Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆఫ్ఘన్‌లో భారతీయ ఇంజనీర్ల కిడ్నాప్

ఉగ్రవాదులకు స్వర్గధామంగా ఉండే ఆప్ఘనిస్థాన్‌లో ఏడుగురు భారతీయ ఇంజనీర్లు కిడ్నాప్‌కు గురయ్యారు. వీళ్లంతా మినీబస్సులో తాము పని చేసే విద్యుత్ కేంద్రానికి వెళుతుండగా గుర్తుతెలియని సాయుధలు బస్సును అడ్డగించి

Webdunia
ఆదివారం, 6 మే 2018 (17:13 IST)
ఉగ్రవాదులకు స్వర్గధామంగా ఉండే ఆప్ఘనిస్థాన్‌లో ఏడుగురు భారతీయ ఇంజనీర్లు కిడ్నాప్‌కు గురయ్యారు. వీళ్లంతా మినీబస్సులో తాము పని చేసే విద్యుత్ కేంద్రానికి వెళుతుండగా గుర్తుతెలియని సాయుధలు బస్సును అడ్డగించి కిడ్నాప్ చేశారు. ఈ విషయాన్ని బాగ్లాన్ పోలీసులు వెల్లడించారు. అక్కడి గవర్నమెంట్‌కు చెందిన పవర్ ప్లాంట్‌లో వీళ్లు పని చేస్తున్నారు. కాబుల్‌లోని ఇండియన్ ఎంబసీ కూడా కిడ్నాప్ విషయాన్ని వెల్లడించింది.
 
బాగ్లాన్‌లో ఉండే ప్రభుత్వ విద్యుత్ ప్లాంట్లలో సుమారు 150 మంది వరకు భారతీయ ఇంజనీర్లు పని చేస్తున్నారు. తమ విధులకు వెళ్లే నిమిత్తం ఆయా ప్లాంట్లకు చెందిన బస్సుల్లో వీరంతా వెళుతూ వస్తుంటారు. అలా ఒక బస్సులో వెళుతున్న ఏడుగురు ఇంజనీర్లను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. 
 
దీనిపై ఆప్ఘన్‌లోని ఇండియన్ ఎంబసీ అధికారులు తెలిపారు. వాళ్లను రిలీజ్ చేయించడానికి మా శాయశక్తులా ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. ఆఫ్ఘనిస్తాన్‌లో ఇలాంటి కిడ్నాప్‌లు కామన్. అక్కడి స్థానిక ప్రజలను కూడా డబ్బుల కోసం కిడ్నాప్ చేస్తుంటారు. కాని.. ఇండియన్ ఇంజినీర్లను కిడ్నాప్ చేయడంపై ఏదైనా ఎత్తుగడ ఉందా అనే అంశంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments