Webdunia - Bharat's app for daily news and videos

Install App

అధిక ఉష్ణోగ్రత కారణంగా చెలరేగిన కార్చిచ్చు... 51 మంది మృత్యువాత

ఠాగూర్
ఆదివారం, 4 ఫిబ్రవరి 2024 (12:59 IST)
చిలీ దేశంలో ఎండలు మండిపోతున్నాయి. పగటిపూట నమోదవుతున్న అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఆ దేశ ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ ఉష్ణోగ్రత కారణంగా కార్చిచ్చు చెలరేగింది. దీంతో ఇప్పటివరకు 51 మంది చనిపోయారని చిలీ దేశ అధ్యక్షుడు బోరిక్ గాబ్రియెల్ వెల్లడించారు. వేలాది మంది గాయపడినట్టు ఆయన పేర్కొన్నారు. వీరిలో కొంత మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెప్పారు. 
 
కార్చిచ్చు కారణంగా దాదాపు 1,100 ఇళ్లు మంటల్లో కాలిబూడిదైనట్లు తెలిపారు. వాల్ఫ‌రైజో ప్రాంతంలో మంటలు పెద్ద ఎత్తున చెలరేగుతున్న నేపథ్యంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తూనే స్థానిక ప్రజలను అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలంటూ పిలుపునిచ్చారు. సహాయక చర్యలు చేపడుతున్న వారికి సహకరించాలని బోరిక్ విజ్ఞప్తి చేశారు. 
 
కార్చిచ్చు కారణంగా మంటలు చాలా వేగంగా విస్తరిస్తున్నాయని.. వాటిని అదుపు చేసేందుకు వాతావరణ పరిస్థితులు అనుకూలించడం లేదని తెలిపారు. అధిక ఉష్ణోగ్రతలు, బలమైన గాలులు, స్వల్ప తేమ.. పరిస్థితులను మరింత దయనీయంగా మారుస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దేశ మధ్య, దక్షిణ ప్రాంతాల్లో దాదాపు 92 కార్చిచ్చులు చెలరేగినట్లు మంత్రి కరోలినా వెల్లడించారు. మంటల తీవ్రత అధికంగా ఉన్న వాల్ఫరైజో ప్రాంతం నుంచి ఇప్పటికే వేలాది మందిని పునరావాస కేంద్రాలకు తరలించామన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అర్జున్ కపూర్‌తో బ్రేకప్.. సంగక్కర పక్కనే కూర్చున్న మలైకా అరోరా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments