Webdunia - Bharat's app for daily news and videos

Install App

నువ్వులు, తేనెతో పొట్ట వద్ద కొవ్వు కరిగిపోతుంది.. (video)

మహిళలు మూడు పదులు వయస్సు దాటితేనే బరువు పెరిగిపోతుంటారు. పొట్ట కూడా పెరిగిపోతుంది. అలా పొట్ట పెరిగిపోతూపోతే.. వెంటనే తేనె, నువ్వులు డైట్‌లో చేర్చుకోవాలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. తేనె, నువ్వు

Webdunia
సోమవారం, 20 నవంబరు 2017 (17:32 IST)
మహిళలు మూడు పదులు వయస్సు దాటితేనే బరువు పెరిగిపోతుంటారు. పొట్ట కూడా పెరిగిపోతుంది. అలా పొట్ట పెరిగిపోతూపోతే.. వెంటనే తేనె, నువ్వులు డైట్‌లో చేర్చుకోవాలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. తేనె, నువ్వులు రెండింటిలోనూ ప్రోటీన్లు, కాల్షియం సమృద్ధిగా ఉంటాయి.

వీటిని తీసుకోవడం ద్వారా మహిళల్లో ఎముకలకు సంబంధించిన నొప్పులను దూరం చేసుకోవచ్చు. తద్వారా మహిళల్లో వెన్నునొప్పి వంటి సమస్యలుండవు. ఎదిగే పిల్లలకు కూడా తేనె, నువ్వులను రోజూ పెడితే చాలా మంచిది. పోషణ సరిగ్గా అందుతుంది. 
 
మహిళలు నువ్వుల పొడిని రెండు స్పూన్లు తీసుకుని ఒక స్పూన్ తేనెతో రోజూ తీసుకుంటే శరీరంలోని కొవ్వు కరిగిపోతుంది. పొట్ట వద్ద ఉన్న కొవ్వు వేగంగా కరుగుతుంది. తద్వారా బరువు తగ్గుతారు. ఆకలిని తగ్గించడం వల్ల తిండి అదుపులో ఉంటుంది. ఫలితంగా బరువు తగ్గవచ్చు. తేనె, నువ్వులు రెండింటిలోనూ యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీంతో ఇవి శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షిస్తాయి. వ్యాధులు రాకుండా చూస్తాయి. ముఖ్యంగా ఈ కాలంలో వచ్చే సీజనల్ వ్యాధులు రావు. 
 
ఇలా నువ్వులు-తేనె కలిపి తీసుకోవడం ద్వారా రోజంతా చురుగ్గా వుంటారు. ఎంత పనిచేసినా అలసిపోరు. మహిళలకు రుతు సమయంలో వచ్చే నొప్పులు, తిమ్మిర్లు తగ్గుతాయి. వాపులు పోతాయి.

నొప్పులు తగ్గుతాయి. చర్మం కాంతివంతంగా, మృదువుగా మారుతుంది. మచ్చలు, మొటిమలు పోతాయి. వెంట్రుకలు ఆరోగ్యంగా మారుతాయి. శిరోజాలు దృఢంగా, ఒత్తుగా పెరుగుతాయి. చుండ్రు సమస్య పోతుంది. జుట్టు రాలడం తగ్గుతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.
 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments