Webdunia - Bharat's app for daily news and videos

Install App

షాపుల్లో బియ్యం పిండి కొంటున్నారా? బ్యాక్టీరియాలు, పురుగులు ఫ్రీగా వస్తాయ్ జాగ్రత్త!!

బియ్యం పిండి కొంటే వాటితోపాటు పురుగులు, బ్యాక్టీరియాలు ఫ్రీ వస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. బియ్యంలో కార్పొహైడ్రేడ్లు, ఉద్దిపప్పులో ఉండే ఫైబర్ ఆరోగ్యానికీ మేలు చేసేవే. అయితే ఇంట్లో రుబ్బుక

Webdunia
గురువారం, 23 జూన్ 2016 (16:45 IST)
ఆలుమగలు ఆఫీసులకు పరుగులు తీస్తున్న నేటి యుగంలో ఇడ్లీలకు, దోసెలకు పిండి రుబ్బుకునే స్టైల్ పాతదైపోయింది. ఆఫీసు నుంచి పోతూ పోతూ ఓ బియ్యం పిండి ప్యాకెట్ కొనుక్కెళ్లి... దోసెలు, ఇడ్లీలు తయారు చేసి.. తిని నిద్రించే కుటుంబాలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. మీరూ ఇలా ఇంట్లో పిండి రుబ్బుకోకుండా షాపుల్లో రుబ్బి ప్యాకెట్లలో ఉంచే బియ్యం పిండిని కొంటున్నారా? అయితే జాగ్రత్త పడండి. 
 
బియ్యం పిండి కొంటే వాటితోపాటు పురుగులు, బ్యాక్టీరియాలు ఫ్రీ వస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. బియ్యంలో కార్పొహైడ్రేడ్లు, ఉద్దిపప్పులో ఉండే ఫైబర్ ఆరోగ్యానికీ మేలు చేసేవే. అయితే ఇంట్లో రుబ్బుకునే పిండి సంగతి ఏమో కానీ.. షాపుల్లో దొరికే బియ్యం పిండి పాకెట్లలో బ్యాక్టీరియాలు, పురుగులుండక తప్పవని ఆరోగ్య నిపుణులు వార్నింగ్ ఇస్తున్నారు. 
 
ఇంట పిండి రుబ్బే పనైతే బియ్యాన్ని శుభ్రం చేసుకుని రాళ్లు, వడ్లు ఏరుకుని ఆపై నానబెట్టి రుబ్బుకుంటాం. అదే కిలోల లెక్కన పిండిని రుబ్బే షాపుదారులు బియ్యంలోని రాళ్లను శుభ్రం చేస్తారా అనేది ప్రశ్నార్థకం. నీరు, ఉద్దిపప్పు విషయంలోనూ నాణ్యత ఉంటుందా అనేది చూసుకోవాలి. పిండి రుబ్బే పాత్రలు, ఉపయోగించే వస్తువులు శుభ్రంగా ఉంటాయా అనేది కూడా చూడాలి. అంతేగాకుండా షాపుల్లో అమ్మే పిండిలో సోడా ఉప్పు కలపడం.. ఇంకా కొన్ని రసాయనాలు కలపడం వంటివి ద్వారా ఆరోగ్యానికి కీడు చేసే బ్యాక్టీరియాలు పిండి వెంటే ఫ్రీగా మనింటికి వచ్చి.. మన ఆరోగ్యానికి కీడు చేస్తాయి. 
 
షాపుల్లో అమ్మే బియ్యంపిండిని ఉపయోగించడం ద్వారా ఎసిడిటీ, ఫుడ్ పాయిజనింగ్ ఏర్పడే అవకాశం ఉంది. శుభ్రతలేమి కారణంగా బిండి రుబ్బేటప్పుడు చేతుల ద్వారా పిన్ వామ్, హుక్ వార్మ్ (Pin worm, Hook worm) అనే పురుగులు కూడా పిండిలో చేరుతాయి. వీటితో రక్తహీనత, విరేచనాలు ఏర్పడే అవకాశాలున్నాయి. అందుకే బియ్యం పిండి కొనేటప్పుడు నాణ్యతను బేరీజు వేసుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 
 
ఈ మధ్య షాపుల్లో అమ్మే బియ్యం పిండిపై ఆహార నాణ్యత విభాగం నిర్వహించిన పరిశోధనలో ఇ-కోలి అనే బ్యాక్టీరియా అంగట్లో అమ్మే బిండిలో ఉన్నట్లు కనుగొన్నారు. అందుచేత ఇంట్లో రుబ్బుకునే పిండికే ప్రాధాన్యత ఇవ్వాలని, షాపుల్లో బియ్యం పిండిని కొనడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేసినట్లవుతుందని వైద్యులు సూచిస్తున్నారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కనుసన్నల్లోనే పహల్గాం ఉగ్రదాడి : పంజాబ్ మంత్రి!!

Bihar: భర్తతో గొడవ.. నలుగురు పిల్లలతో కలిసి విషం తాగింది.. ఆ తర్వాత ఏమైందంటే?

Manipur: మణిపూర్‌ చందేల్ జిల్లాలో ఆపరేషన్- పదిమంది మిలిటెంట్లు మృతి

PM Modi: విశాఖపట్నంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు.. ప్రధాని హాజరు

చైనా ఆయుధ వ్యవస్థలను ఏమార్చి పాక్‍లో లక్ష్యాలపై దాడులు చేసిన భారత్!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రెడ్ కార్పెట్‌పై హొయలొలకించిన ఊర్వశి రౌతేలా... ఐశ్వర్యను కాపీ కొట్టారా?

కాంతారా 1: వారాహి పంజుర్లి ఆదేశాలను పాటిస్తున్న రిషబ్ శెట్టి.. కారణం అదే? (video)

'ఆర్ఆర్ఆర్-2'కు "ఎస్" చెప్పిన రాజమౌళి??

నేను గర్భందాల్చానా? ఎవరు చెప్పారు... : శోభిత ధూళిపాల

'శుభం' మూవీ చూస్తున్నంత సేవు కడుపుబ్బా నవ్వుకున్నా... సమంత తల్లి ట్వీట్

తర్వాతి కథనం
Show comments