హోలీ వేడుకకు దూరంగా రాంనాథ్ : రాష్ట్రపతి భవన్ ప్రకటన

Webdunia
గురువారం, 5 మార్చి 2020 (15:47 IST)
కరోనా వైరస్ భయం నేపథ్యంలో హోలీ వేడుకకు దూరంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షాలు నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని వారు అధికారికంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈసారి హోలీ వేడుకను నిర్వహించడం లేదని రాష్ట్రపతిభవన్‌ తెలిపింది. 
 
ఈ మేరకు రాష్ట్రపతి భవన్‌ ట్వీట్‌ చేస్తూ 'కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా ఉండటానికి, దీన్ని నిరోధించడానికి అందరం కృషి చేద్దాం. హోలీ వేడుకలను ఈ సారి నిర్వహించడం లేదు' అని పేర్కొంది.
 
కరోనా వైరస్‌ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకొని జనసందోహంతో కూడిన కార్యక్రమాలకు దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్న నేపథ్యంలో ఈసారి హోలీ వేడుకల్లో పాల్గొనకూడదని నిర్ణయించినట్లు ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం ఉదయమే ట్వీట్ చేసిన విషయం తెల్సిందే. 
 
తాను కూడా ఈసారి హోలీ వేడుకల్లో పాల్గొనడం లేదని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వేర్వేరుగా తెలిపారు. ఢిల్లీ ఘర్షణల నేపథ్యంలో హోలీ వేడుకలను జరుపుకోవద్దని ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ఇప్పటికే నిర్ణయించుకున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణ వ్యాప్తంగా అన్ని చెక్ పోస్టులు రద్దు - అవినీతి అధికారులకు చెక్

వేరే వ్యక్తితో తల్లి అక్రమ సంబంధం: కన్నతల్లిని పరుగెత్తించి నరికి చంపిన కొడుకు

పాకిస్తాన్‌లో ఆకాశాన్నంటిన ధరలు.. కిలో టమోటాలు రూ.600, అల్లం రూ.750

బంగాళాఖాతంలో అల్పపీడనం: రెడ్ అలర్ట్.. రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు

భర్త పుట్టింటికి వెళ్లనివ్వలేదు.. కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్న మహిళ.. ఏమైంది?

అన్నీ చూడండి

లేటెస్ట్

22-10-2025 బుధవారం దినఫలాలు - లక్ష్యసాధనకు ఓర్పు ప్రధానం.. నిర్విరామంగా శ్రమిస్తారు...

21-10-2025 మంగళవారం దినఫలాలు - ఆత్మీయులతో సంభాషణ మనోధైర్యాన్నిస్తుంది...

20-10-2025 సోమవారం దినఫలాలు - ఫోన్ సందేశాలను నమ్మవద్దు...

19-10-2025 ఆదివారం దినఫలాలు - దుబారా ఖర్చులు విపరీతం...

19-10-2015 నుంచి 25-10-2025 వరకు మీ వార రాశిఫలాలు

తర్వాతి కథనం
Show comments