Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముగ్గురి ప్రాణాలు తీసిన సరదా.. గడ్డకట్టిన సరస్సులో నడిచి..

Webdunia
బుధవారం, 28 డిశెంబరు 2022 (15:24 IST)
ఓ సరదా సంఘటన ముగ్గురి ప్రాణాలు హరించింది. గడ్డకట్టిన మంచులో నడవడం వల్ల వారు ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన వారంతా భారతీయులే కావడం గమనార్హం. ఈ విషాదకర ఘటన అరిజానా రాష్ట్రంలోని క్యానన్ సరస్సు వద్ద జరిగింది. 
 
అరిజోనా రాష్ట్రంలో గడ్డకట్టిన సరస్సుపై నడుచుకుంటూ మంచులూ పడి ఓ మహిళ సహా ముగ్గురు భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. ఈ నెల 26వ తేదీన మధ్యాహ్నం అరిజోనాలోని కోకోనినో కౌంటీలోని పుడ్స్ కాన్యన్ సరస్సు వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. 
 
మంచులో కూరుకునిపోయిన ఈ ముగ్గురిని సహాయక సిబ్బంది వెలికి తీసినప్పటికీ వారి ప్రాణాలను కాపాడలేకపోయారు. మృతులను నారాయణ ముద్దన, గోకుల్ మెడిసేటి, హరిత ముద్దనగా గుర్తించారు. వీరంతా అరిజోనా రాష్ట్రంలోని చాండ్లర్‌లో నివసిస్తున్నారు. 
 
ప్రస్తుతం నార్త్ అమెరికాలోని అనేక ప్రాంతాల్లో దట్టమైన మంచు తుఫాను కురుస్తున్న విషయంతెల్సిందే. దీంతో ఆ ప్రాంతాల వాసులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ మంచు తుఫాను కారణంగా ఇప్పటికే 60 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. వేలాది విమాన సర్వీసులు రద్దు చేశారు. గృహాలు, వాహనాలు కూడా దెబ్బతిన్నాయి. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments