Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ ఆకు కూరలు, పండ్లు అలా చేయకుండా తింటే డేంజర్...

చీడపీడల బారి నుంచి ఉపయోగించే పురుగుల మందులు ప్రజల ప్రాణాలకు ముప్పుగా పరిణమిస్తున్నాయి. కూరగాయలు, పండ్ల విషయంలో అశ్రద్ధ చేసి కొని, తింటే ఇక ఆరోగ్యం పాడైనట్లేనంటున్నారు వైద్య నిపుణులు. క్యారెట్, బంగాళాదుంప, ఉల్లిపాయలు వంటివి నేల లోపల పండుతున్నప్పటికీ అ

Webdunia
బుధవారం, 25 అక్టోబరు 2017 (22:19 IST)
చీడపీడల బారి నుంచి ఉపయోగించే పురుగుల మందులు ప్రజల ప్రాణాలకు ముప్పుగా పరిణమిస్తున్నాయి. కూరగాయలు, పండ్ల విషయంలో అశ్రద్ధ చేసి కొని, తింటే ఇక ఆరోగ్యం పాడైనట్లేనంటున్నారు వైద్య నిపుణులు. క్యారెట్, బంగాళాదుంప, ఉల్లిపాయలు వంటివి నేల లోపల పండుతున్నప్పటికీ అక్కడ పురుగుల మందుల అవశేషాలు ఎక్కువగా ఉంటాయి. 
 
మనం తొక్క తీసే అరటి, నారింజ వంటి వాటికి ఈ సమస్య పెద్దగా ఉండదు. క్యాబేజీలో పురుగుల మందు వాడకం ఎక్కువగా ఉంటుంది. పురుగుల మందులు క్యాబేజీపై వాడటం వల్ల అవశేషాలు లోపలికి చేరిపోవడం చాలా ఎక్కువ. క్యాబేజీపై వుండే నున్నటి మూడు పొరలను తొలగిస్తే మంచిది. మిర్చిపై కూడా పురుగుల మందులు వాడుతుంటారు. కాబట్టి ఇళ్ళలో పచ్చిమిర్చిని శుభ్రంగా కడిగే వాడాలి.
 
కాలిఫ్లవర్‌లో పురుగుల మందుల అవశేషాలు ఎక్కువగా ఉంటాయి. పువ్వుల మధ్యలో పురుగులను చంపేందుకు రసాయనాలు వాడుతారు. అందుకే పువ్వులన్నింటిని విడివిడిగా తీసి ఉప్పు ద్రవంలో నానబెట్టాలి. శుభ్రంగా కలిపి వండుకోవాలి. సలాడ్ తినడం మంచిది. కానీ అవి తినే ముందు శుభ్రంగా కడిగి తినాలి. కీరాలను కూడా శుభ్రంగా కడిగి తినాల్సిందే. టమోటా, బీన్స్, వంకాయలు చూడటానికి చాలా శుభ్రంగా ఉన్నట్లు కనిపిస్తాయి. తరిగే ముందు మాత్రం వీటిని కడగాలి. ద్రాక్షలో పురుగుల మందు ఎక్కువగా ఉంటుంది.
 
ద్రాక్షను శుభ్రంగా రుద్ది కడుక్కుని తినాలి. బిహెచ్ సి రకం పురుగుల మందును ఆకు కూరలకు వాడతారు. ఇవి చాలా డేంజర్. కొత్తిమీరతో పాటు మిగిలిన ఆకు కూరలన్నింటినీ ఉప్పు నీళ్ళలో కొద్దిసేపు ఉంచి ఆ తరువాత కడిగి మాత్రమే మరీ వాడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

kadapa: అరటిపండు ఇస్తానని ఆశ చూపి మూడేళ్ల బాలికపై అత్యాచారం.. ఎక్కడ? (video)

Kerala Woman: నాలుగేళ్ల కుమార్తెను నదిలో పారేసిన తల్లి.. పిచ్చి పట్టేసిందా?

ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన టీడీపీ కూటమి ప్రభుత్వం!

ఆపరేషన్ సిందూర‌తో పాకిస్థాన్ వైమానిక దళానికి అపార నష్టం!!

waterfalls: కొడుకును కాపాడిన తండ్రి.. జలపాతంలోనే మునక... ఎక్కడ?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మనమంతా కలిసి తెలుగు సినిమాను కాపాడుకోవాలి - నిర్మాత ఎస్ కేఎన్

ఫోక్ యాంథమ్ తో ఆకట్టుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అదితి శంకర్

తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించిన థాంక్యూ డియర్ లుక్

థ్రిల్లర్ గా అర్జున్ అంబటి పరమపద సోపానం చిత్రం రాబోతోంది

హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఘటికాచలం: నిర్మాత ఎస్ కేఎన్

తర్వాతి కథనం
Show comments