Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో టిక్కెట్ వార్ : మంత్రులను ఎక్కిదిగిన హీరో సిద్ధార్థ్

Webdunia
శుక్రవారం, 24 డిశెంబరు 2021 (13:34 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంపై సినీ హీరోలు ఒక్కొక్కరుగా ఎదురుదాడికి దిగుతున్నారు. సినిమా టిక్కెట్ల ధరలను ఏపీ ప్రభుత్వం భారీగా తగ్గించింది. వీటిపై హీరో నాని మాట్లాడుతూ, సినిమా కలెక్షన్ల కంటే కిరాణా కొట్టు కలెక్షన్సే అధికంగా ఉన్నాయంటూ గురువారం సంచలన కామెంట్స్ చేశారు. దీనికి హీరో సందీప్, దర్శకుడు దేవకట్టా, నిర్మాత నాగవంశీలు మద్దతు ప్రకటించారు. ఇపుడు ఈ జాబితాలో మరో హీరో సిద్ధార్థ్ చేరారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు. 
 
"సినిమా ఖర్చు తగ్గింది. డిస్కౌంట్‌ను కస్టమర్లకు పంచాలని మాట్లాడే మంత్రులు... మేం పన్నులు చెల్లింపుదారులం. మీ విలాసాలన్నింటికీ మేం పన్నులు చెల్లిస్తున్నాం...+ లక్షల కోట్లను రాజకీయ నాయకులు అవినీతితో సంపాదించారు. మీ విలాసాలను తగ్గించుకోండి. మా తగ్గింపు ఇవ్వండి. #ఏదిలాజిక్?" అంటూ సంచలన ట్వీట్ చేశారు. 
 
హీరో నాని, సందీప్ కిషన్, దేవకట్టా, నాగవంశీ చేసిన వ్యాఖ్యల కంటే సిద్ధార్థ్ చేసిన ట్వీట్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఏపీ మంత్రులను హీరో సిద్ధార్థ్ బాగా ఎక్కిదిగారు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తంమీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదలైన సినిమా టిక్కెట్ల వార్ ఇపుడు తారా స్థాయికి చేరిందని చెప్పొచ్చు. ఒకవైపు హీరోలు, మరోవైపు మంత్రులు ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో జీబీఎస్ మరణం : ఏపీ సర్కారు అలర్ట్

పోటు మీద పోటు పొడుస్తూ వ్యక్తిపై కత్తులతో దాడి.. (Video)

పోలీస్‌ను ఢీకొట్టి బైకుపై పరారైన గంజాయి స్మగ్లర్లు (Video)

దేవుడి మొక్కు తీర్చుకుని వస్తున్న దంపతులు... భర్త కళ్లముందే భార్యపై అత్యాచారం...

పెళ్లి ఊరేగింపు: గుర్రంపై ఎక్కిన వరుడు గుండెపోటుతో మృతి (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments