Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెరిగిన అక్రమ వలసలు - ట్రక్కులో 46 మృతదేహాలు

Webdunia
మంగళవారం, 28 జూన్ 2022 (12:24 IST)
అమెరికా - మెక్సికో దేశ సరిహద్దుల్లో అక్రమవలసలు పెరిగిపోయాయి. దీంతో అనేక మంది పౌరులు అమెరికా నుంచి బ్రెజిల్‌కు, బ్రెజిల్ నుంచి అమెరికాకు వలస పోతున్నారు. ఈ క్రమంలో టెక్సాస్‌లోని శాన్ ఆంటోనియాలో ఓ ట్రక్కులో 46 మంది వలసదారుల మృతదేహాలను అధికారులు గుర్తించారు. వీరంతా ఊపిరాడక చనిపోయినట్టు భావిస్తున్నారు. 
 
ట్రక్కు ట్రైయిలర్‌ల దాక్కుతున్న మరో 16 మందిని రక్షించి సమీపంలోని ఆస్పత్రికి తరలించినట్టు శాన్ ఆంటోనియా అగ్నిమాపకదళ విభాగం వెల్లడించింది. ఈ 16 మందిని నలుగురు మైనర్లు ఉన్నట్టు తెలిపారు. ఈ మనుషుల అక్రమ రవాణాకు సంబంధించి అమెరికా పోలీసులు ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. శాన్ ఆంటోనియో నగర శివారు ప్రాంతంలో ఈ ట్రక్కును గుర్తించిన పోలీసులు అనుమానంతో దీన్ని తనిఖీ చేయగా, ఈ దిగ్భ్రాంతికర విషయం వెలుగు చూసింది. 
 
అయితే, ఈ వలసదారుల మృతికి అధిక ఉష్ణోగ్రత కారణమై ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. ఎందుకంటే శాన్ ఆంటోనియాలో సోమవారం రికార్డు స్థాయిలో 103 డిగ్రీలో ఫారెన్ హీట్‌ ఉష్ణోగ్రత నమోదైంది. వలసదారుల మరణానికి ఇది ఓ కారణమై వుండొచ్చని అధికారులు భావిస్తున్నారు. గత 2017 జూలై నెలలో కూడా ఇదే విధంగా పది మంది వలసదారురు ప్రాణాలు కోల్పోయిన ఘటన కూడా కలకలంస సృష్టించిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments