అల్జీరియాలో కుప్పకూలిన మిలటరీ విమానం.. 257 మంది సజీవదహనం

అల్జీరియాకు చెందిన మిలటరీ విమానం కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో 257 మంది మృతి చెందారు. అల్జీర్స్‌కి సమీపంలోని బౌఫరిక్ సైనిక కేంద్రం నుంచి బెచార్ నగరానికి సమీపంలో 259 మందితో కూడిన ఇల్యుషిన్‌ 2–76 రవాణా విమా

Webdunia
గురువారం, 12 ఏప్రియల్ 2018 (10:50 IST)
అల్జీరియాకు చెందిన మిలటరీ విమానం కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో 257 మంది మృతి చెందారు. అల్జీర్స్‌కి సమీపంలోని బౌఫరిక్ సైనిక కేంద్రం నుంచి బెచార్ నగరానికి సమీపంలో 259 మందితో కూడిన ఇల్యుషిన్‌ 2–76 రవాణా విమానం, టేకాఫ్‌ అయిన కాసేపటికే  పొలాల్లో కుప్పకూలింది. దీంతో ఒక్కసారిగా మంటలు ఎగసిపడటంతో.. ప్రయాణీకుల్లో 257 మంది సజీవదహనమయ్యారు. ఇద్దరు మాత్రం స్వల్పగాయాలతో బయటపడ్డారు.
 
విమానంలోని మృతులంతా ఆర్మీకి చెందిన వారు, వారి కుటుంబ సభ్యులేనని సహాయక సిబ్బంది ప్రకటించారు. ఈ ప్రమాదంపై దర్యాప్తు జరుపుతున్నట్లు.. అధికారులు తెలిపారు. కానీ ప్రమాదానికి కారణం ఇంకా తెలియరాలేదని అధికారులు తెలిపారు.
 
2014లో ఉక్రెయిన్‌ గగనతలంలో ప్రయాణిస్తున్న మలేషియా విమానాన్ని వేర్పాటువాదులు కూల్చిన దుర్ఘటనలో 298 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత జరిగిన భారీ విమాన ప్రమాదం ఇదేనని అధికారులు వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వేధింపులు ధైర్యంగా ఎదుర్కోండి.. మహిళలకు ఐష్ పిలుపు

ఇకపై చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌కు విదేశీ విరాళాలు

Naveen Polishetty : భీమవరం బల్మా గీతంతో గాయకుడిగా అదరగొట్టిన నవీన్‌ పొలిశెట్టి

Manoj: కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు : మంచు మనోజ్

అశ్విని దత్ ప్రజెంట్స్ లో జయకృష్ణ ఘట్టమనేని చిత్రం శ్రీనివాస మంగాపురం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

తర్వాతి కథనం
Show comments