Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిల్ల మొసలిని పెద్ద మొసలిగా చేసిన మహిళా శాస్త్రవేత్త... దానికే ఆహారమైంది...

Webdunia
గురువారం, 17 జనవరి 2019 (19:04 IST)
క్రూర జంతువులను ఎన్నటికీ నమ్మరాదు అని చెప్పేందుకు మనకు ఎన్నో ఉదంతాలు వున్నాయి. మనిషి ఎంత మంచి చేసినా రక్తం రుచి మరిగిన జంతువులు అదను వస్తే అమాంతం చంపేసి చప్పరించేస్తాయి. ఇలాంటి దారుణమైన ఘటన ఇండోనేషియాలో జరిగింది. వివరాలు ఇలా వున్నాయి. 
 
ఇండోనేషియాలో ఓ మహిళా శాస్త్రవేత్తకు జంతువులంటే అమితమైన ప్రేమ. దాంతో ఓ పిల్ల మొసలిని తీసుకొచ్చి ఇంటికి సమీపంలోని ఓ మడుగులో వదిలి దానికి ఆహారం వేస్తూ మచ్చిక చేసుకుంది. అది అలాఅలా పెద్దదైంది. సుమారు 14 అడుగుల పొడవు పెరిగి బలిష్టంగా మారింది. ఎప్పటిలానే మహిళా శాస్త్రవేత్త మొసలి వద్దకు వెళ్లి ఆహారాన్ని వేస్తుండగా అకస్మాత్తుగా అది ఆమె చేయిని పట్టుకుంది.
 
ఏదో పెంపుడు జంతువే కదా అని అలా వదిలేసింది మహిళా శాస్త్రవేత్త. కానీ మొసలి తన పట్టును మరింత బిగించి ఆమె చేయిని కొరికి నమిలేసింది. ఆ తర్వాత మరింత ముందుకు ఉరికి ఆమెను పట్టుకుని పొట్ట భాగాన్ని తినేసింది. ఐతే ఘటనా సమయంలో అక్కడ ఎవరూ లేరు. ఆ తర్వాత ఆమె ఇంట్లో కనబడకపోయేసరికి సమీపంలో వెతగ్గా మడుగు వద్ద గుర్తుపట్టలేని స్థితిలో ఆమె మృతదేహం కనబడింది. ఈ దారుణం మొసలి వల్లనే అని తెలుసుకున్న వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వారు మొసలిని పట్టుకుని జంతు సంరక్షణశాలకు తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dhanush: ఎండలో చెప్పులు లేకుండా, చిరిగిన బట్టలు ధరించిన బిచ్చగాడిని : ధనుష్

Sukumar: మిస్ వరల్డ్ థాయ్‌లాండ్ సుచతా చువాంగ్స్రీ తో దర్శకుడు సుకుమార్

Deepika: భారత చిత్ర పరిశ్రమలో పనిచేసే తల్లులకు మద్దతు లేదు-రాధికా ఆప్టే

Prabhas : ప్రభాస్ రాజాసాబ్ రిలీజ్ డేట్ వచ్చేసింది

Anushka: ఘాటి కోసం మూటాముల్లి తో కాలువ దాటుతున్న అనుష్క శెట్టి హైలైట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments