Webdunia - Bharat's app for daily news and videos

Install App

కివీ పండు తింటే కాంతివంతంగా వుంటారు...

Webdunia
శుక్రవారం, 13 డిశెంబరు 2019 (19:50 IST)
తక్కువ వయస్సులోనే చాలామంది వయసు పైపడినట్లు కనిపిస్తుంటారు. తీసుకునే ఆహారంలో చర్మ ఆరోగ్యాన్ని పెంచే ఆహారాలు లేకపోవడం, కాలుష్యం వంటి కారణాల వల్ల చర్మం పొడిబారడం, తక్కువ వయసులోనే ముడతలు పడటం వల్ల కాంతిహీనంగా తయారవుతుంది. 
 
అయితే యాంటీఏజింగ్ మరియు యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు కలిగిన కూరగాయలు, పండ్లు తీసుకోవడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉండటంతో పాటు చర్మంపై ముడతలు, చర్మం వదులుగా మారడం వంటి లక్షణాలు తగ్గుతాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం...
 
1. కివీ పండు విటమిన్-సితోపాటు యాంటీ ఆక్సిడెంట్‌ను సమృద్ధిగా కలిగి ఉంది. ఇది చర్మానికి కావలసిన పోషకాలను అందించి చర్మం మీద ముడతలను నివారిస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఏజింగ్ లక్షణాలు చర్మాన్ని కాంతివంతంగా మారుస్తాయి.
 
2. తరచుగా దానిమ్మ గింజలు మరియు దానిమ్మ జ్యూస్ తీసుకోవడం వల్ల ఇది చర్మ కణాలకు కావలసిన పోషకాలను అందిస్తుంది. దానిమ్మ చర్మాన్ని బిగుతుగా మార్చే యాంటీ ఏజింగ్ లక్షణాలను సమృద్ధిగా కలిగి ఉంది. ఇది మీ చర్మానికి కావలసిన పోషణను అందించి అందం, మంచి గ్లోయింగ్ వచ్చేలా సహాయపడుతుంది.
 
3. పుచ్చకాయ చర్మానికి కావలసిన పోషకాలను అందించి చర్మం ముడతలు పడకుండా నివారిస్తుంది. ఇది చర్మానికి కావలసిన తేమను అందించి డీహైడ్రేషన్ బారిన పడకుండా చూస్తుంది. పుచ్చకాయ గింజల్లో కూడా చర్మ సౌందర్యానికి కావలసిన పోషకాలు పుష్కలంగా ఉన్నాయి.
 
4. ద్రాక్ష కూడా చర్మ సౌందర్యాన్ని పెంచడంలో ఎంతో దోహదపడుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ ఫ్రీరాడికల్స్‌తో పోరాడి వయసు పెరగడం వలన వచ్చే చర్మ లక్షణాలను తగ్గిస్తుంది.
 
5. యాపిల్‌లో చర్మం ముడతల సమస్యను ఎదుర్కొనే లక్షణాలు అధికంగా ఉన్నాయి. తరచుగా యాపిల్‌ని తిన్నా లేదా యాపిల్ గుజ్జును చర్మానికి అప్లై చేసుకున్నా వృద్దాప్యపు గుర్తులను తగ్గించుకోవచ్చు. ఇందులో ఉన్న పోషకాలు మరియు యాంటీ ఏజింగ్ లక్షణాలు చర్మాన్ని తాజాగా ఉంచుతాయి.

సంబంధిత వార్తలు

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రజల్ వీడియోలు : సస్పెండ్ చేసిన జేడీఎస్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు : టీడీపీ - జనసేన - బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో ముఖ్యాంశాలు ఇవే..

బీజేపీ రాజ్యాంగ పుస్తకాన్ని విసిరివేయాలనుకుంటోంది.. రాహుల్ గాంధీ ఫైర్

విజయవాడలో దారుణం : ఇంటిలో రక్తపు మడుగులో నాలుగు శవాలు.. ఇంటి బయట మరో శవం..

కోకో చెట్లను తుడిచిపెట్టే వినాశకరమైన వైరస్

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments