Webdunia - Bharat's app for daily news and videos

Install App

మామిడి పండ్లరసంలో ఒక స్పూన్ తేనె కలుపుకుని తీసుకుంటే...

నేరేడు పళ్ళు డయాబెటిస్ ఉన్నవారికి మంచి ఆహారం. ఈ నేరేడు పళ్ళలో పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వలన మలబద్ధకాన్ని నివారించుటకు ఉపయోగపడుతుంది. అరటి పండు గుజ్జుని తీసుకుని అందులో చింతపండు, ఉప్పువేసి కలుపుకుని ఆ మిశ్రమాన్ని తీసుకుంటే రక్తవిరేచానాలు తగ్గుతాయి.

Webdunia
శుక్రవారం, 1 జూన్ 2018 (10:34 IST)
నేరేడు పళ్ళు డయాబెటిస్ ఉన్నవారికి మంచి ఆహారం. ఈ నేరేడు పళ్ళలో పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వలన మలబద్ధకాన్ని నివారించుటకు ఉపయోగపడుతుంది. అరటి పండు గుజ్జుని తీసుకుని అందులో చింతపండు, ఉప్పువేసి కలుపుకుని ఆ మిశ్రమాన్ని తీసుకుంటే రక్తవిరేచానాలు తగ్గుతాయి. జలుబు చేసినప్పుడు విటమిన్ సి ఎక్కువగా పదార్థాలు తీసుకుంటే జలుబు త్వరగా తగ్గిపోతుంది.
 
ఎండలో ఎక్కువగా తిరిగివచ్చిన వారికి పచ్చి మామిడి కాయను ముక్కలుగా కోసి ఉప్పులో అద్ది ఇస్తే వెంటనే శక్తి పొందుతారు. బంగాళాదుంపలపై కనిపించే ఆకుపచ్చని రంగులోని మచ్చల్లో సెలెసైన్ అనే విషపదార్ధం ఉంటుంది. అవి తినరాదు.
 
ఒక కప్పునీటిలో రెండు స్పూన్ల తేనెను కలుపుకుని పడుకునే ముందుగా త్రాగితే మంచి నిద్రపడుతుంది. ముత్రపిండాల సమస్యలు ఉన్నవారు అరటిపళ్ళు తినకపోవడం మంచిది. తేనెటీగలు కుట్టినప్పుడు వాటి చికిత్సకు బిళ్ళ గన్నేరు ఆకులు చాలా ఉపయోగపడుతాయి. అనాస పండ్ల రసాన్ని చర్మానికి పైపూతగా రాస్తే గజ్జి, తామర, ఇతర సంబంధిత వ్యాధులు వెంటనే తగ్గిపోతాయి.
 
ఎక్కిళ్ళు ఆగకుండా వస్తుంటే కొంచెం పంచదార నోట్లో వేసుకుంటే ఆగిపోతాయి. పరగడుపున కొన్ని కరివేపాకు ఆకులు నమిలి తినడం వలన డయాబెటిస్ అదుపులో ఉంటుంది. సబ్జా గింజలను వేడినీటిలో నానబెట్టి పాలలో కలిపి మద్యాహ్నం పూట త్రాగితే శరీరంలోని వేడి తగ్గిపోతుంది. ధనియాలు నోట్లో వేసుకుని చప్పరిస్తూ ఉంటే నోటి దుర్వాసన తగ్గిపోతుంది.
 
పచ్చి గుడ్లను తినడం ఆరోగ్యానికి ఎంతమాత్రమూ మంచిదికాదు. కారాన్ని అధికంగా వాడితే జీర్ణాశయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. బిల్వ పత్రాలకు శరీర చెమట వాసనను అరికట్టే గుణం ఉంది. వీటిని రుబ్బి శరీరానికి పట్టించి స్నానం చేస్తే చెమట వాసన రాదు. మామిడి పండ్లరసంలో ఒక స్పూన్ తేనె కలుపుకుని తీసుకుంటే నరాల బలహీనత క్రమంగా తగ్గుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ జీతం మొత్తం అనాధ పిల్లలకు ఇచ్చేశారు

Chardham Yatra: పాకిస్తాన్ దాడుల ముప్పు: చార్‌ధామ్ యాత్రను నిలిపివేసిన భారత సర్కారు

Hyderabad: పది లక్షల రూపాయల్ని కాజేసిన కిలేడీ

India: పాకిస్తాన్‌లోని డ్రోన్ లాంచ్ ప్యాడ్‌లను ధ్వంసం చేసిన భారత్ (video)

pak drones: జమ్మూలో పాక్ డ్రోన్ దాడులు, సైరన్ల మోత

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Laya: నటి లయ వారసురాలిగా శ్లోకా అఖండ 2లో ఎంట్రీ ఇస్తోందా !

మెగాస్టార్ చిరంజీవికి విశ్వంభర మరో మ్యాజిక్ కాబోతుందా !

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

తర్వాతి కథనం
Show comments