Webdunia - Bharat's app for daily news and videos

Install App

మణిపూర్‌లో హింస.. ముగ్గురు మృతి

Webdunia
శనివారం, 5 ఆగస్టు 2023 (13:06 IST)
మణిపూర్‌లోని బిష్ణుపూర్ జిల్లాలో శనివారం జరిగిన తాజా హింసాత్మక ఘటనలో వృద్ధుడు, అతని కుమారుడు సహా ముగ్గురు వ్యక్తులు మరణించారని పోలీసులు తెలిపారు.
 
అనుమానిత వ్యక్తులు క్వాక్తా లంఖై గ్రామంలో దాడి చేసి విచక్షణా రహితంగా ఇళ్లకు నిప్పు పెట్టారు. దీంతో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారని పోలీసు అధికారి తెలిపారు. ఈ దాడిలో కొంతమందికి కూడా గాయాలయ్యాయి.
 
దుండగులు ఇద్దరు గ్రామస్తులను కూడా కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది. దాడి కారణంగా గ్రామంలోని మిగిలిన నివాసితులు పారిపోయారు. పోలీసులు అదనపు బందోబస్తుతో ప్రాంతాలకు చేరుకుని మృతదేహాలను వెలికితీశారు.
 
మృతులను యుమ్నం పిషక్ మైతేయి (67), అతని కుమారుడు యుమ్నం ప్రేమ్‌కుమార్ మైతేయి (39), పొరుగునే ఉన్న యుమ్నం జితేన్ మైతేయి (46)గా గుర్తించారు. 
 
కాగా, మణిపూర్‌లో దాదాపు 3 నెలలుగా జరుగుతున్న ఘర్షణల్లో ఇప్పటి వరకు 160 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. వందలాదిమంది గాయపడ్డారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓజీ.. ఓజీ అని వెళితే... ప్రజలు క్యాజీ అంటూ ప్రశ్నిస్తారు : పవన్ కళ్యాణ్

జీబ్రా చిత్రం నుండి సత్యదేవ్ ఫస్ట్ లుక్ విడుదల

జపాన్ ప్రభాస్ ఫ్యాన్స్ ప్రత్యేకంగా హైదరాబాద్ వచ్చారు

ఇప్పుడే శ్రీలీలకు అది అర్థమైంది..?

సీనియర్ నటుడు, వ్యాఖ్యాత ఎ.వి. రమణ మూర్తి అమర్నాధ్ యాత్రలో కన్నుమూత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అత్యవసర న్యూరోసర్జరీతో 23 ఏళ్ల వ్యక్తిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

రోజూ తమలపాకు తినవచ్చా?

సహజంగా మెరుస్తున్న చర్మాన్ని పొందడంలో మీకు సహాయపడే 3 ప్రభావవంతమైన చిట్కాలు

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

తర్వాతి కథనం
Show comments