Webdunia - Bharat's app for daily news and videos

Install App

మణిపూర్‌లో హింస.. ముగ్గురు మృతి

Webdunia
శనివారం, 5 ఆగస్టు 2023 (13:06 IST)
మణిపూర్‌లోని బిష్ణుపూర్ జిల్లాలో శనివారం జరిగిన తాజా హింసాత్మక ఘటనలో వృద్ధుడు, అతని కుమారుడు సహా ముగ్గురు వ్యక్తులు మరణించారని పోలీసులు తెలిపారు.
 
అనుమానిత వ్యక్తులు క్వాక్తా లంఖై గ్రామంలో దాడి చేసి విచక్షణా రహితంగా ఇళ్లకు నిప్పు పెట్టారు. దీంతో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారని పోలీసు అధికారి తెలిపారు. ఈ దాడిలో కొంతమందికి కూడా గాయాలయ్యాయి.
 
దుండగులు ఇద్దరు గ్రామస్తులను కూడా కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది. దాడి కారణంగా గ్రామంలోని మిగిలిన నివాసితులు పారిపోయారు. పోలీసులు అదనపు బందోబస్తుతో ప్రాంతాలకు చేరుకుని మృతదేహాలను వెలికితీశారు.
 
మృతులను యుమ్నం పిషక్ మైతేయి (67), అతని కుమారుడు యుమ్నం ప్రేమ్‌కుమార్ మైతేయి (39), పొరుగునే ఉన్న యుమ్నం జితేన్ మైతేయి (46)గా గుర్తించారు. 
 
కాగా, మణిపూర్‌లో దాదాపు 3 నెలలుగా జరుగుతున్న ఘర్షణల్లో ఇప్పటి వరకు 160 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. వందలాదిమంది గాయపడ్డారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

90 సెకన్ల డెడ్ హ్యాంగ్ ఛాలెంజ్‌ను స్వీకరించిన సమంత రూతు ప్రభు (video)

Lavanya Tripathi: పెండ్లిచేసుకున్న భర్తను సతీ లీలావతి ఎందుకు కొడుతోంది ?

మళ్లీ వార్తల్లో నిలిచిన సినీ నటి కల్పిక.. సిగరెట్స్ ఏది రా.. అంటూ గొడవ (video)

Cooli: నటీనటులతో రజనీకాంత్ కూలీ ట్రైలర్ అనౌన్స్ మెంట్ పోస్టర్ రిలీజ్

ANirudh: మనసులో భయం మరోపక్క మంచి సినిమా అనే ధైర్యం : విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments