పెరుగులో ఎండుద్రాక్ష వేసి మరుసటి రోజు ఆరగిస్తే...

Webdunia
మంగళవారం, 21 ఫిబ్రవరి 2023 (13:24 IST)
ప్రతి ఒక్కరికీ భోజనంలో పెరుగుతినే అలవాటు ఉంటుంది. అలాగే, ఎండు ద్రాక్షను కూడా చాలా మంది ఇష్టపడుతుంటారు. అయితే, పెరుగులో ఎండుద్రాక్షను వేసి మరుసటి రోజు ఆరగిస్తే ఆరోగ్యానికి ఎంతో మేలని పౌషకాహార నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
 
గోరు వెచ్చని పాలను పెరుగుతో తోడు పెట్టే సమయంలోనే పాలలో ఒక టీ స్పూన్ ఎండుద్రాక్ష వేస్తే, మరుసటి రోజుకు ఎండుద్రాక్ష పెరుగు సిద్ధమవుతుంది. దీన్ని మధ్యాహ్న భోజనం తర్వాత లేదా సాయంత్రం స్నాక్‌గా తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని వారు చెబుతున్నారు. అవేంటో ఓసారి తెలుసుకుందాం.
 
ఇలా తయారయ్యే పెరుగులో ప్రోబయాటిక్, ఎండుద్రాక్ష ప్రిబయాటిక్.. ఈ రెండింటి అరుదైన సమ్మేళనం అమోఘమైన ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. పెరుగు పేగుల్లో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాను పెంచుతుంది. ఈ బ్యాక్టీరియాకు అవసరమైన ఆహారాన్ని ఎండుద్రాక్షలోని పీచు
సమకూరుస్తుంది.
 
ఈ రెండింటి సమ్మేళనం వల్ల కడుపు ఉబ్బరం, అజీర్తి, యుటిఐ, కొలెస్ట్రాల్, అకారణంగా బరువు పెరగడం, థైరాయిడ్, పిసిఒడిల నుంచి ఉపశమనం దక్కుతుంది. పెరుగుతో బరువు పెరుగుతామనేది అపోహ. ప్రతి రోజూ ఇలా ఎండుద్రాక్షలతో తయారుచేసుకున్న పెరుగును తినడం వల్ల బరువు తగ్గుతారని చెబుతున్నారు. పెరుగు కోసం ఉపయోగించే పాలు వెన్న తీయని పాలై ఉంటే మరీ మంచిదిగా ఉంటుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

తాడిపత్రిలో వైకాపా నేత ఆర్సీ ఓబుల్ రెడ్డిపై దాడి - ఉద్రిక్తత

వరకట్నం వేధింపులు.. భర్త ఇంట్లో లేని సమయం చూసి ఉరేసుకుని ఆత్మహత్య

టిక్ టాక్ వీడియోలు పోస్ట్ చేసిన యువతిని కాల్చి చంపేశారు... ఎక్కడ?

High alert: ఎర్రకోట సమీపంలో పేలుడు.. పది మంది మృతి.. హైదరాబాదులో అలెర్ట్

APCRDA: నవంబర్ 14-15 తేదీల్లో సీఐఐ భాగస్వామ్య సమ్మిట్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dharmendra Health Update: ధర్మేంద్ర ఆరోగ్యం నిలకడగా వుంది.. ఇషా డియోల్

మేల్ ఫెర్టిలిటీ నేపథ్యంగా లవ్ స్టోరీతో సాగే సంతాన ప్రాప్తిరస్తు - నిర్మాతలు

ఎస్ఎస్ దుష్యంత్, ఆషికా రంగనాథ్ కెమిస్ట్రీతో గత వైభవం ట్రైలర్

జూటోపియా 2 లో జూడీ హాప్స్‌కి వాయిస్‌ ఇచ్చిన శ్రద్ధా కపూర్‌

Faria Abdullah: సందీప్ కిషన్ హీరోగా సిగ్మా పవర్‌ఫుల్ ఫస్ట్ లుక్

తర్వాతి కథనం
Show comments