Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేపాల్‌లో 26 మంది ఎంపీలకు కరోనా వైరస్!

Webdunia
సోమవారం, 10 మే 2021 (10:41 IST)
నేపాల్‌లో 26 మంది ఎంపీలు కరోనా వైరస్ బారినపడ్డారు. పార్ల‌మెంట్ సభ్యులందరికీ మొత్తం రెండు ద‌శ‌ల్లో ప‌రీక్ష‌లు చేయించారు. తొలి దశలో 18 మంది, రెండో దశలో 8 మంది వైరస్‌ బారినపడినట్లు నేపాల్‌ పార్లమెంట్‌ కార్యదర్శి గోపాల్‌నాథ్‌ యోగి తెలిపారు. 
 
క‌రోనా సోకిన ఈ 26 మందిలో న‌లుగురు క్యాబినెట్ మంత్రులు కూడా ఉన్నారు. దాంతో సోమవారం పార్ల‌మెంట్లో జ‌రుగాల్సిన ప్ర‌ధాని కేపీ శ‌ర్మ ఓలీ విశ్వాస‌ప‌రీక్ష‌పై ఉత్కంఠ నెల‌కొన్నది.
 
మరోవైపు, ప్రచండ నేతృత్వంలోని నేపాల్‌ కమ్యూనిస్టు పార్టీ కేపీ శ‌ర్మ ఓలి ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించడంతో ఆ ప్రభుత్వం మైనారిటీలో పడింది. ఈ నేపథ్యంలో ప్రధాని ఓలి ఇవాళ పార్ల‌మెంట్‌లో విశ్వాసపరీక్ష ఎదుర్కోబోతున్నారు. 
 
నేపాల్‌ పార్లమెంట్‌లో ప్రస్తుతం 271 మంది ఎంపీలు ఉన్నారు. ఓలి ప్రభుత్వం విశ్వాస పరీక్ష‌ నుంచి గట్టెక్కాలంటే కనీసం136 మంది ఎంపీల మద్దతు అవసరం. సీపీఎన్‌-యుఎంఎల్‌కు ప్ర‌స్తుతం 121 మంది సభ్యులు ఉన్నారు. ఓలి తన ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి మరో 15 మంది మద్దతు అవసరం.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments