Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ 5 పదార్థాలు తీసుకుంటే ఒత్తిడి మాయం...

Webdunia
గురువారం, 7 ఫిబ్రవరి 2019 (20:52 IST)
ప్రస్తుత కాలంలో మానవుని జీవితం ఉరుకుల పరుగులమయంగా మారింది. అందువల్ల చాలామంది మానసిక ఒత్తిడికి గురి అవుతున్నారు. మనం ఆరోగ్యంగా ఉండాలంటే మానసిక ప్రశాంతత చాలా అవసరం. అయితే ప్రకృతిలో లభించే కొన్ని రకాల పదార్దాలను మన ఆహారంలో బాగంగా చేర్చుకోవడం వల్ల ఈ ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. అవేంటో చూద్దాం.
 
1. కమలాపండు.... ఇది విటమిన్ 'సి'ని పుష్కలంగా కలిగి ఉంది. కమలాపండు అధిక రక్తపోటును నియంత్రిస్తుంది. దాంతోపాటు కార్టిసోల్ హార్మోన్ ప్రభావాన్ని తగ్గిస్తుంది. ప్రతి రోజూ ఉదయం పూట ఒక్క పండు తినటం వలన మంచి ఫలితం ఉంటుంది. 
 
2. బాదం... ఇవి శరీరంలో సెరటోనిన్ ఉత్పత్తికి సహాయపడతాయి. ఇది ఒత్తిడి, వ్యాకులతకు కారణమయ్యే కారకాలతో పోరాడుతుంది. 
 
3. నేరేడుపళ్లు.... వీటిని తరచూ తీసుకోవడం వల్ల ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. ఈ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లూ, పైటో న్యూట్రియంట్లూ ఎక్కువ మెుత్తంలో ఉంటాయి. ఇవి తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇవి ఒత్తిడిని తగ్గించడమే కాకుండా శరీరానికి కావల్సిన శక్తిని అందిస్తాయి. 
 
4. పాలు... వీటిలో యాంటీ ఆక్సిడెంట్లూ, బి2, బి12 విటమిన్లు, మాంసకృత్తులూ, క్యాల్షియం ఎక్కువ మెుత్తంలో ఉంటాయి. పాలలో ఉండే పొటాషియం అధిక రక్తపోటును అదుపులో ఉంచుతుంది. దాంతో ఒత్తిడి తగ్గి ప్రశాంతంగా ఉండగలుగుతారు. కనుక ప్రతి రోజూ గ్లాసుడు పాలు తప్పనిసరిగా త్రాగటం వలన మంచి ప్రయోజనం ఉంటుంది.
 
5. చేపలు... వీటిలో ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు అధికంగా ఉంటాయి. ఇవి ఒత్తిడికి కారణమయ్యే కార్టిసోల్ స్థాయిలను నియంత్రిస్తుంది. కాబట్టి వారంలో రెండుసార్లు చేపలను తినటం వలన మంచి ఫలితం ఉంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

మీర్‌పేట హత్య : పోలీసులం సరిగా వివరించలేకపోవచ్చు కానీ, జర్నలిస్టులు సరిగ్గా వివరించగలరు..

అవార్డుల కోసం గద్దర్ పనిచేయలేదు : కుమార్తె వెన్నెల (Video)

వ్యూస్ కోసం బాల్కనీ ఎడ్జ్ పైన బోయ్ ఫ్రెండ్‌తో మోడల్ శృంగారం, కిందపడి మృతి

మభ్యపెట్టి శారీరకంగా వాడుకున్నాడు.. బాలిక శీలానికి రూ.5 లక్షలు వెలకట్టిన పెద్దలు!

పింకీ వేధింపులు తట్టుకోలేక చనిపోతున్నా నాన్నా, నన్ను క్షమించు: భర్త సూసైడ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇల్లు కట్టుకున్నప్పుడు రాందేవ్ విదేశీ మొక్కలు ఇచ్చారు: మెగాస్టార్ చిరంజీవి

ఫాదర్స్‌ సూసైడ్‌ స్టోరీతో బాపు సినిమా : బ్రహ్మాజీ

పవన్ కల్యాణ్ పెద్ద స్థాయికి వెళతారని పంజా టైమ్‌లోనే అర్థమైంది : డైరెక్టర్ విష్ణు వర్ధన్

కొత్తదనం కావాలనుకునే వారు తల సినిమా ఆనందంగా చూడవచ్చు : అమ్మరాజశేఖర్

రాజా మార్కండేయ ట్రైలర్ లో మంచి కంటెంట్ వుంది : సుమన్

తర్వాతి కథనం
Show comments