Webdunia - Bharat's app for daily news and videos

Install App

శరీరం బరువు పెరగకుండా ఉండేందుకు ఇలా చేస్తే సరి...

కొన్ని రకాల పదార్థాలు మానేసి మరికొన్నింటిని తీసుకుంటే సన్నబడటం సులువే. అయితే దాంతోపాటు చేసుకోవల్సిన మార్పులు మరికొన్ని ఉన్నాయి. ఉదయాన్నే అల్పాహారం, రెండుపూటల భోజనం.... ఇంతేగా అనుకుంటే చాలదు. కొద్దికొద్దిగా ఎక్కువసార్లు తినడాన్ని అలవాటు చేసుకోవాలి. దీ

Webdunia
శనివారం, 17 ఫిబ్రవరి 2018 (20:10 IST)
కొన్ని రకాల పదార్థాలు మానేసి మరికొన్నింటిని తీసుకుంటే సన్నబడటం సులువే. అయితే దాంతోపాటు చేసుకోవల్సిన మార్పులు మరికొన్ని ఉన్నాయి. ఉదయాన్నే అల్పాహారం, రెండుపూటల భోజనం.... ఇంతేగా అనుకుంటే చాలదు. కొద్దికొద్దిగా ఎక్కువసార్లు తినడాన్ని అలవాటు చేసుకోవాలి. దీనివల్ల తక్కువ కేలరీలు అందుతాయి. శరీరం ఇన్సులిన్‌ను తక్కువగా విడుదల చేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. అదే ఆకలిని తగ్గిస్తుంది. ఫలితంగా బరువూ అదుపులో ఉంటుంది.
 
ఆకలితో సంబంధం లేకుండా మీముందు ఎంత ఎక్కువ ఆహారం ఉంటే అంత ఎక్కువగా తినేస్తారని ఎన్నో అధ్యయనాలు తెలిపాయి. దీన్ని అధిగమించాలంటే చిన్న పళ్ళెం తీసుకుని కొద్దిగానే వడ్డించుకోవాలి. దానివల్ల తెలియకుండానే తక్కువగా తీసుకుంటాం. కాఫీ, టీలు తాగే గ్లాసులకు ఇదే సూత్రం వర్తిస్తుంది. ఎంత బిజీగా ఉన్నాసరే అన్నం ఒక్కటే కాదు. అల్పాహారం, స్నాక్స్ ఏవయినాసరే భోజనం చేసే డైనింగ్ టేబుల్ దగ్గర తినాలనే నియమాన్ని పెట్టుకోండి. ఫలితంగా టీ.వి, కంప్యూటరు ముందు కూర్చొని తినే అలవాటు తప్పుతుంది.
 
నోరూరించే పదార్థాలు ఎన్ని చేసుకున్నాసరే పచ్చి కూరగాయ ముక్కలు కూడా మీ ముందు ఉండేలా చూసుకోవాలి. ముందు వాటిని తిన్నాకే ఇతర పదార్థాలను తినాలనే నియమాన్ని పెట్టుకోవాలి. దానివల్ల పొట్ట నిండినట్లుగా ఉంటుంది. కేలరీలు తగ్గుతాయి.
 
ఐస్‌క్రీం తినే అలవాటును తగ్గించుకోండి. ఉదయాన్నే అల్పాహారం తిన్నాక ఓ గ్లాసు బత్తాయి, కమలా ఫలం రసం తాగండి. వాటివల్ల తక్కువ కేలరీలు అందుతాయి. శరీర బరువు అదుపులో వుంటుంది.

సంబంధిత వార్తలు

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

గర్భంతో ఉన్న శునకాన్ని కత్తితో పొడిచి చంపేసిన కసాయి!!

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

తర్వాతి కథనం
Show comments