Webdunia - Bharat's app for daily news and videos

Install App

తొమ్మిదేళ్లకే రూ. 7 కోట్లు జాక్‌పాట్ గెలుచుకున్న లక్కీ గర్ల్

Webdunia
బుధవారం, 17 ఏప్రియల్ 2019 (15:49 IST)
ఒక భారతీయ బాలికకు దుబాయ్‌లో అదృష్టం వరించింది. తొమ్మిదేళ్ల వయసున్న ఆ అమ్మాయికి మిలియన్ డాలర్ల జాక్‌పాట్ గెలుచుకుని ఒక్కరోజులో కోటీశ్వరురాలైంది. అయితే ఈ అమ్మాయికి చిన్నప్పటి నుండే అదృష్టం వరిస్తోందట. 2013లో మూడేళ్ల వయస్సు ఉండగానే లగ్జరీ కారును గెలుచుకుని, మళ్లీ ఆరేళ్ల తర్వాత అంటే 2019లో మిలియన్ డాలర్ల లాటరీని గెలుచుకుంది.
 
వివరాల్లోకి వెళితే దుబాయిలో ప్రతి సంవత్సరం ‘దుబాయ్ డ్యూటీ ఫ్రీస్ మిలీనియమ్ మిలియనీర్’ పేరుతో లాటరీ నిర్వహిస్తుంటారు. దీని ప్రైజ్‌మనీ మిలియన్ డాలర్లు, భారతీయ కరెన్సీలో 7 కోట్ల రూపాయలు. అయితే ఈ ఏడాది ఎమ్. ఎలీజా అనే భారత సంతతి బాలిక తండ్రి ఈ లాటరీని ఆమె పేరుపై 0333 నంబర్ గల లాటరీ టిక్కెట్ కొన్నాడు. అదృష్టవశాత్తూ అతను కొనుగోలు చేసిన నంబర్‌కే లాటరీ తగలడంతో తన కూతురు అదృష్టవంతురాలని మురిసిపోతున్నాడు.
 
తాను దుబాయ్‌లో 19 ఏళ్లుగా ఉంటున్నానని, అయితే 15 ఏళ్లుగా ప్రతి ఏడాది ఈ లాటరీని కొంటున్నానని అతను చెప్పాడు. అతని లక్కీ నంబర్ 9 కావడంతో 0333 నంబర్ టిక్కెట్‌ను తన తొమ్మిదేళ్ల కూతురు పేరిట కొన్నానని, దానికే ప్రైజ్‌మనీ రావడంతో తన ఆనందానికి అవధులు లేవని చెబుతున్నాడు. కాగా ఈ లాటరీలో విజేతగా నిలిచిన 140వ భారతీయురాలిగా ఎలీజా రికార్డుకెక్కినట్లు అధికారులు పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ సినిమాకు టిక్కెట్ రేట్లు పెంచండి... ఏఎం రత్నం వినతి

హరిహరవీరమల్లు టికెట్ ధర ఆమోదం కోరుతూ ఛాంబర్ కి అభ్యర్థన

Ali: రాజేంద్రప్రసాద్ గారు సరదాగా మాట తూలారు : అలీ స్పందన

పెళ్లి పుస్తకం నుంచి షష్టిపూర్తి వరకు ఎవరికీ దక్కనిది నాకు దక్కింది: డా. రాజేంద్ర ప్రసాద్

సాయి కుమార్ నటించిన చౌకీదార్ నుంచి నాన్న.. పాట విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments