Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేపాల్‌లో భారీగా వర్షాలు.. 54మంది మృతి.. 41మంది గల్లంతు

Webdunia
సోమవారం, 13 జులై 2020 (20:42 IST)
నేపాల్‌లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. వ‌ర్షాల కార‌ణంగా నారాయణి స‌హా ఇత‌ర ప్ర‌ధాన న‌దులు పొంగి పొర్లుతున్నాయి. దేశ వ్యాప్తంగా వారాంతంలో భారీ వ‌ర్ష సూచ‌న ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ అంచ‌నా వేసింది. భారీ వర్షాలకు కొండ చరియలు విరిగిపడటంతో మరణించిన వారి సంఖ్య 54కి చేరింది. ఇంకా 41 మంది గ‌ల్లంతైన‌ట్లు గుర్తించినట్లు అధికారులు తెలిపారు. 
 
ఒక్క మ‌యాగ్డి ప్రాంతంలోనే 27 మంది మ‌ర‌ణించిన‌ట్లు అధికారులు తెలిపారు. కొండ‌చ‌రియలు విరిగిప‌డ‌టంతో పలు ప్రాంతాల్లో ఇళ్లు నేల‌మ‌ట్ట‌మ‌య్యాయి. దీంతో వేలాది మంది ప్ర‌జ‌లు నిరాశ్ర‌యుల‌య్యారు.
 
స్థానిక పాఠ‌శాల భ‌వ‌నాలు, క‌మ్యూనిటీ కేంద్రాల్లో ప్రస్తుతం జనం త‌ల‌దాచుకున్నారు. శిథిలాల కింద చిక్కుకుపోయిన వారిని గుర్తిస్తున్నామ‌ని స‌హాయ‌క చ‌ర్య‌లు ముమ్మ‌రంగా చేప‌ట్టిన‌ట్లు అధికారులు చెప్పారు. అయితే భారీ వ‌ర్షాల కార‌ణంగా రోడ్లు దెబ్బ‌తిన‌డంతో స‌హాయ‌క చ‌ర్య‌ల‌కు ఆటంకం క‌లుగుతుంద‌ని అక్క‌డి స్థానిక మీడియా తెలిపింది.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments