Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేసవిలో తినకూడనవి ఏమిటో తెలుసా?

వేసవిలో కొన్ని పదార్థాలు నోరూరించినా వీలైనంతవరకు తగు మోతాదులోనే తీసుకోవాలి. లేదంటే కడుపు ఉబ్బరంతో పాటు అజీర్ణం వంటి సమస్యలూ ఎదురుకావచ్చు. వాటిని అధిగమించాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటంటే... 1. ఎండలు పెరిగే క్రమంలో రోజువారీ తీసుకునే ఆహారంల

Webdunia
గురువారం, 22 మార్చి 2018 (21:58 IST)
వేసవిలో కొన్ని పదార్థాలు నోరూరించినా వీలైనంతవరకు తగు మోతాదులోనే తీసుకోవాలి. లేదంటే కడుపు ఉబ్బరంతో పాటు అజీర్ణం వంటి సమస్యలూ ఎదురుకావచ్చు. వాటిని అధిగమించాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటంటే...
 
1. ఎండలు పెరిగే క్రమంలో రోజువారీ తీసుకునే ఆహారంలో కారం, మసాలాల మోతాదును చాలా వరకు తగ్గించాలి. ఇవి శరీరంలోని వేడిని పెంచి జీవక్రియ రేటు మందగించడానికి కారణమవుతాయి.
 
2. మాంసాహారం కూడా అతిగా తినకూడదు. చికెన్, మటన్.... వంటివి ఈ కాలంలో జీర్ణ సంబంధ సమస్యల్నీ పెంచుతాయి. అరుగుదల మందగించడం, విరేచనాలు, మలబద్దకం వంటి ఇబ్బందులు తలెత్తుతాయి.
 
3. వేసవిలో ప్రధానంగా బాధించేది డీహైడ్రేషన్. నీళ్లు ఎక్కువగా తీసుకున్నప్పటికీ కాఫీ, టీల మోతాదును తగ్గించుకోవాలి. వీటిని అతిగా తీసుకోవడం వల్ల శరీరంలోని నీటి శాతం తగ్గి డీహైడ్రేషన్ ఎదురుకావచ్చు. శరీరం కూడా తేమని కోల్పోయి నిర్జీవంగా మారుతుంది.
 
4. నూనెలో వేయించినవి తగ్గించాలి. వేపుళ్లు, ఫ్రెంచ్ ఫ్రైస్, ఆలూ చిప్స్ వంటివి వాటిని దూరంగా ఉంచాలి. ముఖ్యంగా ప్రయాణాల సమయంలో వీటి జోలికి వెళ్లకూడదు. లేదంటే వికారం, అతిగా దాహం వేయడం వంటివి తప్పవు.
 
5. జంక్ పుడ్ కూడా ఈ కాలంలో మంచిది కాదు. ఇందులో అధికంగా కేలరీలు ఉండడం వల్ల బరువు పెరిగే అవకాశం ఎక్కువ. పైగా పొట్ట ఉబ్బరం, గ్యాస్ వంటివి ఎదురవుతాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Hyderabad: పెళ్లి చేసుకుంటానని.. లైంగికంగా వాడుకున్నాడు.. 20 ఏళ్ల జైలుశిక్ష

No pay no work: జీతం లేనిదే పని చేసేది లేదు.. అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల నిరసన

Adilabad: ఆదిలాబాద్ గ్రామీణ పౌర సంస్థలకు ఎన్నికలు.. ఎప్పుడంటే?

Floods: బంగాళాఖాతంలో అల్పపీడనం.. 50 ఏళ్ల తర్వాత తెలంగాణలో భారీ వర్షాలు- భారీ నష్టం

Kavitha: బీఆర్ఎస్ నుంచి కవిత సస్పెండ్.. పండగ చేసుకుంటోన్న పవన్ ఫ్యాన్స్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

త్వరలోనే తల్లి కాబోతున్న పవన్ హీరోయిన్ పార్వతీ మెల్టన్

బాలీవుడ్ నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ అలా మోసం చేశారా?

Bellamkonda: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కిష్కింధాపురి లో అమ్మాయి అదృశ్యం వెనుక వుంది ఎవరు...

రూ.100 కోట్ల క్లబ్ దిశగా కళ్యాణి ప్రియదర్శన్ 'లోకా' పరుగులు

సోనీ పిక్చర్స్ సిసు: రోడ్ టు రివెంజ్ నాలుగు భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది

తర్వాతి కథనం
Show comments