Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ విద్యార్థికి అమెరికాలో జైలు శిక్ష, 14 లక్షల జరిమానా

Webdunia
గురువారం, 15 ఆగస్టు 2019 (12:23 IST)
అమెరికాలో ఉన్నత విద్య చదువుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన విద్యార్థికి ఏడాది జైలు శిక్ష, 14 లక్షల జరిమానా విధించింది అక్కడి స్థానిక కోర్టు. దాదాపు 66 కంప్యూటర్లు పాడు చేయడమే అతడు చేసిన నేరం. చిత్తూరు జిల్లాకు చెందిన ఆకుతోట విశ్వనాథ్ అనే స్టూడెంట్ వీసాపై అమెరికా వెళ్లాడు. అక్కడ న్యూయార్క్‌లోని ఓ యూనివర్శిటీలో ఎంఎస్ చదువుతున్నాడు. అయితే కావాలనే 66 కంప్యూటర్లలో యూఎస్బీ కిల్లర్ డివైజ్‌ని ఇన్సర్ట్ చేశాడు.
 
ఈ డివైజ్‌ని కంప్యూటర్‌లోని యూఎస్బీ పోర్టులో చేర్చినప్పుడు కంప్యూటర్‌లోని ఆన్‌బోర్డ్ కెపాసిటర్లు వేగంగా ఛార్జ్ అయ్యేలా చేస్తుంది. దాంతో పాటు పదే పదే డిశ్చార్జ్ అయ్యేలా ఒక అలర్టును పంపుతుంది. దీంతో యూఎస్బీ పోర్టు, ఎలక్ట్రికల్ సిస్టమ్ ఓవర్ లోడ్ అయ్యి అవి పాడవుతాయి. విశ్వనాథ్ ఫిబ్రవరి 14వ తేదీన ఇలా చేశాడు. దీంతో కాలేజీ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిబ్రవరి 22వ తేదీన విశ్వనాథ్‌ను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా… ఏడాది పాటు జైలు శిక్ష, 14 లక్షల జరిమానా విధించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej: వరుణ్ తేజ్ హీరోగా ఇండో-కొరియన్ హారర్-కామెడీ చిత్రం

'కన్నప్ప'ను ట్రోల్ చేస్తే శివుని ఆగ్రహానికి శాపానికి గురవుతారు : రఘుబాబు

నందమూరి బాలకృష్ణ ఆదిత్య 369 రీ రిలీజ్ విడుదల తేదీ మార్పు

Suhas: స్పిరిట్ లో పాత్ర ఫైనల్ కాలేదు, విలన్ పాత్రలంటే ఇష్టం : సుహాస్

David Warner : రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలకు క్రికెటర్ డేవిడ్ వార్నర్‌ సీరియస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Summer Drinks: పిల్లలకు వేసవిలో ఎలాంటి ఆరోగ్యకరమైన జ్యూస్‌లు ఇవ్వాలి?

White Pumpkin Juice: పరగడుపున తెల్ల గుమ్మడికాయ రసం-ఒక నెలలో ఐదు కిలోల బరువు డౌన్

మెనోపాజ్ సమతుల్యత: పని- శ్రేయస్సు కోసం 5 ముఖ్యమైన ఆరోగ్య చిట్కాలు

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments