Webdunia - Bharat's app for daily news and videos

Install App

మిల్క్ పౌడర్లు కాదు, రాగి జావ-మాల్ట్ తాగితే...

Webdunia
శుక్రవారం, 17 డిశెంబరు 2021 (22:03 IST)
ఎముకల్లో క్యాల్షియం లోపిస్తే వచ్చే సమస్యలు చాలా ఇబ్బందిపెడతాయి. అందుకే ఈ క్యాల్షియం పుష్కలంగా వుండే రాగులను పిల్లలకి ఆహారంలో చేరుస్తుండాలి. రాగుల్లో ప్రోటీన్లు, ఎ, బి, సి విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉన్నాయి. రాగుల్లో ఉండే ప్రోటీన్లు నిత్యం వ్యాయామం చేసే వారికి చక్కగా ఉపయోగపడతాయి.

 
ఎదిగే పిల్లలకు రాగి జావ, మాల్ట్ తాగిస్తే వారి శరీర నిర్మాణం సరిగ్గా ఉంటుంది. అవయవాల్లో లోపాలు లేకుండా పిల్లలు ఎదుగుతారు. వారిలో స్థూలకాయం రాకుండా ఉంటుంది. రాగుల్లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. శరీరానికి కావల్సిన కాల్షియం అంది తద్వారా ఎముకలు, దంతలు దృఢంగా మారుతాయి.

 
రాగులతో తయారు చేసిన ఆహార పదార్థాలు తరచూ తినడం వల్ల అధిక బరువును తగ్గించుకోవచ్చు. శరీరానికి మానసిక ప్రశాంతత లభిస్తుంది. తల నొప్పిని తగ్గిస్తుంది. ఒత్తిడి, ఆందోళన నివారించే గుణాలు రాగుల్లో ఉన్నాయి. రాగులతో తయారుచేసే మాల్ట్‌ను తాగితే మన శరీరానికి శక్తి లభిస్తుంది. 

 
రాగుల్లో ఉండే పాలిఫినాల్స్, డైటరీ ఫైబర్ మధుమేహాన్ని నియంత్రిస్తాయి. రాగులను నిత్యం ఆహారంలో భాగం చేసుకుంటే వృద్ధాప్య ఛాయలు త్వరగా రావు. చర్మం కాంతివంతంగా, మృదువుగా ఉంటుంది. ఎప్పుడూ యవ్వనంగా కనిపిస్తారు.

సంబంధిత వార్తలు

సాధారణ మహిళలా మెట్రోలో నిర్మలా సీతారామన్ జర్నీ.. వీడియో వైరల్

కేరళలో విజృంభిస్తున్న హెపటైటిస్ ఏ- 12 మంది మృతి.. లక్షణాలు

స్వాతి మలివాల్‌పై కేజ్రీవాల్ సహాయకుడి దాడి.. ఆ నొప్పిలో వున్నా?

రాత్రంతా మహిళతో మాట్లాడాడు.. రూ. 60 లక్షలు ట్రాన్స్‌ఫర్ చేసుకున్నాడు...

సంతోషిమాత అమ్మవారికి కేజీ బరువున్న వెండి చక్రం

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

తర్వాతి కథనం
Show comments