Webdunia - Bharat's app for daily news and videos

Install App

అవిశ గింజలతో చక్కెర వ్యాధికి చెక్

Webdunia
ఆదివారం, 27 ఆగస్టు 2023 (09:57 IST)
నేటి సమాజంలో మధుమేహం బారిన పడేవారి సంఖ్య రోజురోజుకూ అధికమవుతోంది. చక్కెర వ్యాధి బారిన పడకుండా, ఒక వేళ ఇప్పటికే వచ్చినా సురక్షిత స్థాయుల్లో దాన్ని కట్టడి చేయాలంటే అనుసరించాల్సిన జీవనశైలిపై తిరుపతి శ్రీ పద్మావతి మహిళా వర్సిటీ గృహ విజ్ఞానశాస్త్ర విభాగం ఆచార్యులు, ఇంటిగ్రేటెడ్‌ ఫుడ్‌ టెక్నాలజీ కోర్సు కో-ఆర్డినేటర్‌ డాక్టర్‌ జి.శిరీష అధ్యయనం చేశారు. అవిశ గింజలు, పెరుగుతో మధుమేహాన్ని నియంత్రిస్తాయా అనే కోణంలో తమ పరిశోధన సాగించారు. 
 
మహిళా, ఎస్వీ యూనివర్సిటీలలో ఉన్న 100 మంది టైప్‌2 డయాబెటిక్‌ పేషెంట్లను 25 మంది చొప్పున నాలుగు గ్రూపులుగా విభజించి, మొదటి గ్రూపులో ఉన్నవారికి మూడు నెలలపాటు వంద మిల్లీగ్రాముల పెరుగునే ఇచ్చారు. రెండో గ్రూపునకు 25 గ్రాముల అవిశగింజలను అందించారు. మూడో గ్రూపునకు 100 మిల్లీ గ్రాముల చొప్పున పెరుగు, 25 గ్రాముల అవిశగింజలను ఇచ్చారు. నాలుగో గ్రూపునకు 100 మి.గ్రా. పెరుగు, అవిశగింజలు, ఒక గ్రాము స్పొరొలాక్‌ అందించారు. 
 
ఇలా మూడు నెలల పాటు ఈ ఆహారాన్ని ఇచ్చి తర్వాత అందరికీ షుగరు పరీక్ష చేశాం. కేవలం పెరుగు తీసుకున్న మొదటి 25 మందిలో మధుమేహ స్థాయి తగ్గలేదు. 25 గ్రాముల అవిశగింజలు తీసుకున్న రెండో గ్రూపు సభ్యుల్లో షుగర్‌ లెవెల్స్‌ తగ్గాయి. అంతేకాకుండా చెడు కొలెస్ట్రాల్‌తోపాటు బరువు కూడా తగ్గారు. పెరుగు, అవిశగింజలు, స్పొరొలాక్‌ తీసుకున్నవారిలో కూడా ఇదే ఫలితం వచ్చింది. 
 
"అవిశ గింజలను నేరుగా కాకుండా వేయించి ఉప్పునీళ్లు చల్లుకుని తింటే రుచిగా ఉంటాయి. వీటిలో ఉండే ఫైబర్‌ మన శరీరంలో ఉన్న కొవ్వును తగ్గిస్తుంది. నేరుగా తినలేనివారు పొడిలా చేసుకుని అన్నంలో కలుపుకొని తినొచ్చు. వీటిని ప్రతిరోజూ తీసుకుంటే మధుమేహం అదుపులో ఉంటుంది'' అని శిరీష వివరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

తెలంగాణ: రూ.5.21 లక్షల అబార్షన్ కిట్లు, మందులు కూడా స్వాధీనం

CPI Narayana: పవన్ ఎందుకు విడాకులు ఇచ్చాడు.. ఫామ్‌ హౌస్‌లో ఆ పని చేశాడు.. అరెస్ట్ చేయాలి? (video)

One-To-One Meeting: చంద్రబాబు-పవన్ మీట్.. ఏం చర్చించారో తెలుసా?

Ambati: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నారు?: అంబటి ప్రశ్న.. ట్రోల్స్ మొదలు

తెలుగు రాష్ట్రాల్లో వేర్వేరు రోడ్డు ప్రమాదాలు... ఏడుగురు మృతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ రూ.4 కోట్లు తిరిగి ఇచ్చాడా?

తర్వాతి కథనం
Show comments