Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్టీమింగ్ మెషిన్‌లో తులసి ఆకులు వేసి ఆవిరిపడితే..... (video)

Webdunia
బుధవారం, 31 జులై 2019 (21:52 IST)
కొంతమంది జలుబు, జ్వరం, తలనొప్పి వచ్చినప్పుడు మందులు వేసుకోరు. ఎందుకంటే.... కొంతమందికి మందులు వేసుకోవడం వలన సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటాయి. తలతిరగడం, వాంతులు ఇలాంటి సమస్యలు ఎదురవుతాయి. అలాంటివారు సహజసిద్ధంగా లభించే తులసితో జలుబు, జ్వరం సమస్యలను తగ్గించుకోవచ్చు. ఆ చిట్కాలేమిటో చూద్దాం.
 
1. జలుబు, జ్వరంతో బాధపడేవారు నాలుగు తులసి ఆకులను నమలాలి. లేదంటే గ్లాసు నీళ్లల్లో తులసి ఆకులను వేసి బాగా మరిగించాలి. అవి గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగితే శరీరంలోని ఇన్ఫెక్షన్లు దూరమవుతాయి. జ్వరము తగ్గుముఖం పడుతుంది.
 
2. దగ్గుతో బాధపడుతున్నప్పుడు గ్లాసు నీళ్లల్లో లవంగాలు, తులసి ఆకులను వేసి బాగా మరిగించి ఆ నీళ్లు తాగితే మంచి ఫలితం ఉంటుంది.
 
3. తులసి ఆకులను తీసుకోవడం వలన రక్తం కూడా శుద్ధి అవుతుంది. ఈ ఆకులలో విటమిన్ ఎ ఉంటుంది. ఇది కంటిచూపును మెరుగుపరుస్తుంది. అలానే వీటిల్లో ఉండే యాంటీఆక్సీడెంట్లు గుండెకు మేలు చేస్తాయి.
 
4. తలనొప్పిగా ఉన్నప్పుడు స్టీమింగ్ మెషిన్‌లో తులసి ఆకులు వేసి ఆవిరిపడితే తల భాగంలోని నరాలు ఉత్తేజితమవుతాయి. తద్వారా తలనొప్పి తగ్గుతుంది.
 
5. మధుమేహం ఉన్నవారు డికాక్షన్లో తులసి ఆకులను వేసుకుని తాగితే రక్తంలోని చక్కెర శాతం అదుపులోకి వస్తుంది.
 
6. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు తులసి ఆకులను తింటే మంచిదని అధ్యయనాలు చెబుతున్నాయి. తులసి ఆకుల్లోని యాంటీఆక్సీడెంట్లు శరీరంలోకి విడుదలై రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

ఒత్తిడిగా ఉన్నప్పుడు ఇవి తింటే శరీరంలో మేలు చేసే హార్మోన్లు విడుదలవుతాయి. తరచూ ఆందోళనా, ఒత్తిడికి గురి అవుతుంటే పది పన్నెండు ఆకులను నమలాలి.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

అద్దెకు ఉంటున్న యువతి బాత్రూమ్‌లో సీక్రెట్ కెమెరా... లైవ్‌లో చూస్తూ పైశాచికం...

హనీమూన్ ట్రిప్ పేరుతో ఘరానా మోసం... కొత్త జంటకు కుచ్చుటోపీ...

ఒక్క ఛాన్స్ వస్తే హోం మంత్రిని అవుతా.. ఆపై రెడ్ బుక్ ఉండదు.. బ్లడ్ బుక్కే : ఆర్ఆర్ఆర్

హిమాచల్ ప్రదేశ్ ఆగని వర్షాలు... వరదలకు 75 మంది మృతి

రూ.7.5 కోట్ల ఫెరారీ కారుకు రూ.1.42 కోట్ల పన్ను.. క్షణాల్లో చెల్లించిన కోటీశ్వరుడు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

తర్వాతి కథనం
Show comments