Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనావైరస్ నుంచి పసుపు మనకు రక్షణ కల్పిస్తుంది, అదెలాగంటే? (Video)

Webdunia
శుక్రవారం, 17 జులై 2020 (13:17 IST)
భారతీయ సంస్కృతిలో శుభప్రదంగా, మంగళకరంగా భావించే వాటిల్లో పసుపు అత్యంత ప్రధానమైనది. అంతేకాక దీన్ని ఆహారంలో రంగు, రుచి, వాసన కొరకు వాడటంతో పాటు పూర్వకాలం నుండి పసుపును ఔషధంగా ఉపయోగిస్తున్నారు. ప్రతి ఇంటి గడపలకు పసుపు రాయడం ఆచారం.
 
ఇలా చేయడం ద్వారా క్రిములు, కీటకాలు లాంటివి ఇంటిలోకి ప్రవేశించవనే అభిప్రాయం ఆ ఆచారం వెనుక దాగి ఉన్న వైజ్ఞానిక సత్యం. ఇంటిలోను, బావులు మొదలగు తేమ ప్రాంతాల్లో పని చేసే స్త్రీల పాదాలకు క్రిములు సంక్రమించకుండా పసుపు రాసుకునేవారు. మరలా మన పూర్వ సంప్రాదాయాలను గుర్తు తెచ్చుకునే పరిస్థుతులు ఏర్పడ్డాయి. కరోనావైరస్ నుంచి కూడా పసుపు మనకు రక్షణ కల్పిస్తుంది.
 
అది ఎలాగో తెలుసుకుందాం...
 
1. వేపాకు, పసుపు నీటిలో కలిపి బాగా మరగనివ్వాలి. ఆనీటిని ఇంటి చుట్టూ చల్లుకోవాలి. మనం ఎక్కువగా శానిటైజర్లు వాడవలసి పరిస్థితులు వచ్చాయి. ఇవి పడని వారికి అరచేతులు మంటలు వస్తాయి. అలాంటి వారు ఈ నీటిని ఉపయోగించుకోవాలి.
 
2. గ్లాసు వేడి పాలల్లో అరచెంచా పసుపు పొడి, కొంచెం మిరియాల పొడి కలిపి ఆ మిశ్రమాన్ని వేడి చేసి ప్రతిరోజు రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు తాగడం వల్ల జలుబు, తుమ్ములు, దగ్గు లాంటివి నివారింపబడతాయి.
 
3. పసుపు, ఉసిరిక చూర్ణం ఈ రెండింటిని రెండు గ్రాముల చొప్పున తీసుకుని ప్రతిరోజు ఉదయం, సాయంత్రం సేవిస్తే మధుమేహం అదుపులో ఉంటుంది.
 
4. ఇస్నోఫిలియా వ్యాధికి విరుగుడు చెపుతుంది పసుపు. అరచెంచా పసుపులో మూడు చెంచాల స్వచ్ఛమైన తేనె వేసి రోజుకి మూడుసార్లు చొప్పున నాలుగు నెలల పాటు తీసుకుంటే ఆ వ్యాధి తగ్గుముఖం పడుతుంది.
 
5. ముక్కలుగా కొట్టిన పసుపుకొమ్ములు, గోధుమలు సమంగా తీసుకుని దోరగా వేయించి దంచిన చూర్ణాన్ని జల్లించి ఉంచుకుని, రోజూ మూడుపూటలా ఆహారానికి అర్థగంట ముందు పావు స్పూను పొడిని అర గ్లాసు గోరువెచ్చటి నీటిలో కలిపి తాగడం వల్ల ఉబ్బసం వ్యాధి నియంత్రణలో ఉంటుంది. వ్యాధి తీవ్రత తగ్గుతుంది. అంతేకాకుండా తుమ్ములు, జలుబు 
తగ్గుతాయి.
 
6. పైన చెప్పిన వాటిని పాటించడం వలన రోగనిరోధక శక్తి పెరుగుతుంది. రోగనిరోధిక శక్తి పెరగటం వలన కరోనావైరస్ మనకు దూరంగా ఉంటుంది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

అమెరికా అదనపు సుంకాలు.. భారత్‌కు రిలీఫ్.. డొనాల్డ్ ట్రంప్ ఏమన్నారంటే?

Atal Bihari Vajpayee: అటల్ బిహారీ వాజ్‌పేయి ఏడవ వర్ధంతి..ప్రముఖుల నివాళి

ట్రంప్- పుతిన్ భేటీ సక్సెస్.. ఇక జెలెన్‌స్కీకి, నాటో మిత్రపక్షాలకు ఫోన్ చేసి మాట్లాడుతా

Pic Talk: నారా లోకేష్- పవన్ కల్యాణ్ సోదర బంధం.. అన్నా టికెట్ కొనేశాను..

Pawan Kalyan: పెట్టుబడులను ఆకర్షించడానికి బలమైన శాంతిభద్రతలు కీలకం: పవన్ కల్యాణ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మహావతార్ నరసింహ: పురాణాలకు దగ్గరగా వుంది.. మహావతార్ నరసింహ అవతారాన్ని చూసినట్లుంది (video)

సారధి స్టూడియోలో భీమవరం టాకీస్ 15 చిత్రాలు ప్రారంభం

ఒక పార్వతి ఇద్దరు దేవదాసులు కథ ఏం చెప్పబోతోంది తెలుసా !

మర్డర్ నేపథ్యంతోపాటు సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ మధ్య లవ్ ట్రాక్

Cherry: సినీ కార్మికుల కోసం నిర్మాతలు కీలక నిర్ణయాలు వెల్లడి

తర్వాతి కథనం
Show comments