Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీలంకలో భారీ వర్షాలు.. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం.. 14మంది మృతి

Webdunia
సోమవారం, 7 జూన్ 2021 (09:26 IST)
Floods
శ్రీలంకలో రుతుపవనాల ప్రభావంతో కురిసిన భారీ వర్షాల కారణంగా 14 మంది ప్రాణాలు కోల్పోయారు. శ్రీలంకలోని కొలంబో, రత్నపురతోపాటు పలు జిల్లాలు నీట మునిగిపోయాయి. భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడి కనీసం 14 మంది మృతి చెందారని అధికారులు తెలిపారు. 
 
దాదాపు 2.40 లక్షలకు పైగా ప్రజలు ప్రభావితమయ్యారు. గురువారం రాత్రి నుంచి దేశంలోని పలు జిల్లాల్లో రుతుపవనాల కారణంగా ఏకధాటిగా వర్షాలు కురుస్తున్నాయి. ఇళ్ళు, వరి పొలాలు, రోడ్లు మునిగిపోయాయి. ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిలిచిపోయింది. 10 జిల్లాల్లో జనజీవనం అస్తవ్యస్థంగా తయారైందని విపత్తు నిర్వహణ జాతీయ కేంద్రం అధిపతి మేజర్ జనరల్ సుదాంత రణసింగ్ తెలిపారు.
 
వర్షాలకు నిరాశ్రయులైన వారి కోసం 72 సహాయ శిబిరాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ శిబిరాల్లో 3,500 కు పైగా కుటుంబాలు ఉన్నాయి. రాబోయే రోజుల్లో మరింత ఎక్కువ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆరు జిల్లాల్లో కొండచరియలు విరిగిపడే హెచ్చరికలను జాతీయ పరిపాలనా పరిశోధనా సంస్థ జారీ చేసింది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments