Webdunia - Bharat's app for daily news and videos

Install App

విష వాయువు పీల్చి... జార్జియాలో 12 మంది మృతి

సెల్వి
మంగళవారం, 17 డిశెంబరు 2024 (14:12 IST)
Georgia
జార్జియాలో విషయ వాయువు పీల్చడం వల్ల 12 మంది మృతి చెందారు. వీరిలో 11 మంది భారతీయులు ఉండటం గమనార్హం. రాత్రిపూట రిసార్ట్ మూసివేశాక తమ గదిలో పడుకున్న వారంతా పడుకున్నట్టే మృతి చెందారు. ప్రాథమిక విచారణ తర్వాత రిసార్ట్ సిబ్బంది మరణానికి కార్బన్ మోనాక్సైడ్ వాయువే కారణమని భావిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. గుడౌరిలోని రిసార్టులో చోటుచేసుకున్న విషాదంపై భారత రాయబార కార్యాలయం స్పందించింది. 
 
11 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారని నిర్ధారించింది. మృతుల కుటుంబాలకు సంతాపం తెలుపుతున్నట్టు పేర్కొంది. కాగా, గుడౌరీలోని రిసార్ట్‌లో ఈ నెల 14న మృతదేహాలను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాలపై ఎలాంటి గాయాలు కానీ, గాయాల ఆనవాళ్లు కానీ లేవని చెప్పారు. 
 
సిబ్బంది కోసం కేటాయించిన గది రిసార్ట్ రెండో అంతస్తులో ఉందని, దాని పక్కనే జనరేటర్ ఉందని వివరించారు. 
విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో జనరేటర్‌ను ఆన్ చేసి ఉంటారని భావిస్తున్నట్లు తెలిపారు. 
 
అయితే, కార్బన్ మోనాక్సైడ్ వాయువు ఎలా విడుదలైందనే వివరాలు కానీ, సిబ్బంది మరణాలకు కచ్చితమైన కారణం కానీ తెలియరాలేదని అధికారులు వెల్లడించారు. సిబ్బంది మరణానికి కారణం గుర్తించేందుకు దర్యాఫ్తు జరుపుతున్నట్లు వివరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వార్ 2 లో ఎన్.టి.ఆర్. మాటలే అనంతపురంలో వివాదానికి కారణమయిందా?

ఒంటికి ఆయిల్ పూసుకున్నా నభా నటేష్ అవకాశాలు రావడంలేదా?

బుల్లి సినిమాలు గురించి మేధావులు ఆలోచించండి : రామ సత్యనారాయణ

పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో రాజేంద్ర ప్రసాద్ నటించిన నేనెవరు?

మెగాస్టార్ చిరంజీవి చిత్రాల అప్ డేట్స్ ఒకవైపు - కార్మికుల సమస్యలకు మరోవైపు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments