Webdunia - Bharat's app for daily news and videos

Install App

తొమ్మిదేళ్లకే రూ. 7 కోట్లు జాక్‌పాట్ గెలుచుకున్న లక్కీ గర్ల్

Webdunia
బుధవారం, 17 ఏప్రియల్ 2019 (15:49 IST)
ఒక భారతీయ బాలికకు దుబాయ్‌లో అదృష్టం వరించింది. తొమ్మిదేళ్ల వయసున్న ఆ అమ్మాయికి మిలియన్ డాలర్ల జాక్‌పాట్ గెలుచుకుని ఒక్కరోజులో కోటీశ్వరురాలైంది. అయితే ఈ అమ్మాయికి చిన్నప్పటి నుండే అదృష్టం వరిస్తోందట. 2013లో మూడేళ్ల వయస్సు ఉండగానే లగ్జరీ కారును గెలుచుకుని, మళ్లీ ఆరేళ్ల తర్వాత అంటే 2019లో మిలియన్ డాలర్ల లాటరీని గెలుచుకుంది.
 
వివరాల్లోకి వెళితే దుబాయిలో ప్రతి సంవత్సరం ‘దుబాయ్ డ్యూటీ ఫ్రీస్ మిలీనియమ్ మిలియనీర్’ పేరుతో లాటరీ నిర్వహిస్తుంటారు. దీని ప్రైజ్‌మనీ మిలియన్ డాలర్లు, భారతీయ కరెన్సీలో 7 కోట్ల రూపాయలు. అయితే ఈ ఏడాది ఎమ్. ఎలీజా అనే భారత సంతతి బాలిక తండ్రి ఈ లాటరీని ఆమె పేరుపై 0333 నంబర్ గల లాటరీ టిక్కెట్ కొన్నాడు. అదృష్టవశాత్తూ అతను కొనుగోలు చేసిన నంబర్‌కే లాటరీ తగలడంతో తన కూతురు అదృష్టవంతురాలని మురిసిపోతున్నాడు.
 
తాను దుబాయ్‌లో 19 ఏళ్లుగా ఉంటున్నానని, అయితే 15 ఏళ్లుగా ప్రతి ఏడాది ఈ లాటరీని కొంటున్నానని అతను చెప్పాడు. అతని లక్కీ నంబర్ 9 కావడంతో 0333 నంబర్ టిక్కెట్‌ను తన తొమ్మిదేళ్ల కూతురు పేరిట కొన్నానని, దానికే ప్రైజ్‌మనీ రావడంతో తన ఆనందానికి అవధులు లేవని చెబుతున్నాడు. కాగా ఈ లాటరీలో విజేతగా నిలిచిన 140వ భారతీయురాలిగా ఎలీజా రికార్డుకెక్కినట్లు అధికారులు పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

క్రంచిరోల్, సోనీ పిక్చర్స్ డీమన్ స్లేయర్: కిమెట్సు నో యైబా.. తెలుగులో రాబోతోంది

Suhas: హే భగవాన్! నాకు హిట్ వచ్చేలా చేయ్ : సుహాస్

ఒత్తిడిలో ఉంటే మద్యం సేవిస్తా : పవన్ కళ్యాణ్ హీరోయిన్

ప్రపంచ వేదికపై మూడు రంగులు జెండా సంతోషాన్ని కలిగిస్తోంది : విజయ్ దేవరకొండ, రష్మిక

Nidhi: ప్రభాస్ రాజా సాబ్ తో పాటు మరో హారర్ థ్రిల్లర్ చిత్రంలో నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments