Webdunia - Bharat's app for daily news and videos

Install App

మామిడి పండ్లరసంలో ఒక స్పూన్ తేనె కలుపుకుని తీసుకుంటే...

నేరేడు పళ్ళు డయాబెటిస్ ఉన్నవారికి మంచి ఆహారం. ఈ నేరేడు పళ్ళలో పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వలన మలబద్ధకాన్ని నివారించుటకు ఉపయోగపడుతుంది. అరటి పండు గుజ్జుని తీసుకుని అందులో చింతపండు, ఉప్పువేసి కలుపుకుని ఆ మిశ్రమాన్ని తీసుకుంటే రక్తవిరేచానాలు తగ్గుతాయి.

Webdunia
శుక్రవారం, 1 జూన్ 2018 (10:34 IST)
నేరేడు పళ్ళు డయాబెటిస్ ఉన్నవారికి మంచి ఆహారం. ఈ నేరేడు పళ్ళలో పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వలన మలబద్ధకాన్ని నివారించుటకు ఉపయోగపడుతుంది. అరటి పండు గుజ్జుని తీసుకుని అందులో చింతపండు, ఉప్పువేసి కలుపుకుని ఆ మిశ్రమాన్ని తీసుకుంటే రక్తవిరేచానాలు తగ్గుతాయి. జలుబు చేసినప్పుడు విటమిన్ సి ఎక్కువగా పదార్థాలు తీసుకుంటే జలుబు త్వరగా తగ్గిపోతుంది.
 
ఎండలో ఎక్కువగా తిరిగివచ్చిన వారికి పచ్చి మామిడి కాయను ముక్కలుగా కోసి ఉప్పులో అద్ది ఇస్తే వెంటనే శక్తి పొందుతారు. బంగాళాదుంపలపై కనిపించే ఆకుపచ్చని రంగులోని మచ్చల్లో సెలెసైన్ అనే విషపదార్ధం ఉంటుంది. అవి తినరాదు.
 
ఒక కప్పునీటిలో రెండు స్పూన్ల తేనెను కలుపుకుని పడుకునే ముందుగా త్రాగితే మంచి నిద్రపడుతుంది. ముత్రపిండాల సమస్యలు ఉన్నవారు అరటిపళ్ళు తినకపోవడం మంచిది. తేనెటీగలు కుట్టినప్పుడు వాటి చికిత్సకు బిళ్ళ గన్నేరు ఆకులు చాలా ఉపయోగపడుతాయి. అనాస పండ్ల రసాన్ని చర్మానికి పైపూతగా రాస్తే గజ్జి, తామర, ఇతర సంబంధిత వ్యాధులు వెంటనే తగ్గిపోతాయి.
 
ఎక్కిళ్ళు ఆగకుండా వస్తుంటే కొంచెం పంచదార నోట్లో వేసుకుంటే ఆగిపోతాయి. పరగడుపున కొన్ని కరివేపాకు ఆకులు నమిలి తినడం వలన డయాబెటిస్ అదుపులో ఉంటుంది. సబ్జా గింజలను వేడినీటిలో నానబెట్టి పాలలో కలిపి మద్యాహ్నం పూట త్రాగితే శరీరంలోని వేడి తగ్గిపోతుంది. ధనియాలు నోట్లో వేసుకుని చప్పరిస్తూ ఉంటే నోటి దుర్వాసన తగ్గిపోతుంది.
 
పచ్చి గుడ్లను తినడం ఆరోగ్యానికి ఎంతమాత్రమూ మంచిదికాదు. కారాన్ని అధికంగా వాడితే జీర్ణాశయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. బిల్వ పత్రాలకు శరీర చెమట వాసనను అరికట్టే గుణం ఉంది. వీటిని రుబ్బి శరీరానికి పట్టించి స్నానం చేస్తే చెమట వాసన రాదు. మామిడి పండ్లరసంలో ఒక స్పూన్ తేనె కలుపుకుని తీసుకుంటే నరాల బలహీనత క్రమంగా తగ్గుతుంది. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments