Webdunia - Bharat's app for daily news and videos

Install App

తలంబ్రాలు చెట్టు ఆకులను ఆముదంలో కలిపి దంచి అక్కడ రాస్తే...

Webdunia
గురువారం, 9 మే 2019 (21:16 IST)
ఈ మధ్యకాలంలో చాలామంది మోకాళ్ళ నొప్పుల సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. ముఖ్యంగా 40 నుంచి 60 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళకు విపరీతమైన మోకాళ్ళ నొప్పి సమస్య వస్తూ ఉంది. మన జీవనశైలి మారడం వల్ల ఆహారపు అలవాట్ల మారడం వల్ల ఈ మధ్యకాలంలో ముప్పై సంవత్సరాలు పైబడిన వారిలో కూడా మోకాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు విపరీతంగా బాధిస్తూ ఉన్నాయి. 
 
అయితే ఈ మోకాళ్ళ నొప్పులను తగ్గించుకోవడానికి చాలామంది కొన్ని టాబ్లెట్లు ఇస్తారు. టాబ్లెట్లు వాడడం వల్ల కొన్ని రోజులు పనిచేసి ఆ తరువాత మళ్ళీ నొప్పులు ప్రారంభమవుతాయి. మరికొంతమంది శస్త్రచికిత్సలు కూడా చేయించుకుని ఆ ఆపరేషన్లు విఫలమై మళ్ళీ బాధపడుతూ ఉంటారు.
 
నేచురల్‍గా మోకాళ్ళ నొప్పులను తగ్గించుకునే మార్గాలున్నాయంటున్నారు ఆయుర్వేద నిపుణులు. తలంబ్రాలు చెట్టు మోకాళ్ళ నొప్పులకు మంచి ఔషధమట. గ్రామాలలో ఈ చెట్టు ఎక్కువగా కనిపిస్తుంటుంది. చెరువు కట్టలు, పిల్ల కాలువల పక్క గానీ ఆ కాలువలో ఇరువైపులా మొక్కలు అధికంగా కనిపిస్తుంటాయి. 
 
వాటి ఆకులను తీసుకుని ఆముదం నూనెను కొంచెం బాగా దంచి లేబనంగా చేసుకొని మోకాళ్ళ నొప్పులు ఎక్కడున్నాయో అక్కడ పైపూతగా పూసి ఒక బట్టతో గట్టిగా కట్టుకట్టాలి. దీనిని సాయంత్రం పడుకునే ముందు చేయాలి. ఇలా నెలరోజుల పాటు చేస్తే మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయంటున్నారు ఆయుర్వేద నిపుణులు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Andhra Pradesh: COVID-19 మార్గదర్శకాలను జారీ చేసిన ఏపీ సర్కారు

Chhattisgarh: బసవ రాజుతో సహా 27మంది మావోయిస్టులు మృతి

తిరుమలలో అపచారం: కొండపై నమాజ్ చేసిన వ్యక్తి - వీడియో వైరల్

Jio: ఆంధ్రప్రదేశ్ టెలికాం సర్కిల్‌లో జియో నెట్‌వర్క్‌ ఏర్పాటు

Drum Tower: 650 ఏళ్ల డ్రమ్ టవర్ కూలిపోయింది.. వీడియో

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ మరోసారి మన టైమ్ రావాలంటున్న చిరంజీవి, బాబీ

‘వార్ 2’ టీజర్‌కు వచ్చిన స్పందన చూస్తే ఎంతో ఆనందంగా వుంది :ఎన్టీఆర్

నేను ద్రోణాచార్యుని కాదు, ఇంకా విద్యార్థినే, మీరు కలిసి నేర్చుకోండి : కమల్ హాసన్

Poonam Kaur: త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మళ్లీ ఇన్‌స్టా స్టోరీ.. వదిలేది లేదంటున్న పూనమ్

Peddi: సత్తిబాబు కిళ్లీకొట్టు దగ్గర పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్, బుజ్జిబాబు

తర్వాతి కథనం
Show comments