Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిల్ల మొసలిని పెద్ద మొసలిగా చేసిన మహిళా శాస్త్రవేత్త... దానికే ఆహారమైంది...

Webdunia
గురువారం, 17 జనవరి 2019 (19:04 IST)
క్రూర జంతువులను ఎన్నటికీ నమ్మరాదు అని చెప్పేందుకు మనకు ఎన్నో ఉదంతాలు వున్నాయి. మనిషి ఎంత మంచి చేసినా రక్తం రుచి మరిగిన జంతువులు అదను వస్తే అమాంతం చంపేసి చప్పరించేస్తాయి. ఇలాంటి దారుణమైన ఘటన ఇండోనేషియాలో జరిగింది. వివరాలు ఇలా వున్నాయి. 
 
ఇండోనేషియాలో ఓ మహిళా శాస్త్రవేత్తకు జంతువులంటే అమితమైన ప్రేమ. దాంతో ఓ పిల్ల మొసలిని తీసుకొచ్చి ఇంటికి సమీపంలోని ఓ మడుగులో వదిలి దానికి ఆహారం వేస్తూ మచ్చిక చేసుకుంది. అది అలాఅలా పెద్దదైంది. సుమారు 14 అడుగుల పొడవు పెరిగి బలిష్టంగా మారింది. ఎప్పటిలానే మహిళా శాస్త్రవేత్త మొసలి వద్దకు వెళ్లి ఆహారాన్ని వేస్తుండగా అకస్మాత్తుగా అది ఆమె చేయిని పట్టుకుంది.
 
ఏదో పెంపుడు జంతువే కదా అని అలా వదిలేసింది మహిళా శాస్త్రవేత్త. కానీ మొసలి తన పట్టును మరింత బిగించి ఆమె చేయిని కొరికి నమిలేసింది. ఆ తర్వాత మరింత ముందుకు ఉరికి ఆమెను పట్టుకుని పొట్ట భాగాన్ని తినేసింది. ఐతే ఘటనా సమయంలో అక్కడ ఎవరూ లేరు. ఆ తర్వాత ఆమె ఇంట్లో కనబడకపోయేసరికి సమీపంలో వెతగ్గా మడుగు వద్ద గుర్తుపట్టలేని స్థితిలో ఆమె మృతదేహం కనబడింది. ఈ దారుణం మొసలి వల్లనే అని తెలుసుకున్న వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వారు మొసలిని పట్టుకుని జంతు సంరక్షణశాలకు తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్‌లో విషాదం - నటుడు ఫిష్ వెంకట్ ఇకలేరు..

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments