Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐరాస సీపీడీ సమావేశంలో భారతీయ ముగ్గురు మహిళలు

సెల్వి
మంగళవారం, 30 ఏప్రియల్ 2024 (12:16 IST)
UN population meet
త్రిపుర, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్ నుండి ఎన్నికైన ముగ్గురు మహిళా ప్రతినిధులు ఐక్యరాజ్యసమితి జనాభా అభివృద్ధి కమిషన్ (సీపీడీ) 57వ సెషన్‌లో పాల్గొంటున్నట్లు అధికారులు సోమవారం తెలిపారు.
 
న్యూయార్క్‌లో జరిగే యుఎన్‌ఎఫ్‌పిఎ (యునైటెడ్ నేషన్స్ ఫండ్ ఫర్ పాపులేషన్ యాక్టివిటీస్) ఈవెంట్‌లో గ్రామీణ భారతదేశానికి చెందిన ముగ్గురు మహిళా ప్రతినిధులు అట్టడుగు స్థాయిలో మహిళా నాయకత్వాన్ని ప్రదర్శిస్తారని త్రిపుర ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. 
 
ఐదు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో త్రిపురలోని సిపహిజాల జిల్లా పరిషత్‌ సభాధిపతి సుప్రియా దాస్‌ దత్తా, ఆంధ్రప్రదేశ్‌లోని పేకేరు గ్రామ పంచాయతీ సర్పంచ్‌ కునుకు హేమ కుమారి, రాజస్థాన్‌లోని లంబి అహిర్‌ గ్రామ పంచాయతీ సర్పంచ్‌ నీరు యాదవ్‌తో కలిసి పాల్గొంటారు. 
 
ఈ సందర్భంగా త్రిపుర పంచాయతీ విభాగం అదనపు డైరెక్టర్ ప్రసూన్ డే మాట్లాడుతూ, అట్టడుగు రాజకీయ నాయకత్వంలో మహిళలు పోషించే కీలక పాత్రను, స్థిరమైన అభివృద్ధికి వారి సహకారాన్ని హైలైట్ చేస్తామని చెప్పారు. ముగ్గురు మహిళలను పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ నామినేట్ చేయడంపై ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గుమ్మడికాయ కొట్టిన గేమ్ ఛేంజర్ - ఫ్యాన్స్ ఫిదా

అదే ఫీల్డ్ లో వర్క్ చేయడం ఆనందంగా వుంది : డార్లింగ్ ప్రొడ్యూసర్ చైతన్య రెడ్డి

అల్లు శిరీష్ బడ్డీ సినిమా నుంచి ఫీల్ ఆఫ్ బడ్డీ రిలీజ్

ప్రేక్షకుల మధ్య విజయ్ ఆంటోనీ యాక్షన్ ఫిల్మ్ తుఫాన్ ట్రైలర్ ఇంట్రడక్షన్

మిస్టర్ బచ్చన్ లో రవితేజ, భాగ్యశ్రీ బోర్సే పై సితార్ సాంగ్ షూట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పప్పు ఎందుకు తినాలో తెలుసా?

తట్టుకోలేని మైగ్రేన్ తలనొప్పి, ఈ చిట్కాలతో చెక్

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: బాదంపప్పుతో మీ చర్మానికి సంపూర్ణ పోషణ

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments