Webdunia - Bharat's app for daily news and videos

Install App

మణిపూర్‌లో హింస.. ముగ్గురు మృతి

Webdunia
శనివారం, 5 ఆగస్టు 2023 (13:06 IST)
మణిపూర్‌లోని బిష్ణుపూర్ జిల్లాలో శనివారం జరిగిన తాజా హింసాత్మక ఘటనలో వృద్ధుడు, అతని కుమారుడు సహా ముగ్గురు వ్యక్తులు మరణించారని పోలీసులు తెలిపారు.
 
అనుమానిత వ్యక్తులు క్వాక్తా లంఖై గ్రామంలో దాడి చేసి విచక్షణా రహితంగా ఇళ్లకు నిప్పు పెట్టారు. దీంతో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారని పోలీసు అధికారి తెలిపారు. ఈ దాడిలో కొంతమందికి కూడా గాయాలయ్యాయి.
 
దుండగులు ఇద్దరు గ్రామస్తులను కూడా కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది. దాడి కారణంగా గ్రామంలోని మిగిలిన నివాసితులు పారిపోయారు. పోలీసులు అదనపు బందోబస్తుతో ప్రాంతాలకు చేరుకుని మృతదేహాలను వెలికితీశారు.
 
మృతులను యుమ్నం పిషక్ మైతేయి (67), అతని కుమారుడు యుమ్నం ప్రేమ్‌కుమార్ మైతేయి (39), పొరుగునే ఉన్న యుమ్నం జితేన్ మైతేయి (46)గా గుర్తించారు. 
 
కాగా, మణిపూర్‌లో దాదాపు 3 నెలలుగా జరుగుతున్న ఘర్షణల్లో ఇప్పటి వరకు 160 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. వందలాదిమంది గాయపడ్డారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ రూ.4 కోట్లు తిరిగి ఇచ్చాడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments