Webdunia - Bharat's app for daily news and videos

Install App

భోజనం చేశాక, చేయకముందు ఏం చేయాలో తెలుసా?

Webdunia
మంగళవారం, 2 జులై 2019 (12:42 IST)
మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలంటే కష్టంగా ఉన్నా కొన్ని పద్ధతులను ఇష్టంగా పాటించవలసిందే. ప్రస్తుతకాలంలో ఎక్కువమంది ఎదుర్కుంటున్న సమస్య అధిక బరువు. సాధారణంగా బరువు పెరగడం చాలా తేలికగా పెరుగుతాము. కానీ తగ్గాలంటే చాలా కష్టపడాలి. ఈ సమస్య రాకుండా ముందే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. అందుకు భోజనం చేయకముందు, చేశాక కొన్నింటిని తినకుండా ఉంటే బరువు పెరగడం, పొట్ట పెరగడం లాంటి వాటిని నివారించవచ్చు. అదెలాగో చూద్దాం.
 
1. భోజనం చేసే ముందు లేదా తరువాత పండ్లు ఎక్కువగా తినకూడదు. అందువల్ల పొట్ట బాగా పెరిగే అవకాశం ఉంది.
 
2. అన్నం తిన్న వెంటనే టీ తాగకూడదు. అలా చేస్తే తేయాకులో ఉండే ఆమ్లాలు ఆహారంలో ఉండే మాంసకృత్తులను శరీరం వినియోగించుకోకుండా అడ్డుకుంటాయి.
 
3. ఎప్పుడైనా తినగానే స్నానం చేయకూడదు. దానివల్ల కాళ్లు, చేతులులోకి రక్తప్రసరణ పెరుగుతుంది. అందువల్ల పొట్ట చుట్టూ రక్తప్రసరణ తగ్గి, జీర్ణ వ్యవస్థ పనితీరు మందగిస్తుంది.
 
4. అలాగే భోజనం అయ్యాక పది నిముషాల పాటు నడిస్తే మంచిదని అంటుంటారు. కానీ... అలా నడవడం వలన పోషకాలను గ్రహించడంలో జీర్ణ వ్యవస్థ విఫలమవుతుంది. కాబట్టి తిన్న వెంటనే కాకుండా ఒక పది నిమిషముల తరువాత నడిస్తే మంచిది.
 
5. ముఖ్యంగా తినగానే నిద్రపోకూడదు. అలా నిద్రపోతే తిన్న ఆహారం జీర్ణమవ్వక ఇబ్బందులు తలెత్తుతాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

భర్త మొబైల్ ఫోన్ ఇవ్వలేదని భార్య ఆత్మహత్య

జార్ఖండ్ గవర్నర్‌గా పనిచేస్తే అత్యున్నత పదవులు వరిస్తాయా? నాడు ముర్ము - నేడు సీపీఆర్

కృష్ణాష్టమి వేడుకల్లో అపశృతి - విద్యుత్ షాక్‌తో ఐదుగురి మృతి

కుమార్తె అప్పగింత వేళ ఆగిన గుండె... పెళ్లింట విషాదం!

ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సీపీఆర్ - చంద్రబాబు - పవన్ హర్షం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

VN Aditya: ఫెడరేషన్ నాయకులను మారిస్తే సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి : VN ఆదిత్య

వాళ్లు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తారు... మేము ఎడ్యుకేట్ చేస్తాం : ఏఆర్ మురుగదాస్

రీ రిలీజ్‌కు సిద్దమైన 'స్టాలిన్' మూవీ

పవన్ కళ్యాణ్ ఓ పొలిటికల్ తుఫాను : రజనీకాంత్

వీధి కుక్కలను చంపవద్దు అంటే ఎలా? దత్తత తీసుకోండి.. హ్యాష్ ట్యాగ్ సృష్టించండి.. వర్మ (video)

తర్వాతి కథనం
Show comments