వేసవిలో తినకూడనవి ఏమిటో తెలుసా?

వేసవిలో కొన్ని పదార్థాలు నోరూరించినా వీలైనంతవరకు తగు మోతాదులోనే తీసుకోవాలి. లేదంటే కడుపు ఉబ్బరంతో పాటు అజీర్ణం వంటి సమస్యలూ ఎదురుకావచ్చు. వాటిని అధిగమించాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటంటే... 1. ఎండలు పెరిగే క్రమంలో రోజువారీ తీసుకునే ఆహారంల

Webdunia
గురువారం, 22 మార్చి 2018 (21:58 IST)
వేసవిలో కొన్ని పదార్థాలు నోరూరించినా వీలైనంతవరకు తగు మోతాదులోనే తీసుకోవాలి. లేదంటే కడుపు ఉబ్బరంతో పాటు అజీర్ణం వంటి సమస్యలూ ఎదురుకావచ్చు. వాటిని అధిగమించాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటంటే...
 
1. ఎండలు పెరిగే క్రమంలో రోజువారీ తీసుకునే ఆహారంలో కారం, మసాలాల మోతాదును చాలా వరకు తగ్గించాలి. ఇవి శరీరంలోని వేడిని పెంచి జీవక్రియ రేటు మందగించడానికి కారణమవుతాయి.
 
2. మాంసాహారం కూడా అతిగా తినకూడదు. చికెన్, మటన్.... వంటివి ఈ కాలంలో జీర్ణ సంబంధ సమస్యల్నీ పెంచుతాయి. అరుగుదల మందగించడం, విరేచనాలు, మలబద్దకం వంటి ఇబ్బందులు తలెత్తుతాయి.
 
3. వేసవిలో ప్రధానంగా బాధించేది డీహైడ్రేషన్. నీళ్లు ఎక్కువగా తీసుకున్నప్పటికీ కాఫీ, టీల మోతాదును తగ్గించుకోవాలి. వీటిని అతిగా తీసుకోవడం వల్ల శరీరంలోని నీటి శాతం తగ్గి డీహైడ్రేషన్ ఎదురుకావచ్చు. శరీరం కూడా తేమని కోల్పోయి నిర్జీవంగా మారుతుంది.
 
4. నూనెలో వేయించినవి తగ్గించాలి. వేపుళ్లు, ఫ్రెంచ్ ఫ్రైస్, ఆలూ చిప్స్ వంటివి వాటిని దూరంగా ఉంచాలి. ముఖ్యంగా ప్రయాణాల సమయంలో వీటి జోలికి వెళ్లకూడదు. లేదంటే వికారం, అతిగా దాహం వేయడం వంటివి తప్పవు.
 
5. జంక్ పుడ్ కూడా ఈ కాలంలో మంచిది కాదు. ఇందులో అధికంగా కేలరీలు ఉండడం వల్ల బరువు పెరిగే అవకాశం ఎక్కువ. పైగా పొట్ట ఉబ్బరం, గ్యాస్ వంటివి ఎదురవుతాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

అసెంబ్లీకి రాకుండా నెలవారీ జీతాలు తీసుకుంటే ఎలా.. అయ్యన్న పాత్రుడు ప్రశ్న

రాజ్యసభకు ఆర్ఆర్ఆర్.. జూన్ నాటికి ఆ నాలుగు స్థానాలు ఖాళీ

స్పేస్‌కు వీడ్కోలు చెప్పిన సునీత విలియమ్స్.. నాసాకు బైబై.. 62 గంటల 6 నిమిషాలు

బరువు తగ్గాలనుకుంది.. ఆ మందు తిని ప్రాణాలు కోల్పోయింది...

మేడారం జాతరకు భారీ సంఖ్యలో భక్తులు.. 4వేల బస్సులు నడుపుతాం.. పొన్నం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chiranjeevi: మళ్ళీ మన శంకర వరప్రసాద్ టికెట్ ధరలు పెరగనున్నాయా?

Naveen Chandra: సైకలాజికల్ హారర్ గా నవీన్ చంద్ర మూవీ హనీ తెరకెక్కుతోంది

Rajiv Kanakala: ఏ స్వీట్ రైవల్రీ తో ఆత్రేయపురం బ్రదర్స్ ప్రారంభం

Davos: వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2026 సదస్సులో రేవంత్ రెడ్డితో చిరంజీవి

పీరియాడిక్ కథతో టొవినో థామస్ మూవీ పళ్లి చట్టంబి రూపొందుతోంది

తర్వాతి కథనం
Show comments