Webdunia - Bharat's app for daily news and videos

Install App

హోలీ వేడుకకు దూరంగా రాంనాథ్ : రాష్ట్రపతి భవన్ ప్రకటన

Webdunia
గురువారం, 5 మార్చి 2020 (15:47 IST)
కరోనా వైరస్ భయం నేపథ్యంలో హోలీ వేడుకకు దూరంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షాలు నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని వారు అధికారికంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈసారి హోలీ వేడుకను నిర్వహించడం లేదని రాష్ట్రపతిభవన్‌ తెలిపింది. 
 
ఈ మేరకు రాష్ట్రపతి భవన్‌ ట్వీట్‌ చేస్తూ 'కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా ఉండటానికి, దీన్ని నిరోధించడానికి అందరం కృషి చేద్దాం. హోలీ వేడుకలను ఈ సారి నిర్వహించడం లేదు' అని పేర్కొంది.
 
కరోనా వైరస్‌ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకొని జనసందోహంతో కూడిన కార్యక్రమాలకు దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్న నేపథ్యంలో ఈసారి హోలీ వేడుకల్లో పాల్గొనకూడదని నిర్ణయించినట్లు ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం ఉదయమే ట్వీట్ చేసిన విషయం తెల్సిందే. 
 
తాను కూడా ఈసారి హోలీ వేడుకల్లో పాల్గొనడం లేదని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వేర్వేరుగా తెలిపారు. ఢిల్లీ ఘర్షణల నేపథ్యంలో హోలీ వేడుకలను జరుపుకోవద్దని ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ఇప్పటికే నిర్ణయించుకున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Dallas: డల్లాస్‌లో గణేష్ చతుర్థి వేడుకలు.. డ్యాన్స్ ఇరగదీశారు.. వీడియో వైరల్

Kavitha: కవితను పట్టించుకోని కాంగ్రెస్, బీజేపీ.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తర్వాత కొత్త పార్టీ?

Chandrababu: అనంతపురంలో డిస్నీ ల్యాండ్ ఏర్పాటు.. రాయలసీమకు ప్రత్యేక ఆకర్షణ

Ganesh Nimajjanam: హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనం కోసం భారీ భద్రతా ఏర్పాట్లు

Tamil Nadu: హెడ్ మాస్టర్ కాళ్లకు మసాజ్ చేసిన విద్యార్థులు..

అన్నీ చూడండి

లేటెస్ట్

Pitru Paksha: ఆ మూడు రుణాల్లో పితృరుణం తీర్చుకోవాల్సిందే.. మహాలయ పక్షం ప్రారంభం ఎప్పుడు?

Anant Chaturdashi 2025: అనంత చతుర్దశి వ్రతానికి... గణేష నిమజ్జనానికి సంబంధం ఏంటంటే?

Ganesh Nimmajanam: గణేష్ నిమ్మజ్జనం సమయంలో ఈ తప్పులు చేయవద్దు

మరింత మెరుగైన శ్రీవారి సేవల కోసం ట్రైనీ వాలంటీర్లు : తితిదే నిర్ణయం

04-09-2025 గురువారం ఫలితాలు - మీ శ్రీమతితో సౌమ్యంగా మెలగండి...

తర్వాతి కథనం
Show comments