Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎలాంటి ఆహార పదార్థాలను కొనాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

మనం తీసుకునే ఆహారం ఎంత పుష్టికరమైనదైనా శుభ్రత లోపిస్తే ఆరోగ్యం దెబ్బతిని రోగాలకు గురి అవుతాము. మనం తినే ఆహారం, త్రాగే నీరు సూక్ష్మక్రిముల వల్ల కలుషితం అయ్యే ప్రమాదం ఉంది. అలాకాకుండా మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చు. అవేంటో తెలుసుకుందాం.

Webdunia
శనివారం, 15 సెప్టెంబరు 2018 (14:49 IST)
మనం తీసుకునే ఆహారం ఎంత పుష్టికరమైనదైనా శుభ్రత లోపిస్తే ఆరోగ్యం దెబ్బతిని రోగాలకు గురి అవుతాము. మనం తినే ఆహారం, త్రాగే నీరు సూక్ష్మక్రిముల వల్ల కలుషితం అయ్యే ప్రమాదం ఉంది. అలాకాకుండా మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చు. అవేంటో తెలుసుకుందాం.
 
1. ఆహారపదార్థాలను కొనేటప్పుడు ఎక్కువ శ్రద్ధ వహించి యోగ్యమైన వాటినే కొనాలి. మెత్తబడిన, పగిలిన కూరగాయలు, పండ్లు కొనగూడదు.
 
2. ఆహారపదార్థాలను గాలి, వెలుతురు తగిలే చోట, తేమ తగలకుండా నిలువ చేయాలి. అలాగే వండే ముందు పండ్లు, కూరగాయలను ఎక్కువ నీటిలో శుభ్రంగా కడగాలి.
 
3. వంట పాత్రలను శుభ్రంగా ఉంచుకోవాలి. అంతేకాకుండా వంటకు శుభ్రమైన నీటిని వాడాలి. 
 
4. మనం త్రాగే నీరు కాచి చల్లార్చి, వడబోసి తాగడం శ్రేయస్కరం.
 
5. వండిన పదార్థాలపై ఎప్పుడూ మూత వేసి ఉంచాలి. లేకపోతే క్రిములు చేరి కలుషితం చేస్తాయి.
 
6. వంట ఇంటిని, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే శరీర శుభ్రత కూడా చాలా అవసరం. వంట చేసే ముందు, వడ్డించే ముందు అలాగే తినబోయే ముందు కాళ్లు, చేతులను శుభ్రంగా కడుక్కోవాలి.
 
7. ముఖ్యంగా చిన్నపిల్లల ఆహార విషయంలో శుచి, శుభ్రతకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. పాలు పట్టడానికి వాడే సీసాలు, పీకలను చాలా శుభ్రంగా కడిగి వేడి నీటిలో మరగబెట్టి వాడాలి.
 
8. ఆహారం పరిశుభ్రత లోపిస్తే రోగాలకు గురి అవడమే కాకుండా కొన్ని సందర్భాలలో మరణానికి కూడా దారి తీయవచ్చు. అందుకే తగు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతైనా అవసరం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఇండియా మళ్లీ యుద్ధం అంటే ఇక వారికేమీ మిగలదు: పాక్ ప్రధాని

ఆపరేషన్ సిందూర్ ట్రైలర్ మాత్రమే.. ముందుంది రియల్ సినిమా : మంత్రి రాజ్‌నాథ్ వార్నింగ్

Hyderabad: అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి.. శరీరంపై గాయాలు

Night Shift: నైట్ షిఫ్ట్ కోసం వెళ్తున్న 27ఏళ్ల మహిళపై అత్యాచారం

Balochistan దేశం వచ్చేసిందని బలూచిస్తాన్ ప్రజలు పండగ, పాకిస్తాన్ ఏం చేస్తోంది? (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రూ.28 కోట్లు పెట్టి చిత్రాన్ని తీస్తే రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది...

కంగ్రాట్స్ అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్యా, నువ్వు టాలీవుడ్ టాప్ హీరోయిన్ అవ్వాలి

Pawan: హరిహరవీరమల్లుకు డేట్ ఫిక్స్ చేసిన పవన్ కళ్యాణ్

NTR: ఎన్.టి.ఆర్. వార్ 2 గురించి హృతిక్ రోషన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

చైనా ఉత్పత్తులను కొనడం మానేద్దాం.. మన దేశాన్ని ఆదరిద్దాం : రేణూ దేశాయ్ పిలుపు

తర్వాతి కథనం
Show comments