కమలా పండు రసం కాదు... నేరుగా తింటేనే...

కమలా పండు సీజన్ వచ్చేసింది. ఈ పండ్లు తిన్నట్లయితే అధిక మోతాదులో లభించే విటమిన్ 'ఎ' వల్ల దృష్టి లోపాలను నివారిస్తుంది. కమలా పండులో మాంసకృత్తులు, పిండిపదార్థాలు, పీచుతో పాటు ఖనిజ లవణాలైన క్యాల్షియం, ఫాస్పరస్, ఇనుము, సోడియం, పొటాషియం పుష్కలంగా లభిస్తాయి

Webdunia
శనివారం, 25 నవంబరు 2017 (18:33 IST)
కమలా పండు సీజన్ వచ్చేసింది. ఈ పండ్లు తిన్నట్లయితే అధిక మోతాదులో లభించే విటమిన్ 'ఎ' వల్ల దృష్టి లోపాలను నివారిస్తుంది. కమలా పండులో మాంసకృత్తులు, పిండిపదార్థాలు, పీచుతో పాటు ఖనిజ లవణాలైన క్యాల్షియం, ఫాస్పరస్, ఇనుము, సోడియం, పొటాషియం పుష్కలంగా లభిస్తాయి. ఇందులోని ఏ, సీ విటమిన్లతో పాటు థయామిన్, నియాసిన్, రైబోఫ్లేవిన్ తదితరాలు మెండుగా ఉంటాయి.
 
కమలా ఫలం నేరుగా తినడం వల్ల జీర్ణక్రియకు అవసరమైన ఎంజైమ్‌లు అధికంగా ఉత్పత్తి అవుతాయి. ఫలితంగా జీర్ణక్రియ వేగవంతం అవుతుంది. కమలాఫలం రసానికి, వేపాకుల పొడి కలిపి ముఖానికి ప్యాక్‌లా వేసుకుని కడిగేస్తే మొటిమలు, మచ్చలు తగ్గి చర్మం కాంతివంతం అవుతుంది. దీని తొక్కలను ఎండబెట్టి పొడిచేస్తే చక్కని సౌందర్య సాధనంగా ఉపయోగపడుతుంది. 
 
కమలా పండు రసాన్ని స్నానం చేసే నీటిలో కలిపితే శరీర దుర్వాసన మాయమవుతుంది. కమలా రసంలో కొంచెం నీరు కలిపి ముఖానికి ప్యాక్‌లా వేసుకుంటే మృతకణాలు దూరమవుతాయి. ఈ పొడికి కొంచెం శెనగపిండి చేర్చితే చక్కని నలుగులా పనిచేస్తుంది. ముఖం, చేతులు తాజాదనం సంతరించుకోవాలంటే కమలాఫలం గుజ్జును నేరుగా లేదా కొంచెం తేనె కలిపి రాసుకుంటే సరిపోతుంది.
 
క్షయ, ఉబ్బసంతో బాధపడేవారు ప్రతిరోజూ క్రమం తప్పకుండా కమలా పండును ఆహారంలో భాగంగా తీసుకున్నట్లయితే ఆయా సమస్యల నుంచి క్రమంగా దూరమవవచ్చు. అలాగే మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడకుండా, శరీరంలో కొవ్వు స్థాయిని తగ్గించటంలోనూ కమలా పండు అద్భుతమైన ఔషధంగా పనిచేస్తుంది. కమలా పండులోని శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని కణాలు నశించకుండా చూస్తాయి. ఫోలిక్ ఆమ్లం మెదడు పని తీరును మెరుగుపరచి చురుకుగా ఉంచుతుంది. 
 
జలుబు, దగ్గుతో బాధపడేవారు విటమిన్ సీ అధికంగా ఉండే కమలా పండు రసం తాగినట్లయితే సమస్య తగ్గుముఖం పడుతుంది. కమలా పండులో లభించే విటమిన్ సీ దంత సంబంధ వ్యాధులను అరికట్టడంలోనూ ఎంతగానో సహకరిస్తుంది. శరీరం నీరసంగా ఉన్నప్పుడు కమలా రసం తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది. ఇందులో అధికంగా ఉండే చక్కెర శరీరానికి సత్వర శక్తిని ఇస్తుంది. మలబద్ధకం, తలనొప్పితో బాధపడేవారు ఈ రసంలో ఉప్పు కలిపి తీసుకుంటే ఫలితం ఉంటుంది. తేనె కలిపి తీసుకుంటే గుండె సంబంధ వ్యాధులు అదుపులో ఉంటాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

మోసం చేసిన ప్రియురాలు.. ఆత్మహత్య చేసుకున్న ఇన్ఫోసిస్ టెక్కీ

జార్ఖండ్‌లో ఘోరం.. భార్య మద్యం సేవించి వచ్చిందని భర్త దాడి.. తీవ్రగాయాలతో మృతి

ప్రియురాలిని చంపి సూట్‌కేసులో కుక్కి... కాలువలో పడేశాడు...

Mock Assembly in Amaravati: విద్యార్థులతో మాక్ అసెంబ్లీ.. హాజరైన చంద్రబాబు, నారా లోకేష్ (video)

అర్థరాత్రి రాపిడో బ్రేక్ డౌన్... యువతి కంగారు... ఆ కెప్టెన్ ఏం చేశారంటే....

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NBK 111: నందమూరి బాలకృష్ణ 111వ చిత్రం పూజ షురూ

భర్తపై గృహహింస - క్రూరత్వం - మోసం కేసు పెట్టిన బాలీవుడ్ నటి

రెజ్లింగ్ క్లబ్ నేపథ్యంలో చఠా పచా – రింగ్ ఆఫ్ రౌడీస్ రాబోతోంది

Naveen Plishetty: అనగనగ ఒకరాజు నుండి భీమవరం బాల్మా మొదటి సింగిల్ అప్ డేట్

Anantha Sriram: గీత రచయిత కష్టం తెలిసినవారు ఇండస్ట్రీలో కొద్దిమందే : అనంత శ్రీరామ్

తర్వాతి కథనం
Show comments