Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీలంకలో భారీ వర్షాలు.. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం.. 14మంది మృతి

Webdunia
సోమవారం, 7 జూన్ 2021 (09:26 IST)
Floods
శ్రీలంకలో రుతుపవనాల ప్రభావంతో కురిసిన భారీ వర్షాల కారణంగా 14 మంది ప్రాణాలు కోల్పోయారు. శ్రీలంకలోని కొలంబో, రత్నపురతోపాటు పలు జిల్లాలు నీట మునిగిపోయాయి. భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడి కనీసం 14 మంది మృతి చెందారని అధికారులు తెలిపారు. 
 
దాదాపు 2.40 లక్షలకు పైగా ప్రజలు ప్రభావితమయ్యారు. గురువారం రాత్రి నుంచి దేశంలోని పలు జిల్లాల్లో రుతుపవనాల కారణంగా ఏకధాటిగా వర్షాలు కురుస్తున్నాయి. ఇళ్ళు, వరి పొలాలు, రోడ్లు మునిగిపోయాయి. ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిలిచిపోయింది. 10 జిల్లాల్లో జనజీవనం అస్తవ్యస్థంగా తయారైందని విపత్తు నిర్వహణ జాతీయ కేంద్రం అధిపతి మేజర్ జనరల్ సుదాంత రణసింగ్ తెలిపారు.
 
వర్షాలకు నిరాశ్రయులైన వారి కోసం 72 సహాయ శిబిరాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ శిబిరాల్లో 3,500 కు పైగా కుటుంబాలు ఉన్నాయి. రాబోయే రోజుల్లో మరింత ఎక్కువ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆరు జిల్లాల్లో కొండచరియలు విరిగిపడే హెచ్చరికలను జాతీయ పరిపాలనా పరిశోధనా సంస్థ జారీ చేసింది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ రెండో భాగంగా చిత్రం విడుదల తేదీ మార్పు

Peddi: జానీ మాస్టర్ కొరియోగ్రఫీలో మైసూర్‌లో రామ్ చరణ్ పెద్ది సాంగ్ షూటింగ్

నాగ చైతన్య, కార్తీక్ దండు చిత్రంలో లాపతా లేడీస్ ఫేమ్ స్పర్ష్ శ్రీవాస్తవ

Akhanda 2: బాలకృష్ణ అఖండ 2 గురించి నందమూరి తేజస్విని అప్‌డేట్

Manoj: మంచు మనోజ్ ను హైలైట్ చేసిన మిరాయి ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments