Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెరుగులో ఎండుద్రాక్ష వేసి మరుసటి రోజు ఆరగిస్తే...

Webdunia
మంగళవారం, 21 ఫిబ్రవరి 2023 (13:24 IST)
ప్రతి ఒక్కరికీ భోజనంలో పెరుగుతినే అలవాటు ఉంటుంది. అలాగే, ఎండు ద్రాక్షను కూడా చాలా మంది ఇష్టపడుతుంటారు. అయితే, పెరుగులో ఎండుద్రాక్షను వేసి మరుసటి రోజు ఆరగిస్తే ఆరోగ్యానికి ఎంతో మేలని పౌషకాహార నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
 
గోరు వెచ్చని పాలను పెరుగుతో తోడు పెట్టే సమయంలోనే పాలలో ఒక టీ స్పూన్ ఎండుద్రాక్ష వేస్తే, మరుసటి రోజుకు ఎండుద్రాక్ష పెరుగు సిద్ధమవుతుంది. దీన్ని మధ్యాహ్న భోజనం తర్వాత లేదా సాయంత్రం స్నాక్‌గా తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని వారు చెబుతున్నారు. అవేంటో ఓసారి తెలుసుకుందాం.
 
ఇలా తయారయ్యే పెరుగులో ప్రోబయాటిక్, ఎండుద్రాక్ష ప్రిబయాటిక్.. ఈ రెండింటి అరుదైన సమ్మేళనం అమోఘమైన ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. పెరుగు పేగుల్లో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాను పెంచుతుంది. ఈ బ్యాక్టీరియాకు అవసరమైన ఆహారాన్ని ఎండుద్రాక్షలోని పీచు
సమకూరుస్తుంది.
 
ఈ రెండింటి సమ్మేళనం వల్ల కడుపు ఉబ్బరం, అజీర్తి, యుటిఐ, కొలెస్ట్రాల్, అకారణంగా బరువు పెరగడం, థైరాయిడ్, పిసిఒడిల నుంచి ఉపశమనం దక్కుతుంది. పెరుగుతో బరువు పెరుగుతామనేది అపోహ. ప్రతి రోజూ ఇలా ఎండుద్రాక్షలతో తయారుచేసుకున్న పెరుగును తినడం వల్ల బరువు తగ్గుతారని చెబుతున్నారు. పెరుగు కోసం ఉపయోగించే పాలు వెన్న తీయని పాలై ఉంటే మరీ మంచిదిగా ఉంటుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

బంధువుల ఇంటికి వెళ్లిన చిన్నారి శవమై కనపించింది... ఎలా?

వైకాపా ఓటమికి రాజధాని అమరావతి కూడా ఓ కారణం : జోగి రమేశ్

నవ్యాంధ్ర రాజధాని అమరావతి వేశ్వల రాజధానినా?

ఏపీ రాష్ట్ర చరిత్రలోనే భారీగా ప్రమోషన్లు.. వైకాపా సానుభూతి ఉద్యోగులకు కూడా..

కిడ్నీ సమస్యలతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కన్నుమూత

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

తర్వాతి కథనం
Show comments