Webdunia - Bharat's app for daily news and videos

Install App

లాటరీ టిక్కెట్‌ను భిక్షమేసింది.. అంతే ఆ నలుగురు లక్షాధికారులు అయ్యారు..

Webdunia
శనివారం, 10 అక్టోబరు 2020 (16:39 IST)
EUROS
బిచ్చగాళ్లకు లాటరీ తగిలింది. అంతే.. రూ.43 లక్షలు గెలుచుకుని లక్షాధికారులు అయ్యారు. వివరాల్లోకి వెళితే.. ఉపాధి లేకపోవడంతో ఓ నలుగురు బిచ్చగాళ్లుగా మారారు. వీరికి రోజూ పొట్ట గడవడమే కష్టంగా ఉండేది. బిచ్చమెత్తగా వచ్చిన డబ్బుతో కడుపు నింపుకునేవారు. అయితే వీరు లాటరీ టికెట్లు అమ్మే దుకాణం వద్ద బిచ్చమెత్తేవాళ్లు. ఎందుకంటే లాటరీ టికెట్లు కొనేందుకు అక్కడికి జనం ఎక్కువగా వస్తారనేది వీరి ప్లాన్‌. 
 
ఒకరోజు అక్కడికి ఓ యువతి వచ్చి లాటరీ టికెట్ కొనింది. పక్కనే ఉన్న ఈ నలుగురు బిచ్చగాళ్లు దానం చేమయని ప్రాధేయపడ్డారు. అయితే వీరు అడిగింది డబ్బు దానం చేయమని, కానీ ఆ యువతి మాత్రం చేతిలో ఉన్న లాటరీ టికెట్‌ను వీరికి బిచ్చమేసింది. దీంతో వీరు డబ్బులిచ్చి ఉంటే బాగుండేది ఎందుకూ పనికిరాని టికెట్ ఇచ్చి వెళ్లిందని గొనుక్కుంటూ ఆ టికెట్‌ను స్క్రాచ్ చేసి చూశారు.
 
టికెట్ చూడగానే ఆ నలుగురు షాకయ్యారు. వారికి లాటరీ తగలింది. పాపం రూ.87పెట్టి కొన్న ఆ యువతి టికెట్‌ను స్క్రాచ్ చేయకుండా ఎందుకు వీరికి బిచ్చమేసిందో కాని లక్ష్మీదేవి మాత్రం బిచ్చగాళ్లను కరుణించింది. లాటరీలో వీరు రూ.43 లక్షలు గెలుచుకున్నారు. దీంతో టికెట్ ఇచ్చిన మహిళను దేవతగా భావించారు. బిచ్చగాళ్లు లాటరీ గెలుచుకున్న సంగతి నిజమేనని ఫ్రెంచ్‌ లాటరీ ఆపరేటర్‌ ఎఫ్‌డీజే ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. 
 
యువతి దానం చేయడంతో లాటరీలో గెలుచుకున్న డబ్బులు వీరికే సొంతమని వెల్లడించింది. ఈ డబ్బుతో ఆ నలుగురు ఎవరికి వారు సొంతంగా వ్యాపారం చేసుకోవాలనుకుంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments