Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా పేరు రాకిబ్, మదరసాలో చదువుకుంటున్న బాలికపై అత్యాచారం చేసాను...

Webdunia
మంగళవారం, 5 ఫిబ్రవరి 2019 (16:53 IST)
మహిళలపై అత్యాచారాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. ఎన్ని భద్రతా చర్యలు తీసుకుంటున్నా వాటిని ఆపడం ఎవరి తరం కావట్లేదు. కొన్ని దేశాలలో వీటికి సంబంధించి కఠినమైన చట్టాలు అమలులో ఉన్నాయి. మొన్నామధ్య అరబ్ దేశాలలో రేప్ చేసిన నేరస్తుడిని రెండు గంటల వ్యవధిలోనే పట్టుకుని నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా కాల్చి చంపారు. అయితే అన్ని దేశాలలో ఈ పరిస్థితి లేదు. న్యాయం జరగడంలో జాప్యం, చట్టాలలోని లొసుగులతో రేపిస్ట్‌లు సులభంగా తప్పించుకుంటున్నారు.
 
ఇదేవిధంగా బంగ్లాదేశ్‌లో న్యాయం జరగడంలో ఆలస్యమైందో ఏమో తెలియదు గానీ, ఒక వ్యక్తి రేపిస్టులను వరుసగా హత్య చేయడం మొదలుపెట్టాడు. అందరినీ ఒకేవిధంగా హత్య చేసి, మెడలో వారి నేరానికి సంబంధించిన వివరాలతో కాగితాన్ని ఉంచాడు. అతని పేరు హెర్క్యులస్. ప్రస్తుతం బంగ్లాదేశ్ పోలీసులకు కునుకు లేకుండా చేస్తున్న పేరు ఇది. 
 
మదరసాలో చదివే బాలికను కొంతమంది వ్యక్తులు గ్యాంగ్ రేప్ చేసారు. అందులో ఒకడైన రాకిబ్ అనే వ్యక్తిని చంపి, అతని మెడలో "నా పేరు రాకిబ్, మదరసాలో చదువుకుంటున్న బాలికపై అత్యాచారం చేసాను" అనే కాగితం ఉంచాడు. దానితో పాటుగా "రేపిస్ట్‌లు జాగ్రత్త" అంటూ హెచ్చరికను కూడా జోడించాడు. అలా వివిధ రేప్ కేసులో నిందితులుగా ఉన్న ముగ్గురిని చంపాడు హెర్క్యులస్ ఇప్పటికి. మరి పోలీసులు పట్టుకునేలోపు ఎంత మందిని చంపుతాడో మరి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

Pradeep: నటుడిగా గేప్ రావడానికి ప్రధాన కారణం అదే : ప్రదీప్ మాచిరాజు

షిర్డీ సాయిబాబా ఆలయాన్ని సందర్శించిన మోహన్ బాబు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

తర్వాతి కథనం