Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేపాల్‌లో 26 మంది ఎంపీలకు కరోనా వైరస్!

Webdunia
సోమవారం, 10 మే 2021 (10:41 IST)
నేపాల్‌లో 26 మంది ఎంపీలు కరోనా వైరస్ బారినపడ్డారు. పార్ల‌మెంట్ సభ్యులందరికీ మొత్తం రెండు ద‌శ‌ల్లో ప‌రీక్ష‌లు చేయించారు. తొలి దశలో 18 మంది, రెండో దశలో 8 మంది వైరస్‌ బారినపడినట్లు నేపాల్‌ పార్లమెంట్‌ కార్యదర్శి గోపాల్‌నాథ్‌ యోగి తెలిపారు. 
 
క‌రోనా సోకిన ఈ 26 మందిలో న‌లుగురు క్యాబినెట్ మంత్రులు కూడా ఉన్నారు. దాంతో సోమవారం పార్ల‌మెంట్లో జ‌రుగాల్సిన ప్ర‌ధాని కేపీ శ‌ర్మ ఓలీ విశ్వాస‌ప‌రీక్ష‌పై ఉత్కంఠ నెల‌కొన్నది.
 
మరోవైపు, ప్రచండ నేతృత్వంలోని నేపాల్‌ కమ్యూనిస్టు పార్టీ కేపీ శ‌ర్మ ఓలి ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించడంతో ఆ ప్రభుత్వం మైనారిటీలో పడింది. ఈ నేపథ్యంలో ప్రధాని ఓలి ఇవాళ పార్ల‌మెంట్‌లో విశ్వాసపరీక్ష ఎదుర్కోబోతున్నారు. 
 
నేపాల్‌ పార్లమెంట్‌లో ప్రస్తుతం 271 మంది ఎంపీలు ఉన్నారు. ఓలి ప్రభుత్వం విశ్వాస పరీక్ష‌ నుంచి గట్టెక్కాలంటే కనీసం136 మంది ఎంపీల మద్దతు అవసరం. సీపీఎన్‌-యుఎంఎల్‌కు ప్ర‌స్తుతం 121 మంది సభ్యులు ఉన్నారు. ఓలి తన ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి మరో 15 మంది మద్దతు అవసరం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రమ్యశ్రీ భూమి కబ్జా ఆమెపై రియల్టర్ శ్రీదర్ రావు అనుచరులు దాడి

Nitin: నితిన్ తమ్ముడు నుంచి లయ పై జై బగళాముఖీ.. సాంగ్

అహాన్, అనీత్‌ల కెమిస్ట్రీని చాటేలా సాచెట్-పరంపర జంట పాట హైలైట్

సమ్మతమే మూవీ ఫేమ్ డైరెక్టర్ గోపీనాథ్ రెడ్డి కొత్త సినిమా

విష్ణు కన్నప్ప కథ చెప్పాక రీసెర్చ్ చేశా; శ్రీకాళహస్తి అర్చకులు మెచ్చుకున్నారు : ముఖేష్ కుమార్ సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు తింటే 8 ప్రయోజనాలు

ఓరల్ యాంటీ-డయాబెటిక్ మందులను పంపిణీకి అబాట్- ఎంఎస్‌డి వ్యూహాత్మక భాగస్వామ్యం

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

తర్వాతి కథనం
Show comments