Webdunia - Bharat's app for daily news and videos

Install App

సౌతాఫ్రికాలో విషాదం : గ్యాస్ లీక్ - 16 మంది మృత్యువాత

Webdunia
గురువారం, 6 జులై 2023 (13:21 IST)
సౌతాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లోని ఓ మురికివాడలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రాంతంలో గ్యాస్ లీక్ కావడంతో 16 మంది వరకు చనిపోయారు. మరికొందరు అస్వస్థతకు లోనయ్యారు. మృతుల్లో చిన్నారులు కూడా ఉన్నారు. ఈ గ్యాస్ సీల్‌కు అక్రమ మైనింగ్ కార్యకలాపాలకు సంబందం ఉండి వుండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. 
 
ఈ సంఘటన స్థలంలో గ్యాస్ లీక్ అయిన కారణంగా ఊపిరి ఆడక చనిపోయిన వారి మృతదేహాలు ఆ ప్రాంతంలో చెల్లాచెదురుగా పడివున్నాయని గౌటెంక్ ప్రావిన్స్ ప్రీమియర్ పన్యాజా లెసుఫీ చెప్పారు. ఈ విషాద సంఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని జోహన్నెస్‌బర్గ్ అధికారులు వెల్లడించారు. 
 
ఒక్క ట్వీట్‌తో పేటీఎం బ్యాచ్‌ గుండెల్లో గునపం దింపిన పవన్   
 
జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ తన మూడో భార్యకు విడాకులు ఇవ్వనున్నారంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేశారు. ఏపీలోని అధికార వైకాపాకు చెందిన పేటీఎం బ్యాచ్ ఈ అసత్య ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఈ ప్రచారం తారా స్థాయికి చేరుకుంది. ఒక దశలో నిజమేనా అనేలా చేసింది. ఈ ప్రచారంపై జనసేన శ్రేణులు తీవ్ర స్థాయిలో మండిపడ్డాయి. అదేసమయంలో పవన్ కళ్యాణ్ తనదైనశైలిలో బదులిచ్చారు. ఒకే ఒక్క ట్వీట్‌తో పేటీఎం బ్యాచ్‌ గుండెల్లో గునపం దించారు. 
 
ఇదే అంశంపై జనసేన పార్టీ చేసిన ఓ ట్వీట్‌తో పేటీఎం బ్యాచ్‌ దుష్ప్రాచారానికి తాళం పడింది. "జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్, అనా కొణిదెల - వారాహి విజయ యాత్ర తొలి దశ దిగ్విజయంగా పూర్తి చేసుకొన్న సందర్భంగా హైదరాబాద్ నగరంలోని తమ నివాసంలో నిర్వహించిన పూజాదికాలలో పాల్గొన్నారు. శాస్త్రోక్తంగా నిర్వహించిన ఈ ధార్మిక విధులను పవన్ కళ్యాణ్, అనా కొణిదెల దంపతులు నిర్వర్తించారు. కొద్ది రోజుల్లో వారాహి విజయ యాత్ర తదుపరి దశ మొదలవుతుంది. ఇందుకు సంబంధించిన సన్నాహక సమావేశాల్లో పాల్గొనేందుకు పవన్ కళ్యాణ్ త్వరలో మంగళగిరి చేరుకుంటారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నిజమైన భారతీయుడు ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్: ఎస్.జె సూర్య (Video)

రూ.1,000 కోట్ల క్లబ్‌కు చేరువలో ప్రభాస్ "కల్కి 2898 AD"

పిల్లల ఫోటోలు సోషల్ మీడియాలోనా.. పేరెంట్స్ అలెర్ట్: సాయి ధరమ్ తేజ్

ప్రభాస్‌కు పెళ్లి చేయాలని మాకూ వుంది.. కానీ టైం రావాలి: శ్యామలాదేవి

రాజ్ తరుణ్‌తో నాకెలాంటి సంబంధం లేదు.. హీరోయిన్ మాల్వి మల్హోత్రా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పప్పు ఎందుకు తినాలో తెలుసా?

తట్టుకోలేని మైగ్రేన్ తలనొప్పి, ఈ చిట్కాలతో చెక్

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: బాదంపప్పుతో మీ చర్మానికి సంపూర్ణ పోషణ

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments