Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీలంకలో భారీ వర్షాలు.. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం.. 14మంది మృతి

Webdunia
సోమవారం, 7 జూన్ 2021 (09:26 IST)
Floods
శ్రీలంకలో రుతుపవనాల ప్రభావంతో కురిసిన భారీ వర్షాల కారణంగా 14 మంది ప్రాణాలు కోల్పోయారు. శ్రీలంకలోని కొలంబో, రత్నపురతోపాటు పలు జిల్లాలు నీట మునిగిపోయాయి. భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడి కనీసం 14 మంది మృతి చెందారని అధికారులు తెలిపారు. 
 
దాదాపు 2.40 లక్షలకు పైగా ప్రజలు ప్రభావితమయ్యారు. గురువారం రాత్రి నుంచి దేశంలోని పలు జిల్లాల్లో రుతుపవనాల కారణంగా ఏకధాటిగా వర్షాలు కురుస్తున్నాయి. ఇళ్ళు, వరి పొలాలు, రోడ్లు మునిగిపోయాయి. ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిలిచిపోయింది. 10 జిల్లాల్లో జనజీవనం అస్తవ్యస్థంగా తయారైందని విపత్తు నిర్వహణ జాతీయ కేంద్రం అధిపతి మేజర్ జనరల్ సుదాంత రణసింగ్ తెలిపారు.
 
వర్షాలకు నిరాశ్రయులైన వారి కోసం 72 సహాయ శిబిరాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ శిబిరాల్లో 3,500 కు పైగా కుటుంబాలు ఉన్నాయి. రాబోయే రోజుల్లో మరింత ఎక్కువ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆరు జిల్లాల్లో కొండచరియలు విరిగిపడే హెచ్చరికలను జాతీయ పరిపాలనా పరిశోధనా సంస్థ జారీ చేసింది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

సందీప్ కిషన్, రీతు వర్మ ల పై మజాకా లో రావులమ్మ సాంగ్ షూట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments