Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రపంచంలో ప్రతి 4 కొవిడ్‌ మరణాల్లో 1 భారత్‌లో: వారాంతపు నివేదికలో వెల్లడించిన WHO

Webdunia
బుధవారం, 5 మే 2021 (23:01 IST)
జెనీవా: కరోనా వైరస్‌ మహమ్మారి విలయానికి భారత్‌ వణికిపోతోంది. గత కొన్నివారాలుగా కరోనా కొనసాగుతున్న విజృంభణకు నిత్యం వేల సంఖ్యలో కొవిడ్‌ బాధితులు మృత్యుఒడికి చేరుతున్నారు. గతవారం ప్రపంచంలో నమోదైన మొత్తం కేసుల్లో సగం భారత్‌లోనే ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఇక అదే వారంలో ప్రపంచంలో చోటుచేసుకున్న ప్రతి నాలుగు కొవిడ్‌ మరణాల్లో ఒకటి భారత్‌లోనే ఉందని డబ్ల్యూహెచ్‌ఓ పేర్కొంది.
 
‘ఆసియాలో నమోదవుతున్న మొత్తం కేసుల్లో 90శాతం కేవలం భారత్‌లోనే నమోదవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న వాటిలో ఇది 46శాతం. ఇక ప్రపంచ వ్యాప్తంగా సంభవిస్తోన్న మొత్తం కొవిడ్‌ మరణాల్లో 25శాతం భారత్‌లోనే ఉంటున్నాయి’ అని ప్రపంచ ఆరోగ్యసంస్థ గతవారపు నివేదికలలో వెల్లడించింది.

ఇక ఇప్పటివరకు అత్యధిక కొవిడ్‌ మరణాలు (5లక్షల 78వేలు) అమెరికాలో చోటుచేసుకోగా బ్రెజిల్‌ (4లక్షల 11వేలు) రెండో స్థానంలో ఉంది. భారత్‌లో రోజువారీ పాజిటివ్‌ కేసుల సంఖ్య దాదాపు 4లక్షలకు చేరడం, నిత్యం మూడున్నర వేల మంది మృత్యువాతపడుతున్నారు. భారత్‌లో కరోనా వైరస్‌ తీవ్రత ఆందోళనకర స్థాయిలో ఉన్నట్లు ఇప్పటికే జాతీయ, అంతర్జాతీయ నిపుణులు అంచనా వేస్తున్న విషయం తెలిసిందే.
 
కేంద్ర ఆరోగ్యశాఖ లెక్కల ప్రకారం, భారత్‌లో కొవిడ్‌ కేసుల సంఖ్య 2కోట్లు దాటగా, మరణాల సంఖ్య 2లక్షల 26వేలు దాటింది..

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments