Webdunia - Bharat's app for daily news and videos

Install App

తేనెలో కాస్త గ్లిజరిన్‌ కలిపి రాసుకుంటే...

సాధారణంగా చలికాలంలో గాలిలో తేమ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల ప్రధానంగా ఎదురయ్యే సమస్యలు చర్మం పొడిబారటం, పగలటం, మంటపెట్టడం, చిటపటలాడటం, దురద పెట్టడం వంటి సమస్యలు తలెత్తుతాయి.

Webdunia
సోమవారం, 13 నవంబరు 2017 (10:16 IST)
సాధారణంగా చలికాలంలో గాలిలో తేమ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల ప్రధానంగా ఎదురయ్యే సమస్యలు చర్మం పొడిబారటం, పగలటం, మంటపెట్టడం, చిటపటలాడటం, దురద పెట్టడం వంటి సమస్యలు తలెత్తుతాయి. పొడిబారిన చర్మం ఉన్న వారికి ఈ సమస్యలు మరింత ఎక్కువగా ఉంటాయి. ఆయిల్ స్కిన్ ఉన్న వారికీ సమస్యలు తప్పవు. అందుకే కొన్ని జాగ్రత్తలు పాటిస్తే చర్మాన్ని చలికాలంలో కాపాడుకోవచ్చు. 
 
చలికాలం పొడవునా వాతావరణం చల్లగా ఉంటుంది కాబట్టి వేసవి కాలం తరహాలో నీరు పదేపదే తాగాలనిపించదు. పైగా గాలిలో తేమ తక్కువ కాబట్టి శరీరం నుంచి బయటకు వెళ్లే నీటి శాతం కూడా కాస్త ఎక్కువగానే ఉంటుంది. దీంతో చర్మం మరింతగా పొడిబారి పోవడమూ తప్పదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి అంటే నీరు తాగుతూ పోవడమే.. దీనికి అదనంగా వ్యాయామం చేయడం మర్చిపోవద్దు. చలికాలం రోజుకు కనీసం అర్థగంట పాటైనా వ్యాయామం చేస్తే రక్తప్రసరణ ప్రక్రియ చక్కగా సాగుతుంది. కండరాలు ఉత్తేజితం అవుతాయి కూడా.
 
స్నానానికి ముందు కొబ్బరి లేదా ఆలివ్‌ నూనెను ఒంటికి పట్టించి గోరువెచ్చని నీటితో స్నానం చేస్తే చర్మం పొడిబారదు. అలాగే చెంచా శెనగపిండికి చిటికెడు పసుపూ, అరచెంచా పాలు లేదా పెరుగు కలిపి ముఖం, మెడకు రాసుకుని బాగా మర్దన చేయాలి. ఆ తర్వాత స్నానం చేస్తే ముఖానికి తేమ అందుతుంది. 
 
పెదవులు పొడిబారి పగిలినట్లు ఉంటాయి. తేనెలో కాస్త గ్లిజరిన్‌ కలిపి రాసుకోవాలి. ఇలా రోజులో 2-3సార్లు చేస్తుంటే పగుళ్ల సమస్య తగ్గి పెదవులు తాజాగా కనిపిస్తాయి. చర్మం పొడిబారినప్పుడు పాదాలు కూడా పగలడం కొందరిలో కనిపిస్తుంది. ఇలాంటివారు టేబుల్‌స్పూను ఆలివ్‌నూనెకు అరచెంచా నిమ్మరసాన్ని కలిపి రాత్రుళ్లు పాదాలకు రాసుకుని సాక్సులు వేసుకోవాలి. ఇలాంటి చిట్కాలు పాటించినట్టయితే చలికాలంలో చర్మాన్ని రక్షించుకోవచ్చు. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments