Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఖర్జూరం.. పాలు.. నెయ్యి కలిపి తీసుకుంటే...

సంప్రదాయఫలంగా ఖర్జూరం నీరాజనాలందుకుంటోంది. రంజాన్‌‌ మాసం వచ్చిందంటే చాలు, పుష్టికరమైన ఆ పండుతోనే ముస్లింలకు ఉపవాసదీక్షను పూర్తి అవుతుంది.

Webdunia
శుక్రవారం, 24 మార్చి 2017 (15:32 IST)
సంప్రదాయఫలంగా ఖర్జూరం నీరాజనాలందుకుంటోంది. రంజాన్‌‌ మాసం వచ్చిందంటే చాలు, పుష్టికరమైన ఆ పండుతోనే ముస్లింలకు ఉపవాసదీక్షను పూర్తి అవుతుంది. అందుకే వారికిదిలేనిదే రోజు గడవదంటే అతిశయోక్తి కాదు. ఖర్జూరంలో ఎన్నో పోషక పదార్థాలు, ఔషధ గుణాలు కలిగి ఉంటాయి. ఖర్జూర పండ్లలో గ్లూకోజ్, ప్రక్టోజ్ వంటి ప్రకృతి సిద్ధమైన చక్కెర పదార్థాలు ఉంటాయి. ఈ పండును రోజూ ఒకటి చొప్పున తీసుకున్నట్టయితే రోగ నిరోధక శక్తి పెరిగి.. ఆరోగ్యంగా ఉంటారు. ఈ పండు సౌదీ అరేబియా, ఇరాన్‌, ఇరాక్‌, యుఏఈ, ఒమన్‌, ట్యునీషియా, జోర్డాన్‌ల నుంచి ప్రతి యేటా టన్నులు టన్నులుగా దిగుమతి చేసుకుంటారు. 
 
అయితే, ఈ పండ్లలో విటమిన్ ఏ, బిలు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో ఎంతగానో దోహదపడతాయి. ఎముకలు బలంగా, పటుత్వంగా ఉండాలంటే, ఖర్జూరపండు తరచుగా ఎక్కువగా తినాలి. ఖర్జూర పండు శరీరంలో అధికంగా గల వాతాన్ని పోగొడుతుంది. ఉదయాన్నే మలబద్దకముతో బాధపడే వారు, రాత్రి పాలల్లో 4 నుండి 5ఎండు ఖర్జూర పండ్లు వేసి మరగబెట్టి, రాత్రి నిద్రించే ముందు తాగుతూ ఉంటే మలబద్దకం సమస్య నుంచి విముక్తి పొందవచ్చు. 
 
ముఖ్యంగా రక్తహీనతతో బాధపడేవారు... ఖర్జూర పండ్లు, పాలు, మీగడ లేదా కొద్దిగా నెయ్యి కలిపి ఉదయాన్నే అల్పాహారంగా తీసుకుంటూ ఉంటే రక్త శాతం పెరుగుతుంది. పోగొట్టుకున్న శక్తిని తిరిగి పొందవచ్చు. అలాగే, నీరసం, నిస్సత్తువతో బాధపడుతున్నవారు, కొన్ని నెలల పాటూ రోజుకు ఐదు నుంచి పది చొప్పున ఖర్జూర పండ్లు భోజనం తర్వాత ఆరగించినట్టయితే మంచి బలవంతులుగా తయారవుతారు. 
 
ఎండాకాలం వడదెబ్బ తగలకుండా ఉండాలంటే, ఖర్జూర పండును రాత్రుళ్లు నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం ఆ నీటిని తాగితే వడదెబ్బ బారినపడకుండా ఉండొచ్చు. పెద్దపేగులోని సమస్యలకు ఈ పండులోని టానిన్‌ చక్కగా ఉపయోగపడుతుంది. గొంతునొప్పి, మంట, జలుబు, శ్లేష్మం వంటివాటికి ఈ పండు గుజ్జు లేదా సిరప్‌ మంచి మందు. మూత్రపిండాలలో రాళ్లు కరగాలంటే ఖర్జూరపండు తరచుగా ఆరగించాలి. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

చీరల వ్యాపారికి పడకసుఖం ఇస్తూ ఊపిరాడకుండా చేసి చంపేసిన మహిళ... ఎలా?

హస్తిన అసెంబ్లీ పోరుకు ముగిసిన ప్రచారం.. 5న పోలింగ్!!

ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు.. మెల్లగా జారుకున్న పవన్ కల్యాణ్

సీఎం చంద్రబాబును కలిసిన సోనుసూద్ : 4 అంబునెల్స్‌ల విరాళం

ఏపీలో రైల్వేల అభివృద్ధికి రూ.9417 కోట్లు - మరిన్ని వందే భారత్‌ రైళ్లు : మంత్రి అశ్వినీ వైష్ణవ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎండ్‌కార్డు వరకు సస్పెన్స్ కొనసాగుతుంది - 'ఒక పథకం ప్రకారం' డైరెక్టర్ వినోద్ కుమార్ విజయన్

లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో 'సతి లీలావతి'

'గేమ్ ఛేంజర్' కలెక్షన్లపై అల్లు అరవింద్ సెటైర్లు - ముందుంది మొసళ్ల పండుగ అంటున్న మెగాఫ్యాన్స్!

ఫస్ట్ లుక్ లాంచ్ ఈవెంట్‌లో హీరోయిన్ అర్చన

ఫహాద్ ఫాజిల్ - రాజ్ కుమార్ రావ్ బాటలో దూసుకు పోతున్న రాగ్ మయూర్

తర్వాతి కథనం
Show comments