Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో టిక్కెట్ వార్ : మంత్రులను ఎక్కిదిగిన హీరో సిద్ధార్థ్

Webdunia
శుక్రవారం, 24 డిశెంబరు 2021 (13:34 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంపై సినీ హీరోలు ఒక్కొక్కరుగా ఎదురుదాడికి దిగుతున్నారు. సినిమా టిక్కెట్ల ధరలను ఏపీ ప్రభుత్వం భారీగా తగ్గించింది. వీటిపై హీరో నాని మాట్లాడుతూ, సినిమా కలెక్షన్ల కంటే కిరాణా కొట్టు కలెక్షన్సే అధికంగా ఉన్నాయంటూ గురువారం సంచలన కామెంట్స్ చేశారు. దీనికి హీరో సందీప్, దర్శకుడు దేవకట్టా, నిర్మాత నాగవంశీలు మద్దతు ప్రకటించారు. ఇపుడు ఈ జాబితాలో మరో హీరో సిద్ధార్థ్ చేరారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు. 
 
"సినిమా ఖర్చు తగ్గింది. డిస్కౌంట్‌ను కస్టమర్లకు పంచాలని మాట్లాడే మంత్రులు... మేం పన్నులు చెల్లింపుదారులం. మీ విలాసాలన్నింటికీ మేం పన్నులు చెల్లిస్తున్నాం...+ లక్షల కోట్లను రాజకీయ నాయకులు అవినీతితో సంపాదించారు. మీ విలాసాలను తగ్గించుకోండి. మా తగ్గింపు ఇవ్వండి. #ఏదిలాజిక్?" అంటూ సంచలన ట్వీట్ చేశారు. 
 
హీరో నాని, సందీప్ కిషన్, దేవకట్టా, నాగవంశీ చేసిన వ్యాఖ్యల కంటే సిద్ధార్థ్ చేసిన ట్వీట్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఏపీ మంత్రులను హీరో సిద్ధార్థ్ బాగా ఎక్కిదిగారు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తంమీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదలైన సినిమా టిక్కెట్ల వార్ ఇపుడు తారా స్థాయికి చేరిందని చెప్పొచ్చు. ఒకవైపు హీరోలు, మరోవైపు మంత్రులు ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

NDAతో మా కూటమి 2029 దాటి వెళ్ళబోతోంది.. చంద్రబాబు క్లారిటీ సమాధానం

ఉగ్రవాద నిరోధక ప్యానెల్‌కు పాకిస్థాన్‌కు వైస్ చైర్మన్ పదవా? రాజ్‌నాథ్ సింగ్ సూటి ప్రశ్న

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా అజారుద్దీన్ తనయుడు

NASA: నాసా అధికారిక వెబ్‌సైట్‌లో బగ్‌ను గుర్తించిన 16 ఏళ్ల బాలుడు.. హ్యాట్సాఫ్!

బాలికలకు హాని చేయాలంటేనే భయపడాలి.. తాట తీయండి: చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments