Webdunia - Bharat's app for daily news and videos

Install App

విష వాయువు పీల్చి... జార్జియాలో 12 మంది మృతి

సెల్వి
మంగళవారం, 17 డిశెంబరు 2024 (14:12 IST)
Georgia
జార్జియాలో విషయ వాయువు పీల్చడం వల్ల 12 మంది మృతి చెందారు. వీరిలో 11 మంది భారతీయులు ఉండటం గమనార్హం. రాత్రిపూట రిసార్ట్ మూసివేశాక తమ గదిలో పడుకున్న వారంతా పడుకున్నట్టే మృతి చెందారు. ప్రాథమిక విచారణ తర్వాత రిసార్ట్ సిబ్బంది మరణానికి కార్బన్ మోనాక్సైడ్ వాయువే కారణమని భావిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. గుడౌరిలోని రిసార్టులో చోటుచేసుకున్న విషాదంపై భారత రాయబార కార్యాలయం స్పందించింది. 
 
11 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారని నిర్ధారించింది. మృతుల కుటుంబాలకు సంతాపం తెలుపుతున్నట్టు పేర్కొంది. కాగా, గుడౌరీలోని రిసార్ట్‌లో ఈ నెల 14న మృతదేహాలను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాలపై ఎలాంటి గాయాలు కానీ, గాయాల ఆనవాళ్లు కానీ లేవని చెప్పారు. 
 
సిబ్బంది కోసం కేటాయించిన గది రిసార్ట్ రెండో అంతస్తులో ఉందని, దాని పక్కనే జనరేటర్ ఉందని వివరించారు. 
విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో జనరేటర్‌ను ఆన్ చేసి ఉంటారని భావిస్తున్నట్లు తెలిపారు. 
 
అయితే, కార్బన్ మోనాక్సైడ్ వాయువు ఎలా విడుదలైందనే వివరాలు కానీ, సిబ్బంది మరణాలకు కచ్చితమైన కారణం కానీ తెలియరాలేదని అధికారులు వెల్లడించారు. సిబ్బంది మరణానికి కారణం గుర్తించేందుకు దర్యాఫ్తు జరుపుతున్నట్లు వివరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments