Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గోరువెచ్చని స్నానం, నువ్వుల నూనెతో మర్దన చేస్తే ఆ నొప్పి తగ్గుతుంది

గోరువెచ్చని స్నానం, నువ్వుల నూనెతో మర్దన చేస్తే ఆ నొప్పి తగ్గుతుంది
, శనివారం, 11 డిశెంబరు 2021 (22:34 IST)
మోకాళ్ల నొప్పులు చాలామందిని వేధించే సమస్య. ఎందుకు అలా మోకాళ్ల నొప్పులు వస్తాయో కొందరికి తెలియదు. కానీ ఈ సమస్యను వదిలించుకునేందుకు చిన్నచిన్న చిట్కాలు పాటిస్తే సరిపోతుంది.

 
గాయం లేదా ఆర్థరైటిస్ మంట వల్ల కలిగే మోకాలి నొప్పికి విశ్రాంతి తీసుకోవడం, ఐస్ అప్లై చేయడం మంచిది. ఐతే ఐసును నేరుగా చర్మంపై పెట్టకూడదు. వస్త్రంలో చుట్టి పెట్టాలి. మోకాలికి కొంత విశ్రాంతి ఇవ్వాలి. వాపును తగ్గించడానికి ఐసు ముక్కతో మర్దన చేయాలి.

 
ఆర్థరైటిస్ నొప్పి లేదా మోకాలి నొప్పి నుండి ఉపశమనం కలిగించడానికి వేడి, చల్లని చికిత్సలు సహాయపడతాయి. వేడి చికిత్సలలో ఉదయాన్నే సుదీర్ఘమైన, గోరువెచ్చని స్నానం చేస్తే సమస్య తగ్గుతుంది. అలాగే కీళ్ల నొప్పి, వాపు మరియు మంట నుండి ఉపశమనం పొందేందుకు ఒక టవల్‌లో ఒక జెల్ ఐస్ ప్యాక్ సంచిని చుట్టి, త్వరగా ఉపశమనం కోసం బాధగా వున్న కీళ్ళకు వర్తించాలి. చర్మానికి నేరుగా ఐస్‌ని ఎప్పుడూ వేయకూడదు.

 
ఆయుర్వేద షాపుల్లో కీళ్ల నొప్పులకు లేపనాలు వుంటాయి. వాటిని ఉపయోగించినా మోకాలు నొప్పి లేదా కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది. నువ్వుల నూనెతో మర్దన చేసినా ఉపశమనం కలుగుతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కీరదోసకాయ తింటే బరువు తగ్గుతారా?