Webdunia - Bharat's app for daily news and videos

Install App

శీతాకాలంలో అల్లం రసం దానితో కలిపి తీసుకుంటే?

Webdunia
సోమవారం, 5 నవంబరు 2018 (21:34 IST)
వర్షాకాలం మరియు చలి కాలాలలో, తరచుగా గాలిలో చురుకుగా ఉన్న సూక్ష్మజీవుల కారణంగా అనారోగ్యాలు తలెత్తడం సర్వసాధారణం. క్రమంగా, జలుబు మరియు ఫ్లూ వంటి సమస్యలను ఎదుర్కొనడానికి సరైన రోగనిరోధక పనితీరును నిర్వహించడం కష్టతరం అవుతుంది. 
 
ఆహారంలో అల్లం కలిపి తీసుకోవడం అలవాటుగా ఉంటే, ఇటువంటి సూక్ష్మజీవులు వీలైనంత వరకు తగ్గుముఖం పడుతాయి. అల్లం ఒక యాంటీమైక్రోబయాల్ ఏజెంట్‌లా పనిచేస్తుంది, అనగా అంతర్గత మరియు బాహ్య ప్రభావిత బ్యాక్టీరియాను చంపే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అల్లం తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో చూద్దాం.
 
1. అల్లం జీవక్రియలను పెంపొందించడంలో ఉత్తమ ప్రభావాలను కలిగి ఉంటుందని ఆహార నిపుణులు సూచిస్తుంటారు. అల్లం మరియు నిమ్మకాయలు కలిపినప్పుడు, అది మీ జీవక్రియలను పెంచడంలో సహాయం చేస్తుంది. 
 
2. బరువు పెరగాలనుకునే వారికి కడుపులో మరింత యాసిడ్ ఉత్పత్తి చేయడం ద్వారా ఆకలిని ప్రేరేపించగల లక్షణాలు అల్లంలో ఉంటాయి. క్రమంగా జీవక్రియలు పెరుగుతాయి.
 
3. బరువు తగ్గాలని భావిస్తున్నవారికి కూడా అల్లం ఉపయోగకరంగా ఉంటుంది. కడుపు లోపలి ఆమ్లం జీవక్రియలపై ప్రభావాన్ని చూపుతాయి, ఇవి మరిన్ని కేలరీలను మరియు కొవ్వులను దహించేలా సహాయం చేస్తుంది.
 
4. రాత్రి సమయాల్లో నిమ్మరసం మరియు అల్లం రసం త్రాగడం ద్వారా మూత్రపిండాలలో రాళ్ళు ఏర్పడకుండా సహాయం చేస్తుంది. నిమ్మ రసం మూత్రంలో సిట్రేట్ స్థాయిలను పెంచుతుంది, ఇది మూత్రపిండాల్లో ఏర్పడే కాల్షియం రాళ్ళను విచ్ఛిన్నం చేయడం లేదా నివారించడంలో సహాయపడుతుంది. ఈ కాల్షియం రాళ్ళనే మూత్రపిండంలో రాళ్ళుగా సూచించబడతాయి.
 
5. రోగనిరోధకశక్తి తక్కువగా ఉన్నప్పుడు వర్షాకాలం మరియు శీతాకాలం సమయాలలో అల్లం మరియు నిమ్మరసం ఎంతో సహాయకంగా ఉంటుంది. దగ్గు, జలుబు, గొంతు సమస్యలతో ఇబ్బంది పడేవారు అల్లం, నిమ్మ టీలను తాగడం వలన మంచి ఫలితం ఉంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

పొట్టి దస్తులు ధరించే మహిళలు రాక్షసి శూర్పణఖలు : బీజేపీ మంత్రి కైలాస్ విజయ్

Elon Musk: నేను లేకుంటే, ట్రంప్ ఎన్నికల్లో ఓడిపోయేవాడు: ట్రంప్‌పై ఫైర్ అయిన ఎలోన్ మస్క్

Sharmishta: శర్మిష్ట పనోలికి మధ్యంత బెయిల్ మంజూరు చేసిన కోల్‌కతా హైకోర్టు

What is a Super-Earth?: కెప్లర్-725c అనే కొత్త సూపర్ ఎర్త్‌ను కనుగొన్న చైనా!

Indore Man: హనీమూన్ ట్రాజెడీ: రాజా మృతి.. భార్య సోనమ్ ఎక్కడ? సీబీఐ దర్యాప్తుకు డిమాండ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రూ.21 కోట్లు వడ్డీతో చెల్లించండి.. విశాల్‌కు హైకోర్టు ఆదేశం

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

తర్వాతి కథనం
Show comments