహిరంగపరిచింది. ఈ పరిణామాల గురించి తమకు తెలుసని, ఎఫ్-16 యుద్ధ విమానాల దుర్వినియోగంపై మరింత సమాచారాన్ని అందజేయాల్సిందిగా పాకిస్థాన్‌కు స్పష్టం చేస్తున్నామని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి పీటీఐ వార్తా సంస్థకు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దళితుడిని అని తెలిశాకే.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.: బాబు మోహన్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments