జనావాసాల్లో కుప్పకూలిన విమానం, 23మంది మృతి

Webdunia
సోమవారం, 25 నవంబరు 2019 (10:08 IST)
ఆఫ్రికా దేశం డీఆర్‌ కాంగోలో విమాన ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 23 మంది మరణించారు. కాంగోలోని విమానాశ్రయం నుంచి ఉదయం 9 గంటల సమయంలో విమానం టేకాఫ్‌ అవుతుండగా ఇళ్ల మధ్యలో కూలింది. ఇందులో 19 మంది ప్రయాణికులు సహా కొందరు సిబ్బంది ఉన్నట్లు అధికారులు చెప్పారు. గోమా నుంచి బయలుదేరిన బిజీబీ ఎయిర్‌ లైన్స్‌కు చెందిన డోర్నియర్‌–228 రకం విమానం 350 కిలోమీటర్ల దూరంలోని బెని చేరుకోవాల్సి ఉండగా ఈ ప్రమాదం జరిగింది. 
 
 
విమానంలో 19 మంది ప్రయాణికులు,  సిబ్బంది సహా మొత్తం 23మంది ఉన్నారు. ఐతే వీరిలో ఎవరూ ప్రాణాలతో బయటపడినట్లు దాఖలాలు లేవని అధికారులు తెలిపారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. బిజీ బీ విమానయాన సంస్థకు చెందిన డోర్నియర్-228 విమానం గోమా ఎయిర్ పోర్టు నుంచి 350 కి.మీ. దూరంలో ఉన్న బేనీకి వెళ్లాల్సి ఉంది. 
 
ఐతే గోమా ఎయిర్‌పోర్టులో టేకాఫ్ అయిన కాసేపటికే ఇంజిన్‌లో సాంకేతిక సమస్య తలెత్తి జనావాసాల్లో విమానం కుప్పకూలింది. స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 9 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఇప్పటి వరకు ఆరుగురు మృతదేహాలను బయటకు తీశామని.. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sarath Kumar: అప్పటికి ఇప్పటికి నాలో ఎలాంటి మార్పు లేదు: శరత్ కుమార్

Sri Vishnu: ఛార్మినార్, ఇరానీ చాయ్ చుట్టూ సాగే కథతో అమీర్‌ లోగ్ ఫస్ట్ లుక్

Vishwak Sen: వినోదాల విందుకి హామీ ఇచ్చేలా విశ్వక్ సేన్.. ఫంకీ టీజర్

Shivaji : ప్రేమకు నమస్కారం లో మహాదేవ నాయుడుగా శివాజి

ఓటీటీలోకి వచ్చిన మారుతి టీం ప్రొడక్ట్ త్రిబాణధారి బార్బరిక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంల మంచితనంతో దీపాల పండుగను జరుపుకోండి

ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం: మానసిక సమస్యలు అధిగమించడం ఎలా?

బాదం పాలు తాగుతున్నారా?

ఈ దీపావళికి, ఫ్రెడెరిక్ కాన్‌స్టాంట్ తమ హైలైఫ్ లేడీస్ క్వార్ట్జ్ పండుగ బహుమతులు

బాలబాలికలకు శ్రీకృష్ణుడు చెప్పిన 8 ముఖ్యమైన సందేశాలు

తర్వాతి కథనం
Show comments